AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi US Visit: ప్రధాని మోడీకి ఆకాశం కూడా హద్దు కాదు.. భేటీ అనంతరం ప్రముఖుల కీలక వ్యాఖ్యలు

PM Modi US Visit: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. బుధవారం నుంచి ఈ నెల 24 వరకు ఆయన అమెరికాలో బిజీబిజీగా పర్యటించనున్నారు. దీనిలో భాగంగా.. బుధవారం న్యూయార్క్‌లోని లొట్టే న్యూయార్క్‌ ప్యాలెస్‌లో

PM Modi US Visit: ప్రధాని మోడీకి ఆకాశం కూడా హద్దు కాదు.. భేటీ అనంతరం ప్రముఖుల కీలక వ్యాఖ్యలు
Pm Modi Us Visit
Shaik Madar Saheb
| Edited By: Ravi Kiran|

Updated on: Jun 21, 2023 | 9:14 AM

Share

PM Modi US Visit: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. బుధవారం నుంచి ఈ నెల 24 వరకు ఆయన అమెరికాలో బిజీబిజీగా పర్యటించనున్నారు. దీనిలో భాగంగా.. బుధవారం న్యూయార్క్‌లోని లొట్టే న్యూయార్క్‌ ప్యాలెస్‌లో ప్రధాని మోడీ పలువురు అంతర్జాతీయ ప్రముఖులు, శాస్త్రవేత్తుల, ఆర్థిక నిపుణులతో వరుసగా భేటీ అవుతున్నారు. ట్విట్టర్‌ సీఈవో, టెస్లా అధినేత ఎలోన్‌ మస్క్‌ తోపాటు ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త, రచయిత నీల్‌ డి గ్రాస్సే టైసన్‌, నోబెల్ పురస్కార గ్రహీత ఆర్థికవేత్త పాల్ రోమర్, రచయిత నికోలస్ నాసిమ్ తలేబ్, ప్రఖ్యాత పెట్టుబడిదారుడు, విశ్లేషకుడు రే డాలియో తదితరులు ప్రధాని మోడీని కలిసి.. పలు విషయాలపై సుధీర్ఘంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్థిక, పలు రంగాల గురించి ప్రధాని మోడీ వారితో చర్చించారు.

ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త నీల్ డిగ్రాస్ టైసన్ ఏమన్నారంటే..

ప్రధాని మోడీతో భేటీ అనంతరం.. ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త నీల్ డిగ్రాస్ టైసన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రధాని మోదీకి ఆకాశమే హద్దు కాదు.. శాస్త్రోక్తంగా ఆలోచించే లీడర్‌తో భేటీ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది.. చాలా మంది ప్రపంచ నాయకులకు ప్రాధాన్యతలు అసమతుల్యత కావచ్చు, కానీ ప్రధాని మోడీ పరిష్కారాలతో సహా అనేక విషయాలపై శ్రద్ధ వహిస్తారు.. భారతదేశం సాధించగలిగే శక్తికి పరిమితి లేదని చెప్పినప్పుడు నేను ఒంటరిగా లేను అనిపించింది’’ అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

వ్యాపారవేత్త రే డాలియో..

ప్రఖ్యాత పెట్టుబడిదారుడు, విశ్లేషకుడు రే డాలియో ప్రధానమంత్రిని కలిసిన తర్వాత సంతోషం వ్యక్తంచేశారు. ‘‘ప్రధాని నరేంద్ర మోడీ అన్ని విషయాలపై సమగ్రంగా మాట్లాడుతారు.. భారతదేశ సమయం వచ్చినప్పుడు వెంటనే చెబుతారు.. భారతదేశం సంభావ్యత అపారమైనది.. మీరు ఇప్పుడు రూపాంతరం చెందగల సామర్థ్యాన్ని కలిగి ఉన్న సంస్కర్తను కలిగి ఉన్నారు.. భారతదేశ సమయం వచ్చింది.. ప్రధాని మోడీ చాలా అవకాశాలను సృష్టించే తరుణంలో ఉన్నారు’’ అని పేర్కొన్నారు.

పాల్ రోమర్ ఏమన్నారంటే..

నోబెల్ బహుమతి గ్రహీత పాల్ రోమర్ ప్రధానిని కలిసిన తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు. నేను ఏదైనా నేర్చుకున్నప్పుడు.. ‘‘భారతదేశం ఏమి చేస్తుందో దాని ద్వారా నేర్చుకోగలుతాను.. ఆధార్ వంటి ప్రోగ్రామ్‌ల ద్వారా భారతదేశం ప్రామాణీకరణ ముందు ప్రపంచానికి మార్గాన్ని చూపుతుంది. PM దానిని చాలా బాగా వ్యక్తీకరించారు. ఆ పట్టణీకరణ సమస్య కాదు. ఇది ఒక అవకాశం. నేను దీనిని నినాదంగా తీసుకుంటాను.’’ అని తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..