AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine War: ఉక్రెయిన్ తూర్పు భాగంలో రష్యా దళాల దాడి.. డాన్‌బాస్‌లో 21 మంది పౌరుల మృతి

రష్యా సైన్యం ఉక్రెయిన్ దేశంలోని తూర్పు ప్రాంతంలో దాడులను ముమ్మరం చేసింది. తాజాగా అటు విదేశీ ఆయుధాల సరఫరాను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతంలో రష్యా సైన్యం దాడులు చేసింది.

Russia Ukraine War: ఉక్రెయిన్ తూర్పు భాగంలో రష్యా దళాల దాడి.. డాన్‌బాస్‌లో 21 మంది పౌరుల మృతి
Russian Troops Attack
Balaraju Goud
|

Updated on: May 05, 2022 | 12:01 PM

Share

Russia Ukraine Crisis: రష్యా సైన్యం ఉక్రెయిన్ దేశంలోని తూర్పు ప్రాంతంలో దాడులను ముమ్మరం చేసింది. తాజాగా అటు విదేశీ ఆయుధాల సరఫరాను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతంలో రష్యా సైన్యం దాడులు చేసింది. ఈ నేపథ్యంలో యురోపియన్ యూనియన్ రష్యాను శిక్షించడానికి సిద్ధమవుతోంది. చమురు దిగుమతులపై నిషేధాన్ని ప్రతిపాదించింది. మరోవైపు తూర్పు డాన్‌బాస్ ప్రాంతంలో జరిగిన దాడుల్లో 21 మంది పౌరులు మరణించారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. మే 9న ‘విక్టరీ డే’ కోసం రష్యా సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో గత రోజు దాడులు పెరిగాయి. నాజీ జర్మనీపై సోవియట్ యూనియన్ సాధించిన విజయాన్ని విక్టరీ డేగా జరుపుకుంటున్నారు.

రష్యా మిలిటరీ బుధవారం ఉక్రెయిన్‌లోని ఐదు రైల్వే స్టేషన్‌లలోని విద్యుత్ సౌకర్యాలను ధ్వంసం చేయడానికి సముద్ర, వాయు ప్రయోగ క్షిపణులను ఉపయోగించింది. ఫిరంగి, విమానాలు ఈ సైనిక చర్యలో పాల్గొన్నాయి. సైనిక స్థావరాలు, ఇంధనం, మందుగుండు డిపోలపై దాడి చేశాయని స్థానిక అధికారులు చెప్పారు. మరోవైపు, మారియుపోల్‌లోని ఉక్కు కర్మాగారాన్ని రష్యా సైన్యం ముట్టడించింది. అక్కడ నుండి గత కొన్ని రోజులుగా అనేక మంది పౌరులు ఖాళీ చేసింది ఉక్రెయిన్ ప్రభుత్వం. కాగా, తాము ప్లాంట్‌పై దాడి చేయడాన్ని రష్యా అధికారి ఖండించారు. అయితే, రష్యా సైనికులు ప్లాంట్‌పై దాడి చేశారని ఉక్రెయిన్ దళాలు పేర్కొన్నాయి.

ఇదిలావుంటే, ఈ సంవత్సరం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పరిమిత విజయాన్ని ప్రకటించడానికి ప్రత్యేక సైనిక చర్య విస్తరించడాన్ని ప్రపంచ దేశాలు తప్పుబడుతున్నాయి. పూర్తి యుద్ధాన్ని ప్రకటించి, పుతిన్ ‘మార్షల్ లా’ని అమలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధంలో రిజర్వ్ సైనికులను కూడా చేర్చి మరింత భయానకంగా మార్చారని యూరఫ్ దేశాలు మండిపడుతున్నాయి. మరోవైపు, ఉక్రెయిన్‌తో జరిగిన యుద్ధంలో పెద్ద సంఖ్యలో రష్యా సైనికులు మరణించారని పాశ్చాత్య అధికారులు చెబుతున్నారు. క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ బుధవారం ఈ ఊహాగానాలను కొట్టిపారేశారు.

ఇవి కూడా చదవండి

ఉక్రెయిన్‌లో కొత్త దాడుల మధ్య రష్యా మిత్రదేశం బెలారస్ సైనిక విన్యాసాలను ప్రకటించింది. మిన్స్క్‌లో, రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం ప్రారంభమైన సైనిక కసరత్తులు ఏ పొరుగువారిని బెదిరించడానికి ఉద్దేశించినవి కావని పేర్కొంది. అయితే బెలారస్ యుద్ధంలో చేరితే దేశం చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉంటుందని ఉక్రేనియన్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రష్యా ఉక్రెయిన్‌లోని ప్రముఖ ప్రాంతాలపై దాడి చేస్తున్నప్పుడు, వాటిలో చాలా వరకు పోలాండ్ సరిహద్దుకు సమీపంలో ఉన్న పశ్చిమ నగరమైన ఎల్వివ్‌పై కేంద్రీకృతమై ఉన్నాయి. ఇది దేశానికి ‘నాటో’ సరఫరా చేసిన ఆయుధాలను తీసుకురావడానికి ముఖ్యమైన మార్గం.

మరోవైపు, ఇప్పటివరకు చెదురుమదురు దాడులను మాత్రమే ఎదుర్కొంటున్న నగరంలో మంగళవారం అర్థరాత్రి పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఎక్కడెక్కడో చెలరేగిన యుద్ధంలో తప్పించుకున్న వారికి ఇది ఆశ్రయంగా మారింది. ఈ దాడుల్లో మూడు విద్యుత్ సబ్ స్టేషన్లు దెబ్బతిన్నాయి. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందని మేయర్ తెలిపారు. ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని ప్రకటించారు.

రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ కొనాషెంకోవ్ మాట్లాడుతూ రైలు మౌలిక సదుపాయాలపై దాడులు పాశ్చాత్య ఆయుధాల సరఫరాకు అంతరాయం కలిగించే ఉద్దేశ్యంతో ఉన్నాయన్నారు. రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ఉక్రెయిన్‌కు పాశ్చాత్య దేశాలు ఆయుధాలను సరఫరా చేస్తున్నాయని ఉన్నత సైనిక అధికారులతో అన్నారు. ఉక్రెయిన్‌లోకి పాశ్చాత్య ఆయుధాల ప్రవేశం దాని దళాలు ప్రారంభ రష్యన్ దాడిని అణచివేయడంలో సహాయపడింది. డాన్‌బాస్ కోసం యుద్ధంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. యుద్ధం ప్రారంభ వారాల్లో కైవ్‌ను స్వాధీనం చేసుకోవడంలో విఫలమైన తర్వాత మాస్కో ఇప్పుడు డాన్‌బాస్‌పై దృష్టి సారించిందని చెబుతోంది.

నిర్ణయాత్మక యుద్ధానికి ముందు ఆయుధాల సరఫరాను పెంచాలని ఉక్రెయిన్ పశ్చిమ దేశాలను కోరింది. గతంలో ఉక్రెయిన్‌కు సహాయం చేయడంలో నిదానంగా వ్యవహరించిన జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ బుధవారం ఉక్రెయిన్‌కు వివిధ ఆయుధాలను సరఫరా చేయాలని తమ ప్రభుత్వం చూస్తోందని చెప్పారు. రష్యా దాడుల్లో మంగళవారం 21 మంది మరణించారని డాన్‌బాస్ ప్రాంతంలోని తూర్పు డొనెట్స్క్ ప్రాంతం గవర్నర్ తెలిపారు. అంతకుముందు ఏప్రిల్ 8న క్రామాటోర్స్క్‌లోని రైల్వే స్టేషన్‌పై క్షిపణి దాడిలో కనీసం 59 మంది మరణించారు.

Read Also… Rahul vs KTR: నేను సిద్ధమే.. నీవు సిద్ధమా.. రాహుల్‌‌కు కేటీఆర్ వైట్‌ చాలెంజ్‌.. భాగ్యనగరంలో బ్యానర్ల పంచాయితీ!

Follow Us