Mullah Baradar: ఆప్ఘాన్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం.. తాలిబ‌న్ ప్రభుత్వ అధినేత అత‌డే!

Balaraju Goud

Balaraju Goud |

Updated on: Sep 03, 2021 | 1:58 PM

Afghanistan New Chief: తాలిబాన్ల రాజకీయ కార్యాలయ అధిపతి ముల్లా అబ్దుల్ ఘ‌నీ బ‌రాద‌ర్ ఆఫ్ఘనిస్తాన్‌లో కొత్త ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తారని ఇస్లామిస్ట్ గ్రూప్ వర్గాలు శుక్రవారం తెలిపాయి.

Mullah Baradar: ఆప్ఘాన్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం.. తాలిబ‌న్ ప్రభుత్వ అధినేత అత‌డే!
Mullah Barada Afghanistan
Follow us

Afghanistan – Taliban: తాలిబాన్ల రాజకీయ కార్యాలయ అధిపతి ముల్లా అబ్దుల్ ఘ‌నీ బ‌రాద‌ర్ ఆఫ్ఘనిస్తాన్‌లో కొత్త ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తారని ఇస్లామిస్ట్ గ్రూప్ వర్గాలు శుక్రవారం తెలిపాయి. దివంగత తాలిబాన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ కుమారుడు ముల్లా మొహమ్మద్ యాకూబ్, షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్టానెక్‌జాయ్ ప్రభుత్వంలో ఉన్నత పదవులను చేపట్టనున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

అనుహ్య పరిణామాల అనంతరం ఆఫ్ఘానిస్థాన్‌ను మ‌ళ్లీ త‌మ చేతుల్లోకి తీసుకున్న తాలిబ‌న్లు కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు క‌స‌ర‌త్తులు మొదలుపెట్టింది. అమెరికా భద్రతా దళాలు వెళ్లిపోవడంతో అన్ని ప్రాంతాలను తాలిబన్లు హస్తగతం చేసుకున్నరు. ఈ నేపథ్యంలో కొత్త సర్కార్ ఏర్పాటు చేసేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఈ ప్రభుత్వానికి నేతృత్వం వ‌హించేది ముల్లా అబ్దుల్ ఘ‌నీ బ‌రాద‌ర్ అని తాలిబ‌న్ వ‌ర్గాలు చెప్పిన‌ట్లు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ రాయ్‌ట‌ర్స్ శుక్రవారం వెల్లడించింది. “అగ్ర నాయకులందరూ కాబూల్‌కు వచ్చారు, అక్కడ కొత్త ప్రభుత్వాన్ని ప్రకటించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి” అని ఒక తాలిబాన్ అధికారి ఒకరు చెప్పారు.

ముల్లా అబ్దుల్ ఘ‌నీ బ‌రాద‌ర్ తాలిబ‌న్ వ్యవ‌స్థాప‌కుల్లో ఒక‌రు. 2010లో ఇత‌న్ని పాకిస్థాన్‌లోని క‌రాచీలో భ‌ద్రతా బ‌ల‌గాలు ప‌ట్టుకున్నాయి. ఆ త‌ర్వాత 2018లో విడిచి పెట్టారు. మీడియా నివేదికల ప్రకారం, ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు కొత్త ప్రభుత్వాన్ని ప్రకటించాలని భావించారు. శుక్రవారం ఉదయం ప్రార్థనల తర్వాత కొత్త కేబినెట్‌ను సమర్పించవచ్చని తెలుస్తోంది. రాజధాని నగరం కాబూల్‌లోని అధ్యక్ష భవనంలో వేడుకను సిద్ధం చేస్తున్నారు. ఆగస్టు 15 న కాబూల్‌ని స్వాధీనం చేసుకున్న తాలిబాన్లు దేశంలోని చాలా ప్రాంతాలలో తిరుగుబాటు చేసిన తరువాత, రాజధానికి ఉత్తరాన ఉన్న పంజ్‌షీర్ లోయలో తీవ్ర పోరాటం, ప్రాణనష్టం జరిగినట్లు నివేదికలు వచ్చాయి. ముజాహిదీన్ మాజీ కమాండర్ అహ్మద్ షా మసౌద్ కుమారుడు అహ్మద్ మసౌద్ నాయకత్వంలో అనేక వేలమంది ప్రాంతీయ మిలీషియా, ప్రభుత్వ సాయుధ దళాల అవశేషాలు ఈ లోయలో బయటపడ్డాయి. అయితే, పరిష్కారానికి చర్చలు జరిపే ప్రయత్నాలు విఫలమైనట్లు కనిపిస్తోంది.

ఇదిలావుంటే మొదటి నుంచి తాలిబన్లకు కొరకరాని కొయ్యగా తయారైంది పంజ్‌షిర్‌. యావత్‌దేశాన్ని హస్తగతం చేసుకున్న తాలిబన్లకు పంజ్‌షిర్‌ సవాల్‌గా మారింది. నార్తర్న్‌ అలయన్స్‌ ఎదురుదాడితో తాలిబన్లకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వారితో జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి. దీంతో ఎలాగైనా పంజ్‌షిర్‌ను చేజిక్కించుకోవాలనే ప్లాన్‌లో ఉన్నారు తాలిబన్లు. ఇందుకోసం ఎంతకైనా తెగించేందుకు సిద్ధమయ్యారు. ఉగ్రసంస్థ అల్‌ఖైదా సాయం కోరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పంజ్‌షిర్‌పై దాడికి దిగిన తాలిబన్లలో అల్‌ఖైదా ఉగ్రవాదులున్నారని అక్కడి మీడియా స్పష్టం చేసింది. ఇరువర్గాల మధ్య జరుగుతున్న యుద్ధంలో పలువురు మృతి చెందినట్లు కథనాలు ప్రసారం చేసింది. మరోవైపు అల్‌ఖైదా యాక్టివ్‌ అవడంతో అమెరికా గుండెల్లో గుబులు పుడుతోంది. ట్విన్‌ టవర్స్‌ దాడికి ముందు వారికి ఆశ్రయమిచ్చింది తాలిబన్లే కావడంతో టెన్షన్‌ మొదలైంది.

Read Also….  TRS Tickets: వారసుల కోసం తల్లిదండ్రుల పాట్లు.. పిల్లల కోసం అప్పుడే కేసీఆర్‌కు టీఆర్ఎస్ నేతల దరఖాస్తులు!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Click on your DTH Provider to Add TV9 Telugu