AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IndiGo Flight: పాకిస్తాన్ కరాచీలో ఎమర్జెన్సీగా ల్యాండ్ అయిన ఇండిగో విమానం.. ఎందుకంటే..

దేశ రాజధాని న్యూ ఢిల్లీ నుంచి జెడ్డాకు బయల్దేరిన విమానం మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా పాకిస్థాన్‌లోని కరాచీలో దిగాల్సి వచ్చింది. పాకిస్థాన్ నుంచి అనుమతి తీసుకున్న తర్వాత కరాచీలో విమానాన్ని ల్యాండ్ చేశారు. ప్రయాణం సమయంలో అస్వస్థతకు గురైన వ్యక్తికి చికిత్స అందించారు.

IndiGo Flight: పాకిస్తాన్ కరాచీలో ఎమర్జెన్సీగా ల్యాండ్ అయిన ఇండిగో విమానం.. ఎందుకంటే..
Indigo Flight
Surya Kala
|

Updated on: Dec 14, 2024 | 4:27 PM

Share

దేశ రాజధాని ఢిల్లీ నుంచి జెడ్డాకు బయలుదేరిన ఇండిగో విమానాన్ని శనివారం అత్యవసరంగా పాకిస్తాన్ లోని కరాచీలో ల్యాండ్ చేయాల్సి వచ్చింది. దీనికి కారణం మెడికల్ ఎమర్జెన్సీ అని ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో తెలిపింది. పాకిస్థాన్‌లోని కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. సివిల్ ఏవియేషన్ అథారిటీ (సిసిఎ) ప్రకారం.. ఈ విమానం శనివారం న్యూఢిల్లీ నుంచి గమ్యస్థానానికి బయలుదేరింది. విమానం పాకిస్థాన్ గగనతలంలో ఉండగా ఓ మగ ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతని వయస్సు 55 ఏళ్లుగా పేర్కొన్నారు.

దిగేందుకు అనుమతి కోరింది పాకిస్తాన్‌లోని పౌర విమానయాన అథారిటీ (సిఎఎ) వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. అస్వస్థతకు గురైన ప్రయాణికుడి పరిస్థితిని చూసిన తర్వాత.. పైలట్ మొదటి విమానంలోనే ఆక్సిజన్ సపోర్ట్ ఇచ్చాడు. అయినప్పటికీ ఆ ప్రయనీకుడి పరిస్థితిలో ఎటువంటి మెరుగుదల లేదు. అతని పరిస్థితి క్షణ క్షణానికి విషమంగా మారింది. ఆరోగ్యం క్షీణించి ఆందోళన కరంగా మారిన సమయంలో విమానం పాకిస్తాన్ గగనతలంలో ఉంది.

మెడికల్ ఎమర్జెన్సీని చూసిన పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)ని సంప్రదించాడు. పాకిస్థాన్‌లో దిగేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. మానవతా దృక్పథంతో ఇండిగో విమానాన్ని కరాచీలో ల్యాండ్ చేసేందుకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతించింది. విమానం పాకిస్థాన్‌లో ల్యాండ్ అయిన వెంటనే వైద్య బృందం అత్యవసర చికిత్స కోసం వెంటనే విమానం వద్దకు చేరుకుంది. అతనికి చికిత్స అందించారు. ఆ తర్వాత అతని పరిస్థితి మెరుగుపడింది. అవసరమైన ఫార్మాలిటీలను పూర్తి చేసిన అనంతరం విమానం కరాచీ నుంచి బయలుదేరి జెడ్డాకు వెళ్ళకుండా మరింత మెరుగైన వైద్య సేవల నిమిత్తం తిరిగి న్యూఢిల్లీకి తిరిగి వచ్చింది అని ఎయిర్‌లైన్ తెలిపింది. ప్రయాణీకుడిని ఢిల్లీలో డీబోర్డ్ చేసిన తర్వాత.. తిరిగి విమానం జెడ్డాకు బయలుదేరింది.

ఇవి కూడా చదవండి

ఇప్పటికే పాకిస్థాన్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగింది

ఎమర్జెన్సీ పరిస్థితుల్లో పాకిస్థాన్‌లో ఇంతకుముందు చాలాసార్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగింది. నవంబర్‌లో కూడా, జెడ్డా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో విమానంలో మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా.. విమానాన్ని పాకిస్తాన్‌లోని కరాచీలో ల్యాండ్ చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..