AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Terror Attack: న్యూజిలాండ్ సూపర్ మార్కెట్‌ వద్ద ఉగ్రదాడి.. కత్తిపోట్లకు ఆరుగురికి గాయాలు.. ఉగ్రవాది కాల్చివేత

న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లోని సూపర్‌మార్కెట్‌లో ఉగ్రదాడి జరగడంతో ఆరుగురు గాయపడ్డారు. ఉన్మాదిని పోలీసులు మ‌ట్టుబెట్టిన‌ట్లు ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ తెలిపారు.

Terror Attack: న్యూజిలాండ్ సూపర్ మార్కెట్‌ వద్ద ఉగ్రదాడి.. కత్తిపోట్లకు ఆరుగురికి గాయాలు.. ఉగ్రవాది కాల్చివేత
New Zealand Stabbing Attack
Balaraju Goud
|

Updated on: Sep 03, 2021 | 1:04 PM

Share

New Zealand Stabbing Attack: న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లోని సూపర్‌మార్కెట్‌లో ఉగ్రదాడి జరగింది.  ఈఘటనలో కనీసం ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క‌త్తితో పొడిచిన ఆ ఉన్మాదిని పోలీసులు మ‌ట్టుబెట్టిన‌ట్లు ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ తెలిపారు. శ్రీలంకకు చెందిన‌ ఐఎస్ఐఎస్ ప్రేరేపిత ఉగ్రవాది ఈ దాడికి పాల్పడిన‌ట్లు ఆమె చెప్పారు. క‌త్తిదాడి జ‌రిగిన 60 సెక‌న్ల లోపే ఆ ఉన్మాదిని హ‌త‌మార్చిన‌ట్లు జెసిండా వెల్లడించారు.

ఈ దాడికి పాల్పడిన వ్యక్తి 2011లో న్యూజిలాండ్‌కు వ‌చ్చాడ‌ని, 2016 నుంచి అత‌నిపై జాతీయ భ‌ద్రతా ద‌ళం నిఘా పెట్టిన‌ట్లు ఆమె పేర్కొన్నారు. ఆ ఉన్మాది భావ‌జాలం విప‌రీతంగా ఉన్న నేప‌థ్యంలో అత‌నిపై నిఘా పెట్టిన‌ట్లు జెసిండా తెలిపారు. కోర్టు అణచివేత ఉత్తర్వులకు లోబడి ఉన్నందున ఆ వ్యక్తి గురించి బహిరంగంగా చెప్పడానికి ఆమె నిరాకరించారు.

ఇస్లామిక్ స్టేట్ ప్రేరేపిత ఉన్మాది సూప‌ర్‌మార్కెట్‌లో క‌త్తితో బీభ‌త్సం సృష్టించిన‌ట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రజ‌లు ఆ మార్కెట్ నుంచి భయంతో అటూ ఇటూ ప‌రుగులు తీశార‌న్నారు. అరుపులు, కేక‌లు పెట్టార‌న్నారు. ఓ వ్యక్తి క‌త్తిపోట్లతో కింద‌ప‌డిపోయిన‌ట్లు ఒక‌రు తెలిపారు. అనేక మంది కత్తిపోట్లతో నేలపై పడి ఉండటాన్ని తాము చూశామని చెప్పారు. ఇతరులు సూపర్ మార్కెట్ నుండి బయటకు పరిగెత్తినప్పుడు తుపాకీ కాల్పులు విన్నామని చెప్పారు.

న్యూ లిన్ ప్రాంతంలో ఉన్న లిన్‌మాల్ నుంచి జ‌నం భ‌యంతో ప‌రుగులు తీస్తున్న వీడియోలు ఆన్‌లైన్‌లో వైర‌ల్ అయ్యాయి. ఆరుగుర్ని హాస్పట‌ల్‌కు తీసుకువెళ్లగా, గాయపడిన వ్యక్తులలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని సెయింట్ జాన్ అంబులెన్స్ సర్వీస్ స్థానిక వార్తా సంస్థకు ఒక ప్రకటనలో తెలిపింది.

ఇదిలావుంటే, మార్చి 15, 2019 న క్రైస్ట్ చర్చ్ నగరంలోని రెండు మసీదుల వద్ద శ్వేతజాతీయుల ముష్కరుడు 51 మందిని చంపినప్పటి నుండి న్యూజిలాండ్ దాడుల కోసం అప్రమత్తమైంది. మే నెలలో.. న్యూజిలాండ్‌లోని దక్షిణ ద్వీపంలోని డునెడిన్‌లో ఉన్న సూపర్ మార్కెట్‌లో నలుగురు వ్యక్తులు కత్తిపోట్లకు గురయ్యారు.

Read Also…  Sajjanar IPS: తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్.. వెంటనే ఉన్నతాధికారులతో కీలక భేటీ!