AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అఫ్తాబ్‌ నుంచి ఎలాగైన తప్పించుకోవాలనుకున్న శ్రద్ధ.. స్నేహితులకు మెసేజ్‌ చేసింది..! వాట్సాప్‌ చాట్‌ బయటపెట్టిన పోలీసులు

ఈ గొడవ తర్వాత స్నేహితుడికి వాట్సాప్ మెసేజ్ పంపిన శ్రద్ధ ఏడుస్తోంది. కోపంతో అఫ్తాబ్ ముక్కు, వీపు మీద బాగా కొట్టినట్టుగా చెప్పింది.  మంచం మీద నుంచి లేవలేక బాధపడుతోంది.

అఫ్తాబ్‌ నుంచి ఎలాగైన తప్పించుకోవాలనుకున్న శ్రద్ధ..  స్నేహితులకు మెసేజ్‌ చేసింది..! వాట్సాప్‌ చాట్‌ బయటపెట్టిన పోలీసులు
Shraddha Murder Case
Jyothi Gadda
|

Updated on: Nov 18, 2022 | 8:24 PM

Share

శ్రద్ధ హత్య కేసు దర్యాప్తు వేగవంతం అయింది. శ్రద్ధను 35 ముక్కలుగా నరికి దూరంగా విసిరేసిన నిందితుడు అఫ్తాబ్ విచారణలో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు శ్రద్ధా వాట్సాప్ చాట్ హిస్టరీని పోలీసులు బయటపెట్టారు. స్నేహితులతో సంభాషణ క్లిప్‌లు అందుబాటులో ఉన్నాయి. తన మరణానికి ముందు అఫ్తాబ్ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని శ్రద్ధా భావించింది. శ్రద్ధా జీవితంలో ఇలాంటి గొడవలు సర్వసాధారణం కాబట్టి స్నేహితులు ప్రోత్సహించారు. కానీ, శ్రద్ధా వారి మాటలతో ధైర్యాన్ని పొందలేకపోయింది. అఫ్తాబ్‌తో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లోకి వచ్చిన తర్వాత శ్రద్ధా జీవితంలో గొడవలు, హింస సర్వసాధారణంగా మారిపోయింది. ఇందుకు సంబంధించి శ్రద్ధ వాట్సాప్ మెసేజ్ లను ఢిల్లీ పోలీసులు బయటపెట్టారు.

రెండేళ్ల క్రితం కూడా ఇలాంటి గొడవే జరిగింది. ఈ గొడవ తర్వాత స్నేహితుడికి వాట్సాప్ మెసేజ్ పంపిన శ్రద్ధ ఏడుస్తోంది. కోపంతో అఫ్తాబ్ ముక్కు, వీపు మీద బాగా కొట్టినట్టుగా చెప్పింది.  మంచం మీద నుంచి లేవలేక బాధపడుతోంది. అఫ్తాబ్ బయటకు వెళితే ఏదో ఒకటి చేసి ఇక్కడ్నుంచి బయటపడాలని స్నేహితులకు మెసేజ్ చేసింది.

శ్రద్ధా వాకర్ హంతకుడు అఫ్తాబ్ పదే పదే పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చి విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడంతో అతడికి ఫోరెన్సిక్ పరీక్ష నిర్వహించేందుకు ఢిల్లీ కోర్టు బుధవారం అంగీకరించిందని వర్గాలు తెలిపాయి. శ్రద్ధ హత్య తర్వాత ఆమె ఫోన్‌తో తాను ఏం చేశాడనే దానిపై తప్పుడు సమాచారం ఇస్తున్నాడు. ఇంటరాగేషన్‌లో ఓ సారి శ్రద్దా.. ఫోన్‌ని మహారాష్ట్రలో విసిరేశానని, ఢిల్లీలో ఫోన్‌ను ధ్వంసం చేశానని మరోసారి చెప్పడంతో పలుమార్లు సమాధానాలు మార్చాడు. దక్షిణ ఢిల్లీలోని సాకేత్‌లో కోర్చ్ అతని మంపారు పరీక్షకు అనుమతినిచ్చిందని వర్గాలు తెలిపాయి. మంపారు పరీక్షలో నిందితులకు ఇంజక్షన్ ఇచ్చి వశీకరణ దశకు చేరుకునేలా చేస్తారు. ఈ సందర్భంలో నిందితుడు స్పృహలో ఉన్నప్పుడు దాచాలనుకుంటున్న సమాచారాన్ని అంగీకరించే అవకాశాలు ఉన్నాయి. నార్కోటిక్‌ పరీక్ష నిర్వహించే సమయంలో పోలీసు బృందంతో పాటు మానసిక వైద్యుడు కూడా ఉంటారు.

ఇవి కూడా చదవండి

అఫ్తాబ్ పూనావాలా.. ఆమె గొంతుకోసి హత్య చేసి 35 ముక్కలుగా నరికి, తాను నిర్దోషినని చెప్పి పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినా.. ఎట్టకేలకు అతడి వల్లే పట్టుబడ్డాడని వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్ డబ్బు బదిలీ, Instagram చాట్. ఇలా అదృశ్యం విషయంలో శ్రద్ధ తప్పేమీ లేదని, నన్ను వదిలేసిందని మహారాష్ట్ర, ఢిల్లీ పోలీసుల ముందు ధైర్యంగా వాదించిన అఫ్తాబ్.. ఇక కేసులోంచి తప్పించుకోలేనని గ్రహించి తన తప్పును ఒప్పుకున్నాడని దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us