AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Palm Oil: పామాయిల్‌తో పరుగులు తీయనున్న వాహనాలు.. ఆ దేశంలో రోడ్‌ టెస్ట్‌ ప్రారంభం..

రోజు రోజుకీ ఇంధన ధరలు పెరిగిపోవడం ఆ దేశ ఖజానాకు భారంగా మారుతోంది. ఈ దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడం ఎలా అనే ప్రశ్నకు తమ దేశంలోని పామాయిలే తగిన పరిష్కారాన్ని చూపించింది.

Palm Oil: పామాయిల్‌తో పరుగులు తీయనున్న వాహనాలు.. ఆ దేశంలో రోడ్‌ టెస్ట్‌ ప్రారంభం..
Palm Oil Vehicles
Shaik Madar Saheb
|

Updated on: Jul 29, 2022 | 7:00 AM

Share

Indonesia Palm Oil Vehicles: పామాయిల్‌ వంటల్లోకే కాదు.. వాహనాల్లో ఇంధనంగా పని కొస్తుందంటున్నారు ఇండోనేషియన్లు.. అక్కడి వాహనాలపై ప్రయోగాలు జరుపుతున్నారు.. రోజురోజుకీ ఇంధన ధరలు పెరిగిపోవడం ఆ దేశ ఖజానాకు భారంగా మారుతుండటంతో ఇండోనేషియా ఈ ప్రయోగానికి సన్నాహాలు చేసింది. ప్రపంచంలోనే అత్యధికంగా పామాయిల్‌ నూనె తయారు చేస్తున్న దేశం ఇండోనేషియా.. అయిల్‌ పామ్‌ తోటలు అక్కడ పెద్ద సంఖ్యలో ఉంటాయి. ఇండోనేషియన్ల ఉపాధి, దేశ ఆదాయంలో పామాయిల్‌ ఎగుమతుల ద్వారా వచ్చే వాటాయే అధికం. అదే సమయంలో ఆ దేశం పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ల అవసరాల కోసం విదేశాల నుంచి పెద్ద మొత్తంలో ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటుంది. రోజు రోజుకీ ఇంధన ధరలు పెరిగిపోవడం ఆ దేశ ఖజానాకు భారంగా మారుతోంది. ఈ దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడం ఎలా అనే ప్రశ్నకు తమ దేశంలోని పామాయిలే తగిన పరిష్కారాన్ని చూపించింది. చాలా దేశాల్లో డీజిల్‌లకు ప్రత్యామ్నాయంగా బయోడీజిల్‌ ఉపయోగిస్తున్నారు. బయోడీజిల్‌ పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు వాహనాల ఇంజన్‌ సామర్ధ్యాన్ని కూడా పెంచుతుంది. దీంతో వాహనాల మైలేజీ కూడా పెరుగుతుంది.

అయితే పామాయిల్‌ను బయోడీజిల్‌గా ఉపయోగించుకోవాని ఇండోనేషియా నిర్ణయించింది. అన్ని డీజిల్స్‌లో 30 నుంచి 40 శాతం వరకూ పామాయిల్‌ కలపాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికీ కొన్ని ప్యాసింజర్‌, కమర్షియల్‌ రవాణా వాహనాలపై ఈ ప్రయోగాన్ని అమలు చేసి ఫలితాలను పరీక్షిస్తోంది. ఈ మేరకు బుధవారం బయోడీజిల్‌ వాహనాలను పరీక్షించడం ప్రారంభించింది. బయోడీజిల్‌గా పామాయిల్‌ను ఉపయోగించడం ద్వారా ఇంధన దిగుమతుల భారం తగ్గుతుందని ఇండోనేషియా ప్రభుత్వం చెబుతోంది. అయితే పామాయిల్‌ కారణంగా తమ ఇంజన్లు దెబ్బతింటాయని వాహనదారులు భయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే.. పామాయిల్‌తో నడిచే వాహనాలు ప్రజల రవాణాకు ఎంతమేరకు ఉపయోగపడతాయో ఈ సంవత్సరం చివరిలోగా తేల్చాలని అధికారులను ఆదేశించినట్లు ఇంధన మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆ తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..