AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జి20 సదస్సు వేదిక ఇండోనేషియాలో భారీ భూకంపం.. 6.9 తీవ్రతతో భూమి కంపించింది!

గత వారం రోజుల్లో నేపాల్‌లో సంభవించిన 3వ భూకంపం ఇది. శనివారం మరోసారి నేపాల్‌లో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. గత బుధవారం నేపాల్‌లో సంభవించిన భూకంపం వల్ల ఆరుగురు మరణించారు.

జి20 సదస్సు వేదిక ఇండోనేషియాలో భారీ భూకంపం.. 6.9 తీవ్రతతో భూమి కంపించింది!
Earthquake
Jyothi Gadda
|

Updated on: Nov 18, 2022 | 9:55 PM

Share

భారత్, నేపాల్ సరిహద్దుల్లో సంభవించిన భూకంపం ప్రభావం ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కనిపించింది. జీ20 సదస్సు ముగిసిన వెంటనే ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 6.9గా నమోదైంది. ఈరోజు రాత్రి 8.30 గంటలకు భూమి కంపించింది. దాదాపు 212 కి.మీ లోతు వరకు భూమి కంపించింది. తద్వారా తీవ్ర పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.

నేపాల్, ఢిల్లీ, ఉత్తరాఖండ్‌లో గత వారం 5.4 తీవ్రతతో భూకంపం.. నేపాల్, దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాలు, ఉత్తరాఖండ్‌తో సహా పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి 8 గంటలకు భూకంపం సంభవించింది. ఇది కాకుండా, నోయిడా, గురుగ్రామ్‌తో సహా పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.4గా నమోదైన విషయం తెలిసిందే. గత వారం రోజుల్లో నేపాల్‌లో సంభవించిన 3వ భూకంపం ఇది. శనివారం మరోసారి నేపాల్‌లో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. గత బుధవారం నేపాల్‌లో సంభవించిన భూకంపం వల్ల ఆరుగురు మరణించారు.

హిమాలయ ప్రాంతంలో సంభవించిన భూకంపం కారణంగా ఆరుగురు మరణించిన సంఘటన నవంబర్ 8 అర్ధరాత్రి జరిగింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది. ఉత్తర భారతం, నేపాల్‌లోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. దిగువ హిమాలయాల్లో గత ఐదు నుంచి ఆరు రోజులుగా భూకంపాలు వస్తుండగా, మంగళవారం మధ్యాహ్నం 1.57 గంటల ప్రాంతంలో 6.3 తీవ్రతతో భూమి కంపించింది. ఈ ప్రాంతం భారతదేశంలోని పితోర్‌ఘర్ నుండి 90 కి.మీ. దూరంగా ఉంది. ఉత్తరాఖండ్ మరియు నేపాల్‌లోని కొన్ని ప్రాంతాలలో వరుసగా తెల్లవారుజామున 3.15 మరియు 6.27 గంటల ప్రాంతంలో 3.6 మరియు 4.3 తీవ్రతతో భూకంపాలు సంభవించాయని నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి