AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.. ఎందుకంటే.?

ఆ గ్రామంలో మద్యం అమ్మితే.. దబిడి దిబిడే అంటున్నారు గ్రామ పెద్దలు. ఎవరైనా మద్యం అమ్మితే కచ్చితంగా రూ. లక్ష జరిమానా ఉంటుందని అన్నారు. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని వాళ్లు అన్నారు. మరి ఆ గ్రామం ఎక్కడుందో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

Telangana: ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.. ఎందుకంటే.?
Liquor Sales
P Shivteja
| Edited By: |

Updated on: Dec 27, 2025 | 1:59 PM

Share

నూతనంగా ప్రజలచే ఎన్నుకున్న సర్పంచ్ పాలకవర్గం గ్రామంలో మద్యపాన నిషేధాన్ని విధించారు. ఆయా గ్రామ పంచాయతీల ముందు పాలకవర్గం ప్రతిజ్ఞ చేస్తూ గ్రామంలో మద్యం అమ్మొద్దని తీర్మానం చేశారు. అందులో భాగంగానే సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట-భూంపల్లి మండలం బొప్పాపూర్ గ్రామ సర్పంచ్ భాను ప్రసాద్ ఆధ్వర్యంలో పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. తమ గ్రామంలో ఎవరైనా మద్యం అమ్మితే లక్ష రూపాయల జరిమానా, పాలన చేసేవాళ్లు అమ్ముతున్నారని చెప్పినా.. వారికి పదివేల నజరానా ప్రకటిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

మొట్టమొదటి తీర్మానం కింద గ్రామంలో మద్యపానాన్ని నిషేధించారు. ఈ సందర్భంగా సర్పంచ్ భాను మాట్లాడుతూ.. గ్రామాలలో మద్యం ఏరులై పారుతోందని.. సామాన్యుడు పొద్దంతా పనిచేస్తే వచ్చే డబ్బులను మద్యానికి పెట్టి మద్యం సేవించి కుటుంబాలను పాడు చేసుకుంటున్నారని.. మద్యం మహమ్మారిని తరిమికొట్టడానికే మద్యపాన నిషేధం చేస్తున్నామని అన్నారు. మెదక్ పార్లమెంటు సభ్యులు మాధవనేని రఘునందన్ రావు స్వగ్రామం కావడం.. రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అందరం కలిసికట్టుగా పనిచేస్తామని గ్రామస్తులు అంటున్నారు. గ్రామాలలో మద్యం విచ్చలవిడిగా కొనసాగుతున్నాయని, ప్రతి గ్రామంలో మద్యపాన నిషేధాన్ని చేస్తే బాగుంటుందని అన్నారు గ్రామస్తులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం