Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu: వ్యవసాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష.. ఏటా మూడు పంటలు పండించేలా చర్యలు

ఏపీలో మూడు పంటల విధానంపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. పక్కా ప్రణాళికలతో రైతుకు మేలు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఎరువుల వాడకం తగ్గించి భూసారం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.. ఇంతకీ.. మూడు పంటల విధానంపై చంద్రబాబు ఆలోచన ఏంటి?

Chandrababu: వ్యవసాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష.. ఏటా మూడు పంటలు పండించేలా చర్యలు
Cm Chandrababu
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 10, 2025 | 9:10 PM

వ్యవసాయ పనులు ఊపందుకుంటున్న నేపథ్యంలో అమరావతి వేదికగా వ్యవసాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. వ్యవసాయానికి సంబంధించిన వివిధ అంశాలపై ఆ శాఖ అధికారులతో చర్చించిన చంద్రబాబు.. కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇకపై.. 365 రోజులు సాగు భూములు పచ్చగా ఉండేలా చూడాలని.. అందుకు అనుగుణంగానే.. మూడు పంటల విధానం తీసుకురావాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. వచ్చే ఏడాది వేసవిలో ఉత్తర కోస్తా, గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాల్లోని 5 లక్షల ఎకరాల్లో వేసవి పంటలు వేయాలని చెప్పారు. అనంతపురం లాంటి జిల్లాల్లో ఏడాది కాలంలో కేవలం 4 నెలలే పంటలు సాగు చేసి, 8 నెలల పాటు భూములు ఖాళీగా వదిలేస్తున్నారని.. దీని వల్ల భూసారం దెబ్బతింటోందన్నారు. ఇలాంటి పరిస్థితులకు చెక్‌ పెట్టి.. మిగిలిన 8 నెలలు కూడా ఏదో ఒక పంట సాగు చేసే పరిస్థితులు కల్పించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. వచ్చే వేసవిలో జలవనరుల లభ్యత ఉన్న 141 మండలాల్లోనూ పంటల సాగు జరిగేలా రైతుల్ని సన్నద్ధం చేయాలన్నారు.

ఖరీఫ్ పంటలపై కీలక సూచనలు చేశారు. ప్రధానంగా.. తుఫాన్ల నుంచి ఖరీఫ్ పంటలను రక్షించుకునేలా పంటకాలాన్ని ముందుకు తీసుకురావాలన్నారు. అలాగే.. వరిలో అధిక డిమాండ్ ఉన్న సన్నరకాలను పండిచేలా రైతులను ప్రోత్సహించాలని.. అంతర పంటలపైనా దృష్టి సారించేలా రైతుల్లో అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు సూచించారు. మరోవైపు.. ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించి.. భూసారాన్ని కాపాడేందుకు కృషి చేయాలని.. ఎరువుల కొరత లేకుండా చూడాలని.. ఎరువులు, పురుగుమందుల వినియోగంపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్నారు సీఎం చంద్రబాబు. ఇక.. ముందస్తు పంటల సాగు కార్యాచరణ మొదలుపెట్టినట్లు సీఎం చంద్రబాబుకు తెలిపారు వ్యవసాయ శాఖ అధికారులు. గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాలకు ఈ ఏడాది ముందుగానే సాగునీరు విడుదల చేసినట్లు గుర్తు చేశారు.

భార్య కళ్లెదుటే భర్త హత్య.. అసలు స్కెచ్ ఎవరిది!
భార్య కళ్లెదుటే భర్త హత్య.. అసలు స్కెచ్ ఎవరిది!
తెలంగాణలో కొత్త నవోదయ విద్యాలయాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్!
తెలంగాణలో కొత్త నవోదయ విద్యాలయాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్!
ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య భీకర యుద్దం.. రాజీకి రావాలని ట్రంప్ పిలుపు
ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య భీకర యుద్దం.. రాజీకి రావాలని ట్రంప్ పిలుపు
ఈ సీడ్స్ తింటున్నారా..? వీటితో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి..!
ఈ సీడ్స్ తింటున్నారా..? వీటితో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి..!
టీ అలవాటును కాస్త మార్చండి చాలు.. మీకు ఈ సమస్య ఉండదు..!
టీ అలవాటును కాస్త మార్చండి చాలు.. మీకు ఈ సమస్య ఉండదు..!
యోగాంధ్రకు సర్వం సిద్ధం.. ఏర్పాట్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు!
యోగాంధ్రకు సర్వం సిద్ధం.. ఏర్పాట్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు!
పనసపండుతో మొదలైన గొడవ.. తమ్ముడి ప్రాణం తీసే వరకు ఎలా వెళ్లింది?
పనసపండుతో మొదలైన గొడవ.. తమ్ముడి ప్రాణం తీసే వరకు ఎలా వెళ్లింది?
పిల్లలకు ఈ అలవాట్లు నేర్పితే.. మస్త్ స్ట్రాంగ్‌ గా ఉంటారు..!
పిల్లలకు ఈ అలవాట్లు నేర్పితే.. మస్త్ స్ట్రాంగ్‌ గా ఉంటారు..!
ఈ కూరగాయను తక్కువ అంచనా వేయకండి.. ఎన్నో రోగాలకు మందు ఇది..!
ఈ కూరగాయను తక్కువ అంచనా వేయకండి.. ఎన్నో రోగాలకు మందు ఇది..!
బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటే పోటెత్తిన జనం - ఆ తర్వాత
బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటే పోటెత్తిన జనం - ఆ తర్వాత