Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రాజన్న సన్నిధిలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు..

వేములవాడ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు. వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్నారు ప్రధాని మోదీ. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఈరోజు రెండు సభల్లో పాల్గొన్ని ప్రచారం నిర్వహించనున్నారు. అయితే ఇందులో భాగంగా ముందుగా వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు బయలుదేశారు. హైదరాబాద్ రాజ్ భవన్ లో మంగళవారం బస చేసిన ప్రధాని బుధవారం బేగంపేట నుంచి వేములవాడ చేరుకున్నారు. అక్కడ ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ప్రధాని మోదీకి స్వాగతం పలికారు.

Telangana: రాజన్న సన్నిధిలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు..
Pm Modi
Follow us
Srikar T

|

Updated on: May 08, 2024 | 10:30 AM

వేములవాడ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు. వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్నారు ప్రధాని మోదీ. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఈరోజు రెండు సభల్లో పాల్గొన్ని ప్రచారం నిర్వహించనున్నారు. అయితే ఇందులో భాగంగా ముందుగా వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు బయలుదేశారు. హైదరాబాద్ రాజ్ భవన్ లో మంగళవారం బస చేసిన ప్రధాని బుధవారం బేగంపేట నుంచి వేములవాడ చేరుకున్నారు. అక్కడ ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. ఆ తరువాత ఆలయంలోని మహానందికి పుష్పాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.

గోమాతకు కూడా పూజలు నిర్వహించిననంతరం ఆలయంలో ప్రదక్షిణ చేస్తూ రాజరాజేశ్వర స్వామి గర్భాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆలయ ప్రధాన అర్చకులు మోదీకి తిలకధారణ చేసి స్వామివారికి పుష్పార్చనలు నిర్వహించారు. తదనంతరం హారతి కళ్లకు అద్దుకుని మొక్కులు చెల్లించుకున్నారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా ఆలయ ఈవో, ప్రధాన అర్చకులు, వేద పండితులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వేద ఆశీర్వచనం అందజేశారు. ఆపై శాలువా కప్పి సన్మానించారు. స్వామి వారి తీర్ధప్రసాదాలను అందజేశారు. ఇక తిరుగుపయనం అయ్యే క్రమంలో క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు అభివాదం చేస్తూ, వందనం చేస్తూ బయటకు వచ్చారు. ప్రత్యేక హెలికాఫ్టర్ లో వేములవాడ బహిరంగ సభకు బయలుదేరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..