AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. 26 మంది దుర్మరణం.. 35 మందికి తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం

ఓ బస్సు ప్రమాదం 26 మందిని బలి తీసుకుంది. యాత్రికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోవడంతో ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కొందరు తీవ్రంగా గాయపడి ..

ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. 26 మంది దుర్మరణం.. 35 మందికి తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం
Subhash Goud
|

Updated on: Mar 11, 2021 | 9:56 AM

Share

ఓ బస్సు ప్రమాదం 26 మందిని బలి తీసుకుంది. యాత్రికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోవడంతో ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కొందరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. తాజాగా ఇండోనేషియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జవాలో బుధవారం అర్ధరాత్రి పర్యాటక బస్సు లోయలో పడిపోవడంతో 26 మంది యాత్రికులు మృతి చెందారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే బస్సు బ్రేకులు ఫేయిల్‌ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద విషయం తెలుసుకున్న అధికారులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఇస్లామిక్‌ జూనియర్‌ హైస్కూల్‌ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను జావా ప్రావిన్స్‌ పట్టణం సుబాంగ్‌ నుంచి ఆసిక్మాలయ జిల్లాలోని ఓ తీర్థయాత్రకు తీసుకెళ్తుండగా బుధవారం అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అయితే బస్సు వెళ్తుండగా డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో లోయలోకి దూసుకెళ్లినట్లు తెలిపారు. బస్సు సుమారు 65 అడుగుల లోతులో పడిపోయినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. అయితే బ్రేకులు సరిగ్గా పని చేయకపోవడంతో బస్సు లోయలో పడినట్లు క్షతగాత్రులు అధికారులకు తెలిపారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.

ఘటన స్థలంలో 26 మృతదేహాలను వెలికి తీశాం..

కాగా, ప్రమాదం స్థలం నుంచి 26 మృతదేహాలను వెలికి తీసినట్లు బాండుంగ్‌ సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ ఏజెన్సీ చీఫ్‌ దేడెన్‌ రిద్వాన్సా తెలిపారు. అలాగే 35 మంది గాయపడినట్లు తెలిపారు. వారిని అంబులెన్స్‌లో సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. మృతుల్లో వాహనం డ్రైవర్‌ కూడా ఉన్నారు. ఇండోనేషియాలో గతంలో జరిగిన పలు ప్రమాదాల్లో అధిక సంఖ్యలో మరణించారు. 2019 డిసెంబర్‌లో సమత్రా దీవుల్లో బస్సు నదిలో పడిన ఘటనలో 35 మంది వరకు మరణించగా, 2018లో పశ్చిమ జవాలోని కొండ ప్రాంతంలో పర్యాటక బస్సు లోబ్తా పడిన ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇవి చదవండి :

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు – కారు ఢీ.. 8 మంది దుర్మరణం.. పలువురికి తీవ్ర గాయాలు

నిజామాబాద్‌లో దొంగతనానికి పాల్పడిన చెడ్డీ గ్యాంగ్‌పై న్యాయస్థానం సంచలన తీర్పు.. ముఠా సభ్యులకు ఏడేళ్ల జైలు శిక్ష

పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్