Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మేడారం జాతర

మేడారం జాతర

మేడారం జాతర.. ప్రతి రెండేళ్లకోసారి జరిగే మహా గిరిజన జాతర. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరకు నాలుగైదు రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తుల తరలివస్తారు. తెలంగాణలో కుంభమేళాను తలపిస్తుంది మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర. 2022 మేడారం జాతరలో దాదాపు కోటిన్నర మంది భక్తులు గిరిజన దేవతలను దర్శించుకున్నట్లు ప్రభుత్వ అంచనా. ఈ సారి దీనికి మించి భక్తులు వనదేవతలు సమ్మక్క, సారక్కను దర్శించుకునే అవకాశముంది. సమ్మక్క సారక్క మహాజాతరను 2024 ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నారు. ఈ నాలుగు రోజులు మేడారం అభయారణ్యం జనారణ్యంగా మారుతుంది.

కోట్లాదిమంది భక్తుల నమ్మకానికి ప్రతిరూపం, కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం… మేడారం జాతర. సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం. స్థానిక ఆదివాసీ బిడ్డ సీతక్క మంత్రి కావడం, అదే జిల్లాకు చెందిన కొండా సురేఖ దేవాదాయ మంత్రిగా చార్జ్ తీసుకోవడం… ఈ రెండు ప్రత్యేకతల ప్రభావం ఈసారి మహా జాతరపై స్పష్టంగా కనిపించబోతోంది. రూ.100 కోట్లగా పైగా ఖర్చయ్యే జన జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 70 కోట్లు మంజూరు చేసింది. జాతరకు 10 రోజుల ముందే ఏర్పాట్లు పూర్తిచేయాలని జిల్లా అధికార యంత్రాంగానికి మంత్రి సీతక్క డెడ్‌లైన్ విధించారు.

వీఐపీలు, ప్రజాప్రతినిధుల రాక నేపథ్యంలో జాతర నిర్వహణలో పోలీసులదే కీలక పాత్ర. మావోయిస్టు యాక్షన్ టీమ్‌తో ముప్పు ఉన్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం అయ్యాయి. భారీగా సీసీటీవీ కెమరాలు, డ్రోన్ కెమరాలతో అక్కడ భద్రతా ఏర్పాట్లను సమీక్షించనున్నారు.

ఇంకా చదవండి

Medaram Jathara: మేడారం జాతరలో బెల్లమే నిలువెత్తు బంగారం.. ఎందుకో తెలుసా?

సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులు బంగారంగా పిలిచే బెల్లమే అమ్మవార్లకు నైవేద్యమవుతుంది. ఇలా నిలువెత్తు బెల్లాన్ని సమర్పించడం వెనుక ఎన్నో ఏళ్ల ఆనవాయితీ ఉంది. మినీ మేడారం జాతరకు పోటెత్తుతున్న భక్తులు వనదేవతలకు తీసుకెళ్లే ఈ నైవేద్యానికి ఎంతో మహిమ ఉందని చెప్తారు. అమ్మవార్లే బంగారం రూపంలో భక్తులను ఆశీర్వదిస్తారని నమ్ముతారు.

  • Bhavani
  • Updated on: Feb 13, 2025
  • 3:02 pm

Medaram Jatara: తెలంగాణ కుంభమేళా.. నేటి నుంచి మేడారం మినీ జాతర షురూ.. విశేషం ఏంటంటే..

సమ్మక్క సారక్క దేవతలు కొలువుదీరిన మేడారంలో మినీ జాతర సందడి మొదలైంది.. ఆదివాసి ఆచార సాంప్రదాయాల ప్రకారం నిర్వహించుకునే పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తున్నారు.. మేడారంతో పాటు అనుబంధ గ్రామాలు, ఆలయాలలో ఆచార సాంప్రదాయ పూజ నిర్వహిస్తున్నారు.. మినీ జాతర విశిష్టత ఏంటి..? ఎలాంటి పూజలు నిర్వహిస్తారు.? నాలుగు రోజుల వేడుక విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Medaram Jathara: మేడారం హుండీ రికార్డ్.. వెండీ, బంగారం ఎన్ని కిలోలు, కరెన్సీ ఎన్ని రూ. కోట్లు తెలుసా..?

మేడారం జాతర హుండీ ఆదాయంలో ఆల్ టైం రికార్డు నమోదయింది. ప్రతీ మేడారం జాతరకు భక్తులు పెరుగుతున్న తరహాలోనే కానుకలు, హుండీ ఆదాయం కూడా పెరిగిపోతుంది. ఈసారి జాతరలో కోటిన్నర మంది భక్తులతో సరికొత్త రికార్డు నమోదుకాగా హుండీ ఆదాయం కూడా అదేస్థాయిలో రికార్డు నమోదైంది.

ఒకవైపు సిగపట్లు.. మరోవైపు రక్తధారలు.. ఇరువర్గాల మధ్య ఘర్షణ.. అసలు కారణమిదే..

మేడారం వెళ్లే ప్రతి భక్తులు మొదట ములుగు శివారులోని గట్టమ్మ దేవాలయాన్ని దర్శించుకుంటారు. తొలి మొక్కు గట్టమ్మకు సమర్పిస్తారు. ఆ ఘట్టమ్మ దేవాలయమే ఇప్పుడు వివాదానికి కేరాఫ్ అడ్రస్‎గా మారింది. రెండు వర్గాల మధ్య అగ్గిరాజుకునేలా చేసింది. ఘట్టమ్మ సాక్షిగా రక్తం చిందేలా చేసింది. గట్టమ్మ దేవత మాదంటే మాదే అంటూ ముదిరాజ్ వర్గం - నాయకపోడు సామాజిక వర్గానికి చెందిన గిరిజనులు తన్నుకున్నారు. దేవాలయం సన్నిధిలోనే సిగపట్లు పట్టుకున్నారు. చివరకు రక్తం చిందించారు. ఒకప్పుడు ఈ దేవాలయాన్ని ఎవరూ పట్టించుకునే వారు కాదు.

Medaram Hundi: మేడారం హుండీలలో విచిత్రాలు.. మొన్న నకిలీ కరెన్సీ.. నిన్న తాలిబొట్టు.. నేడు..?

తెలంగాణ కుంభమేళా మేడారం సమక్క - సారక్క మహా జాతర వైభవంగా ముగిసింది. ఫిబ్రవరి 21 నుంచి 24వ వరకు నాలుగు రోజులపాటు రాష్ట్ర సర్కార్ ఆధ్వర్యంలో మహాజాతరకు దాదాపు కోటి 40 లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు..తాజాగా జాతరలో భక్తులు అమ్మవార్లకు వేసిన కానుకల హుండీ లెక్కింపు మొదలైంది..

Medaram: మేడారం 317హుండీల లెక్కింపు.. సమ్మక్క, సారలమ్మలకు కానుకల వెల్లువ.. రూ.9.60 కోట్ల ఆదాయం

సమ్మక్క, సారలమ్మ జాతర హుండీ లెక్కింపు కొనసాగుతుంది. హనుమకొండ లష్కర్‌బజార్‌లోని టీటీడీ కల్యాణ మండపంలో మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర హుండీలను లెక్కిస్తున్నారు. మూడోరోజు మేడారం హుండీలను లెక్కిస్తే..  3.46 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు చెప్పారు అధికారులు. ఇప్పటి వరకు 317హుండీల లెక్కించగా.. 9.60కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు చెప్పారు ఈఓ రాజేంద్రం.

Chicken Price: పెరిగిన చికెన్ ధరలు.. కొనలేం బాబోయ్ అంటున్న సామాన్యులు.!

చికెన్ ప్రియులకు షాకింగ్ న్యూస్. హైదరాబాద్ లో చికెన్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఈ నెల 10వ తేదీ వరకు స్కిన్ లెస్ చికెన్ కిలో ధర 180 నుంచి 200 రూపాయల వరకు ఉంది. లైవ్ కోడి ధర రూ. 120 నుంచి రూ. 160 రూపాయల మధ్య ఉంది. అయితే పెరుగుతున్న ఎండలతో పాటు ఇటీవల జరిగిన మేడారం జాతర నేపథ్యంలో కోళ్ల సరఫరా తగ్గిపోయింది. డిమాండ్ పెరగడంతో చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి.

Medaram 2024: మేడారం కానుకల కౌంటింగ్.. హుండీ ఓపెన్ చేయగానే ఆశ్చర్యం

హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో మేడారం హుండీ ఆదాయం కౌంటింగ్ నిర్వహిస్తున్నారు.. దేవదాయ సిబ్బంది, రెవెన్యూ, పోలీసులు, మేడారం పూజారుల సమక్షంలో ఈ కౌంటింగ్ కొనసాగుతోంది. అయితే కౌంటింగ్ ప్రారంభమైన మొదటిరోజే ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి.

Watch Video: జాతర ముగిసిన మేడారంలో ఇవేం పూజలు.. పూజారి మరణంతో విషాద ఛాయలు..

సమ్మక్క పూజారి మరణంతో విషాద వాతావరణంలో ఉన్న మేడారంలో తిరుగువారం పండుగ ఆదివాసి ఆచార సాంప్రాయాల ప్రకారం నిర్వహించారు. ఆదివాసీ ఆడపడుచులంతా సమ్మక్క పూజామందిరంలో పూజలు నిర్వహించారు. తిరుగువారం పండుగ అనంతరం ఆదివారం నిర్వహించే వనబోజనాలతో జాతర పరిసమాప్తమైనట్టు గిరిజన పూజారులు తెలిపారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మల మహాజాతర ముగిసింది. ఈనెల 21 నుండి 24 వరకు జరిగిన జాతర మహా వైభవంగ సాగింది. ఈ సారి జాతరలో సరికొత్త రికార్డ్‎లు నమోదయ్యాయి.

Medaram Jathara: ఈసారి మేడారం జాతరలో హుండీలు ఎన్ని..?.. నిండిన ఆ హుండీలను ఎక్కడికి తరలించారు..?

మేడారం మహాజాతర ముగిసింది. మునుపెన్నడూ లేని విధంగా మేడారం జాతర చరిత్రలోనే సరికొత్త రికార్డు నమోదయింది. జాతరకు నెల రోజులు ముందు, జాతర సమయంలో నాలుగు రోజులు కలుపుకుని సుమారు రెండుకోట్ల మంది భక్తులు వన దేవతలు సమ్మక్క సారక్క దేవతలకు మొక్కులు చెల్లించు కున్నారు. మొక్కలు చెల్లించుకోవడంతో పాటు భక్తులు సమర్పించిన కానుకలతో హుండీలు కూడా దండిగా నిండిపోయాయి.