AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mrs.India: మిసెస్‌ ఇండియా కిరీటం గెల్చుకున్న విజయవాడ ముద్దుగుమ్మ..

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన మిసెస్‌ ఇండియా- 2021 అందాల పోటీల్లో విజయవాడకు చెందిన బిల్లుపాటి మల్లిక విజేతగా నిలిచారు. పేజెంట్స్‌ ప్రైవేట్‌ ఇండియా ఆధ్వర్యంలో మొత్తం నాలుగు

Mrs.India: మిసెస్‌ ఇండియా కిరీటం గెల్చుకున్న విజయవాడ ముద్దుగుమ్మ..
Basha Shek
| Edited By: |

Updated on: Dec 27, 2021 | 7:04 PM

Share

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన మిసెస్‌ ఇండియా- 2021 అందాల పోటీల్లో విజయవాడకు చెందిన బిల్లుపాటి మల్లిక విజేతగా నిలిచారు. పేజెంట్స్‌ ప్రైవేట్‌ ఇండియా ఆధ్వర్యంలో మొత్తం నాలుగు రోజులు పాటు మిసెస్‌ ఇండియా- 9వ సీజన్‌ పోటీలు జరిగాయి. దేశవ్యాప్తంగా మొత్తం 24 మంది మహిళలు ఈ అందాల పోటీల్లో తమ అదృష్టం పరీక్షించుకున్నారు. వివిధ రౌండ్ల అనంతరం12 మంది టైటిల్‌ బరిలో నిలిచారు. తాజాగా జరిగిన తుది విడత పోటీల్లో వారందరినీ వెనక్కు నెట్టి మిసెస్‌ ఇండియా కిరీటం కైవసం చేసుకున్నారు మల్లిక.

కాగా మల్లిక ఇన్‌స్టాగ్రామ్‌ ప్రొఫైల్‌ ప్రకారం.. విజయవాడకు చెందిన ఆమె తండ్రి పేరు సుంకర దుర్గాప్రసాద్‌. ఎంబీఏ పూర్తి చేశారు. 2019లో ‘శ్రీమతి అమరావతి’ టైటిల్‌ గెల్చుకున్నారు. ఆతర్వాత 2020లో వర్చువల్‌గా నిర్వహించిన ‘మిసెస్‌ ఏపీ’ అందాల పోటీల్లో సెకెండ్‌ రన్నరప్‌గా నిలిచారు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు సుమారు 19వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

Also Read:

Viral video: మ్యూజిక్‌ షూట్‌లో చేదు అనుభవం.. సింగర్‌ ముఖంపై కాటేసిన పాము.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..

Manchu Lakshmi: అందుకోసం కిడ్నీ అమ్ముకోవాల్సి వచ్చింది.. నెట్టింట్లో వైరల్‌గా మారిన మంచులక్ష్మి ట్వీట్‌..

S.Thaman : ఈ సారి ప్రేమికుల రోజును ముందుగానే సెలబ్రేట్‌ చేసుకుందాం.. తమన్‌ ఇంట్రెస్టింగ్‌ ట్వీట్‌..