Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్కానింగ్‌ కోసం ఆస్పత్రికి వచ్చిన గర్భిణీ.. కడుపులో పెరుగుతున్నది చూసి కంగుతిన్న వైద్యులు..

అయితే, ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి కేసులు 200 మాత్రమే నమోదయ్యాయని, అవి కూడా ప్రసవం తర్వాతే వెలుగులోకి వచ్చాయని డాక్టర్ అగర్వాల్ తెలిపారు. వీటిలో, భారతదేశంలో ఇప్పటివరకు ఇటువంటి కేసులు 10 నుంచి15 నమోదైనట్టుగా చెప్పారు. సదరు మహిళను పరీక్షించిన వైద్యులు వెంటనే ఆమెను అడ్మిట్ చేశారు. తనను రెగ్యూలర్‌గా చెకప్‌ చేస్తున్న డాక్టర్ మరొక వైద్యుని అభిప్రాయాన్ని కోరింది.

స్కానింగ్‌ కోసం ఆస్పత్రికి వచ్చిన గర్భిణీ.. కడుపులో పెరుగుతున్నది చూసి కంగుతిన్న వైద్యులు..
Pregnant
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 30, 2025 | 8:53 PM

మహారాష్ట్రలోని బుల్దానాలో అరుదైన ఘటన వెలుగు చూసింది. జిల్లా కేంద్రంలోని మహిళా శిశు ఆసుపత్రిలో వైద్య టెస్టుల నిమ్మిత్తం వచ్చిన ఓ గర్భిణి కడుపులో పెరుగుతున్న బిడ్డ కడుపులో మరో పిండం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ ప్రెగ్నెన్సీని వైద్య భాషలో ఫీటస్ ఇన్ ఫీటూ అంటారని చెప్పారు.. ఇది చాలా అరుదైన సంఘటన వైద్యులు వెల్లడించారు. మూడు రోజుల క్రితం35 వారాల గర్భిణీ సాధారణ చెకప్ కోసం బుల్దానా జిల్లా మహిళా ఆసుపత్రికి వచ్చింది. ఆమెకు సోనోగ్రఫీ చేసిన డాక్టర్..ఒక్కసారిగా షాక్‌ తిన్నారు. మహిళ గర్భంలో పిండం, దానిలోపల మరో పిండం స్పష్టంగా కనిపించింది. అయితే, ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఆ మహిళకు డెలివరీ చేసేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు.

అయితే, ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి కేసులు 200 మాత్రమే నమోదయ్యాయని, అవి కూడా ప్రసవం తర్వాతే వెలుగులోకి వచ్చాయని డాక్టర్ అగర్వాల్ తెలిపారు. వీటిలో, భారతదేశంలో ఇప్పటివరకు ఇటువంటి కేసులు 10 నుంచి15 నమోదైనట్టుగా చెప్పారు.

సదరు మహిళను పరీక్షించిన వైద్యులు వెంటనే ఆమెను అడ్మిట్ చేశారు. తనను రెగ్యూలర్‌గా చెకప్‌ చేస్తున్న డాక్టర్ మరొక వైద్యుని అభిప్రాయాన్ని కోరింది. ఈ మేరకు రేడియాలజిస్ట్ డాక్టర్ శ్రుతి థోరట్ కూడా పరిస్థితిని ధృవీకరించారు. అయితే, మెరుగైన వైద్యం, సురక్షిత ప్రసవం కోసం మహిళను ఛత్రపతి సంభాజీనగర్‌లోని వైద్య కేంద్రానికి రెఫర్ చేసినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: గర్ల్‌ఫ్రెండ్ ఇచ్చిన ఐడియా అతన్ని బిజినెస్‌ మెన్‌గా మార్చేసింది..! మహా కుంభమేళాలో డబ్బు సంపాదన

ఇది కూడా చదవండి: పులి మూత్రం అమ్ముతున్న జూ నిర్వాహకులు.. ఒక్క సీసా ఎంతో తెలుసా..?

ఇది కూడా చదవండి: అంతా మనదే.. ఉద్యోగులకు ఏకంగా రూ. 70 కోట్ల బోనస్.. కానీ ఒక్క కండీషన్

ఇది కూడా చదవండి: బీచ్‌లో వాకింగ్‌ చేస్తున్న వ్యక్తి కాలికి తగిలిన అదృష్టం..అదేదో చెత్తాచెదారం అనుకుంటే.. 66 మిలియన్ల..!

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..