AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. 26 మంది దుర్మరణం.. 35 మందికి తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం

ఓ బస్సు ప్రమాదం 26 మందిని బలి తీసుకుంది. యాత్రికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోవడంతో ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కొందరు తీవ్రంగా గాయపడి ..

ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. 26 మంది దుర్మరణం.. 35 మందికి తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం
Subhash Goud
|

Updated on: Mar 11, 2021 | 9:56 AM

Share

ఓ బస్సు ప్రమాదం 26 మందిని బలి తీసుకుంది. యాత్రికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోవడంతో ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కొందరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. తాజాగా ఇండోనేషియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జవాలో బుధవారం అర్ధరాత్రి పర్యాటక బస్సు లోయలో పడిపోవడంతో 26 మంది యాత్రికులు మృతి చెందారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే బస్సు బ్రేకులు ఫేయిల్‌ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద విషయం తెలుసుకున్న అధికారులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఇస్లామిక్‌ జూనియర్‌ హైస్కూల్‌ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను జావా ప్రావిన్స్‌ పట్టణం సుబాంగ్‌ నుంచి ఆసిక్మాలయ జిల్లాలోని ఓ తీర్థయాత్రకు తీసుకెళ్తుండగా బుధవారం అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. అయితే బస్సు వెళ్తుండగా డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో లోయలోకి దూసుకెళ్లినట్లు తెలిపారు. బస్సు సుమారు 65 అడుగుల లోతులో పడిపోయినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. అయితే బ్రేకులు సరిగ్గా పని చేయకపోవడంతో బస్సు లోయలో పడినట్లు క్షతగాత్రులు అధికారులకు తెలిపారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.

ఘటన స్థలంలో 26 మృతదేహాలను వెలికి తీశాం..

కాగా, ప్రమాదం స్థలం నుంచి 26 మృతదేహాలను వెలికి తీసినట్లు బాండుంగ్‌ సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ ఏజెన్సీ చీఫ్‌ దేడెన్‌ రిద్వాన్సా తెలిపారు. అలాగే 35 మంది గాయపడినట్లు తెలిపారు. వారిని అంబులెన్స్‌లో సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. మృతుల్లో వాహనం డ్రైవర్‌ కూడా ఉన్నారు. ఇండోనేషియాలో గతంలో జరిగిన పలు ప్రమాదాల్లో అధిక సంఖ్యలో మరణించారు. 2019 డిసెంబర్‌లో సమత్రా దీవుల్లో బస్సు నదిలో పడిన ఘటనలో 35 మంది వరకు మరణించగా, 2018లో పశ్చిమ జవాలోని కొండ ప్రాంతంలో పర్యాటక బస్సు లోబ్తా పడిన ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇవి చదవండి :

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు – కారు ఢీ.. 8 మంది దుర్మరణం.. పలువురికి తీవ్ర గాయాలు

నిజామాబాద్‌లో దొంగతనానికి పాల్పడిన చెడ్డీ గ్యాంగ్‌పై న్యాయస్థానం సంచలన తీర్పు.. ముఠా సభ్యులకు ఏడేళ్ల జైలు శిక్ష

ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..