CAIRN DISPUTE: న్యూయార్క్ కోర్టులో భారత్‎కు ఊరట.. కెయిర్న్​ ప్రయత్నాలకు అడ్డుకట్ట

అమెరికాలోని న్యూయార్క్ కోర్టులో భారత్‎కు ఊరట లభించింది. అమెరికాలోని ఎయిర్​ఇండియా ఆస్తులను స్వాధీనం చేసుకోవాలన్న కెయిర్న్​ప్రయత్నాలను న్యూయార్క్​ జిల్లా కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది.

CAIRN DISPUTE: న్యూయార్క్ కోర్టులో భారత్‎కు ఊరట.. కెయిర్న్​ ప్రయత్నాలకు అడ్డుకట్ట
New York Court
Follow us

|

Updated on: Sep 26, 2021 | 4:45 PM

అమెరికాలోని న్యూయార్క్ కోర్టులో భారత్‎కు ఊరట లభించింది. అమెరికాలోని ఎయిర్​ఇండియా ఆస్తులను స్వాధీనం చేసుకోవాలన్న కెయిర్న్​ప్రయత్నాలను న్యూయార్క్​ జిల్లా కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టు (ఆర్బిట్రేషన్​ కోర్టు) ఇచ్చిన తీర్పు మేరకు.. 1.2 బిలియన్​ డాలర్లు రాబట్టుకునేందుకు.. ఆమెరికాలోని ఎయిర్​ ఇండియా ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు కెయిర్న్​ ప్రయత్నాలు చేస్తోంది. అయితే రెట్రోస్పెక్టివ్‌ పన్నును రద్దు చేసేందుకు కొత్త చట్టాన్ని రూపొందిస్తున్నందున.. అప్పటి వరకు స్టే విధించాలని భారత ప్రభుత్వం న్యూయార్క్ కోర్టును కోరింది. భారత్ అభ్యర్థనను పరిశీలించిన కోర్టు ఎయిర్​ఇండియా ఆస్తుల జప్తు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసింది.

వివాదం ఎందుకొచ్చింది. 2006లో కెయిర్న్ ఎనర్జీ కంపెనీ అంతర్గత పునర్‌వ్యవస్థీకరణ సమాచారాన్ని కోరుతూ కేంద్ర ప్రభుత్వ పన్నుల విభాగం నోటీసులు జారీ చేసింది. సమాచారాన్ని పరిశీలించిన అనంతరం 2015లో రూ.10,247 కోట్ల పన్నులు చెల్లించాలని కోరింది. పునర్‌వ్యవస్థీకరణ వల్ల వచ్చిన మూలధన రాబడిపై ఈ మేరకు పన్ను చెల్లించాలని కోరింది. 2010-11లో కెయిర్న్‌‌ ఎనర్జీ భారత్‌లోని తన అనుబంధ సంస్థ ‘కెయిర్న్‌‌ ఇండియా’ను వేదాంతకు విక్రయించింది. ఈ క్రమంలో వేదాంతలో ప్రిఫరెన్షియల్‌ షేర్లతో పాటు ఐదు శాతం వాటాలను ఇచ్చారు. దీంతో వేదాంతలోని ఐదు శాతం కెయిర్న్‌‌ ఎనర్జీ షేర్లను భారత ప్రభుత్వం అటాచ్‌ చేసింది. అలాగే రూ.1,140 కోట్ల డివిడెండ్లు, రూ.1,590 కోట్ల ట్యాక్స్‌ రీఫండ్‌ కూడా నిలిపివేసింది. తదనంతరం తమకు రావాల్సిన పన్ను వసూలు కోసం అటాచ్‌ చేసిన వేదాంత షేర్లను విక్రయించింది.

దీంతో బ్రిటన్‌‌-భారత్‌ ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం(బీఐటీ) కింద ఈ నోటీసులను సవాలు చేస్తూ కెయిర్న్‌ ఎనర్జీ ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించింది. భారత్​.. కెయిర్న్​కు 1.2 బిలియన్‌ డాలర్లు చెల్లించాలని మధ్యవర్తిత్వ కోర్టులో తీర్పు వెల్లడించింది. భారత్ 1.2 బిలియన్ డాలర్లు కెయిర్న్ చెల్లించకపోవటంతో ఆ కంపెనీ అమెరికాలోని ఎయిర్​ఇండియా ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించింది. దీనిపై భారత్ న్యూయార్క్ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన కోర్టు ఎయిర్​ఇండియా ఆస్తులను స్వాధీనం చేసుకోవాలన్న కెయిర్న్​ ప్రయత్నాలను న్యూయార్క్​ జిల్లా కోర్టు తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను నవంబర్ 18కి వాయిదా వేసింది.

మరిన్ని ఇక్కడ చూడండి: Aditya Birla AMC IPO: సెప్టెంబర్ 29 నుంచి అదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ ఐపీఓ

Ganesh Immersion : తాబేళ్లపై ఊరేగుతున్న బుల్లి గణపయ్య.. చూడముచ్చటైన వీడియో

Latest Articles
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..