గంపెడు టమాటల కోసం రెండు గ్రూపుల ఘర్షణ.. 20 మంది మృతి.. రంగంలోకి దిగిన పోలీసులు.. కఠినమైన ఆంక్షలు

ఏదైనా ఘర్షణకు దిగుతుంటే అది మన జీవితానికో, ఆర్థికంగానో ఉపయోగపడేలా ఉండాలి. అందులో బంగారం కోసమో.. వజ్రాల కోసమో ఘర్షణ పడ్డామంటే ఓ లెక్క ఉంటుంది. అలాగే కొందరు ముఖ్యమైన..

గంపెడు టమాటల కోసం రెండు గ్రూపుల ఘర్షణ.. 20 మంది మృతి.. రంగంలోకి దిగిన పోలీసులు.. కఠినమైన ఆంక్షలు
Follow us

|

Updated on: Mar 11, 2021 | 1:04 PM

ఏదైనా ఘర్షణకు దిగుతుంటే అది మన జీవితానికో, ఆర్థికంగానో ఉపయోగపడేలా ఉండాలి. అందులో బంగారం కోసమో.. వజ్రాల కోసమో ఘర్షణ పడ్డామంటే ఓ లెక్క ఉంటుంది. అలాగే కొందరు ముఖ్యమైన దాని గురించి ఘర్షణలకు దిగి ప్రాణాలు పోగొట్టుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం విచిత్రమైన ఘర్షణ చోటు చేసుకుంది. దీని గురించి ఎవరు విన్నా.. ఆశ్చర్యపోతారు. గంపెడు టమాటల కోసం రెండు గ్రూపులుగా విడిపోయి ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్లింది. ఇది నిజమేనా..? అని వినడానికి ఆశ్యర్యంగా ఉండవచ్చు. కానీ మీరు చదువుతున్నది నిజమే. కేవలం గంపెడు టమాటల కోసం నైజీరియా దేశస్తులు కొట్టుకోవడం సంచలనం రేపుతోంది. ఈ ఘర్షణలో ఇప్పటి వరకు 20 మంది మృతి చెందారు.

ఆఫ్రీకా దేశమైన నైజీరియాలో టమాట బుట్ట కారణంగా ఘర్షణ చెలరేగింది. దేశం ఉత్తరం, దక్షిణ అని రెండు విడిపోయింది. అయితే గత నెలలో ఒక వ్యక్తి బుట్టలో టమాటలతో నైరుతి నగరమైన ఇబాడాన్లోని మార్కెట్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగి టమాటలు రోడ్డుపై పడి అంతటా పడిపోయాయి. ఇది సమీపంలోని దుకాణదారులు, పోర్టర్‌లతో వాదనకు దారి తీసింది. ఆ వాగ్వివాదం కాస్తా ఘర్షణకు దారితీసి పెద్ద పోరాటంగా మారింది. అయితే ఇందుకు సంబంధించిన వార్తను సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత మరింత పెరిగింది. దేశం ఉత్తర ముస్లింలు-దక్షిణ క్రైస్తవులు విడిపోయారు. ఈ ఉద్రిక్తత జరిగిన నాలుగు గంటల తర్వాత హింసాత్మకంగా మారింది. అనేక ప్రాంతాల్లో దుకాణాలపై దాడి చేసి పలువురిని అగ్నికి ఆహుతి చేశారు. ఈ హింసాత్మక ఘటనలో ఇప్పటి వరకు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది ఇండ్లను వదిలి పారిపోయారు. నైజీరియాలోని అతిపెద్ద నగరమైన లాగోస్‌లో మాంసం అందుబాటులో లేకుండా పోయింది. టమాటలతో పాటు మిగతా కూరగాయల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. ఘర్షణలను నివారించేందుకు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాకుండా ఆంక్షలు విధించారు. ఇలా తమాటల కారణంగా ఇంత మంది మృతి చెందడం సంచలనంగా మారింది.

ఇవి చదవండి :

ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. 26 మంది దుర్మరణం.. 35 మందికి తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందిన కుమారుడే తల్లిదండ్రులపైన కేసు పెట్టాడు.. కారణం ఏమిటో తెలిస్తే..

H-1B Vias: గుడ్‌న్యూస్‌.. హెచ్‌-1బీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం.. రిజిస్ట్రేషన్‌ ప్రాసెస్‌ ఎలా ఉంటుంది..?

అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్