AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఆంధ్రా టు ఒడిశా.. దూసుకువస్తున్న ఆటో.. ఏంటా అని చెక్ చేయగా..

ఇద్దరు వ్యక్తులు.. ఆటో నిండా ఏవో తీసుకుని వస్తున్నారు.. అనుమానం రావడంతో అధికారులు ఆటోను ఆపారు.. పొంతన లేని సమాధానాలు చెప్తుండటంతో వారిని అదుపులోకి చెక్ చేశారు.. ఆటోలో ప్రత్యేక అర ఏర్పాటు చేసుకుని.. తాబేళ్లు స్మగ్లింగ్ చేస్తున్నట్లు అధికారులు నిర్ణయానికి వచ్చారు.. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Andhra: ఆంధ్రా టు ఒడిశా.. దూసుకువస్తున్న ఆటో.. ఏంటా అని చెక్ చేయగా..
Massive Turtle Smuggling Busted in Chintoor
Pvv Satyanarayana
| Edited By: |

Updated on: Nov 25, 2025 | 9:21 AM

Share

ఇద్దరు వ్యక్తులు.. ఆటో నిండా ఏవో తీసుకుని వస్తున్నారు.. అనుమానం రావడంతో అధికారులు ఆటోను ఆపారు.. పొంతన లేని సమాధానాలు చెప్తుండటంతో వారిని అదుపులోకి చెక్ చేశారు.. ఆటోలో ప్రత్యేక అర ఏర్పాటు చేసుకుని.. తాబేళ్లు స్మగ్లింగ్ చేస్తున్నట్లు అధికారులు నిర్ణయానికి వచ్చారు.. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భారీగా తాబేలు పట్టుబడిన సంఘటన అల్లూరి జిల్లా చింతూరు ఏజన్సీలో చోటుచేసుకుంది. రావులపాలెం నుండి వడిసాకు అక్రమంగా తరలిస్తున్న తాబేలను అటవీశాఖ అధికారులు గుర్తించి అడ్డుకున్నారు. చింతూరు మండలం తులసిపాక ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద తాబేలు తరలిస్తున్న వాహనాన్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తాబేళ్ల రవాణాకు అనువుగా ఉండేలా తయారుచేసిన ఆటోలో 248 తాబేలను గోనె సంచుల్లో మూటలు కట్టి తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.

ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. పట్టుబడ్డ తాబేళ్లలో 18 తాబేలు మృతి చెందగా మిగిలిన 230 తాబేలు సోకిలేరు వాగులో విడిచిపెట్టారు. అక్రమంగా తాబేలును తరలిస్తే కఠిన చర్యలు తప్పవంటూ అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. తాబేళ్లు ఎక్కడ నుంచి తీసుకువస్తున్నారు.. ఎవరి కోసం తరలిస్తున్నారన్న దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us