మేడారం జాతర

మేడారం జాతర

మేడారం జాతర.. ప్రతి రెండేళ్లకోసారి జరిగే మహా గిరిజన జాతర. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరకు నాలుగైదు రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తుల తరలివస్తారు. తెలంగాణలో కుంభమేళాను తలపిస్తుంది మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర. 2022 మేడారం జాతరలో దాదాపు కోటిన్నర మంది భక్తులు గిరిజన దేవతలను దర్శించుకున్నట్లు ప్రభుత్వ అంచనా. ఈ సారి దీనికి మించి భక్తులు వనదేవతలు సమ్మక్క, సారక్కను దర్శించుకునే అవకాశముంది. సమ్మక్క సారక్క మహాజాతరను 2024 ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నారు. ఈ నాలుగు రోజులు మేడారం అభయారణ్యం జనారణ్యంగా మారుతుంది.

కోట్లాదిమంది భక్తుల నమ్మకానికి ప్రతిరూపం, కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం… మేడారం జాతర. సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం. స్థానిక ఆదివాసీ బిడ్డ సీతక్క మంత్రి కావడం, అదే జిల్లాకు చెందిన కొండా సురేఖ దేవాదాయ మంత్రిగా చార్జ్ తీసుకోవడం… ఈ రెండు ప్రత్యేకతల ప్రభావం ఈసారి మహా జాతరపై స్పష్టంగా కనిపించబోతోంది. రూ.100 కోట్లగా పైగా ఖర్చయ్యే జన జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 70 కోట్లు మంజూరు చేసింది. జాతరకు 10 రోజుల ముందే ఏర్పాట్లు పూర్తిచేయాలని జిల్లా అధికార యంత్రాంగానికి మంత్రి సీతక్క డెడ్‌లైన్ విధించారు.

వీఐపీలు, ప్రజాప్రతినిధుల రాక నేపథ్యంలో జాతర నిర్వహణలో పోలీసులదే కీలక పాత్ర. మావోయిస్టు యాక్షన్ టీమ్‌తో ముప్పు ఉన్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం అయ్యాయి. భారీగా సీసీటీవీ కెమరాలు, డ్రోన్ కెమరాలతో అక్కడ భద్రతా ఏర్పాట్లను సమీక్షించనున్నారు.

ఇంకా చదవండి

Medaram Jathara: మేడారం హుండీ రికార్డ్.. వెండీ, బంగారం ఎన్ని కిలోలు, కరెన్సీ ఎన్ని రూ. కోట్లు తెలుసా..?

మేడారం జాతర హుండీ ఆదాయంలో ఆల్ టైం రికార్డు నమోదయింది. ప్రతీ మేడారం జాతరకు భక్తులు పెరుగుతున్న తరహాలోనే కానుకలు, హుండీ ఆదాయం కూడా పెరిగిపోతుంది. ఈసారి జాతరలో కోటిన్నర మంది భక్తులతో సరికొత్త రికార్డు నమోదుకాగా హుండీ ఆదాయం కూడా అదేస్థాయిలో రికార్డు నమోదైంది.

ఒకవైపు సిగపట్లు.. మరోవైపు రక్తధారలు.. ఇరువర్గాల మధ్య ఘర్షణ.. అసలు కారణమిదే..

మేడారం వెళ్లే ప్రతి భక్తులు మొదట ములుగు శివారులోని గట్టమ్మ దేవాలయాన్ని దర్శించుకుంటారు. తొలి మొక్కు గట్టమ్మకు సమర్పిస్తారు. ఆ ఘట్టమ్మ దేవాలయమే ఇప్పుడు వివాదానికి కేరాఫ్ అడ్రస్‎గా మారింది. రెండు వర్గాల మధ్య అగ్గిరాజుకునేలా చేసింది. ఘట్టమ్మ సాక్షిగా రక్తం చిందేలా చేసింది. గట్టమ్మ దేవత మాదంటే మాదే అంటూ ముదిరాజ్ వర్గం - నాయకపోడు సామాజిక వర్గానికి చెందిన గిరిజనులు తన్నుకున్నారు. దేవాలయం సన్నిధిలోనే సిగపట్లు పట్టుకున్నారు. చివరకు రక్తం చిందించారు. ఒకప్పుడు ఈ దేవాలయాన్ని ఎవరూ పట్టించుకునే వారు కాదు.

Medaram Hundi: మేడారం హుండీలలో విచిత్రాలు.. మొన్న నకిలీ కరెన్సీ.. నిన్న తాలిబొట్టు.. నేడు..?

తెలంగాణ కుంభమేళా మేడారం సమక్క - సారక్క మహా జాతర వైభవంగా ముగిసింది. ఫిబ్రవరి 21 నుంచి 24వ వరకు నాలుగు రోజులపాటు రాష్ట్ర సర్కార్ ఆధ్వర్యంలో మహాజాతరకు దాదాపు కోటి 40 లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు..తాజాగా జాతరలో భక్తులు అమ్మవార్లకు వేసిన కానుకల హుండీ లెక్కింపు మొదలైంది..

Medaram: మేడారం 317హుండీల లెక్కింపు.. సమ్మక్క, సారలమ్మలకు కానుకల వెల్లువ.. రూ.9.60 కోట్ల ఆదాయం

సమ్మక్క, సారలమ్మ జాతర హుండీ లెక్కింపు కొనసాగుతుంది. హనుమకొండ లష్కర్‌బజార్‌లోని టీటీడీ కల్యాణ మండపంలో మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర హుండీలను లెక్కిస్తున్నారు. మూడోరోజు మేడారం హుండీలను లెక్కిస్తే..  3.46 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు చెప్పారు అధికారులు. ఇప్పటి వరకు 317హుండీల లెక్కించగా.. 9.60కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు చెప్పారు ఈఓ రాజేంద్రం.

Chicken Price: పెరిగిన చికెన్ ధరలు.. కొనలేం బాబోయ్ అంటున్న సామాన్యులు.!

చికెన్ ప్రియులకు షాకింగ్ న్యూస్. హైదరాబాద్ లో చికెన్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఈ నెల 10వ తేదీ వరకు స్కిన్ లెస్ చికెన్ కిలో ధర 180 నుంచి 200 రూపాయల వరకు ఉంది. లైవ్ కోడి ధర రూ. 120 నుంచి రూ. 160 రూపాయల మధ్య ఉంది. అయితే పెరుగుతున్న ఎండలతో పాటు ఇటీవల జరిగిన మేడారం జాతర నేపథ్యంలో కోళ్ల సరఫరా తగ్గిపోయింది. డిమాండ్ పెరగడంతో చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి.

Medaram 2024: మేడారం కానుకల కౌంటింగ్.. హుండీ ఓపెన్ చేయగానే ఆశ్చర్యం

హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో మేడారం హుండీ ఆదాయం కౌంటింగ్ నిర్వహిస్తున్నారు.. దేవదాయ సిబ్బంది, రెవెన్యూ, పోలీసులు, మేడారం పూజారుల సమక్షంలో ఈ కౌంటింగ్ కొనసాగుతోంది. అయితే కౌంటింగ్ ప్రారంభమైన మొదటిరోజే ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి.

Watch Video: జాతర ముగిసిన మేడారంలో ఇవేం పూజలు.. పూజారి మరణంతో విషాద ఛాయలు..

సమ్మక్క పూజారి మరణంతో విషాద వాతావరణంలో ఉన్న మేడారంలో తిరుగువారం పండుగ ఆదివాసి ఆచార సాంప్రాయాల ప్రకారం నిర్వహించారు. ఆదివాసీ ఆడపడుచులంతా సమ్మక్క పూజామందిరంలో పూజలు నిర్వహించారు. తిరుగువారం పండుగ అనంతరం ఆదివారం నిర్వహించే వనబోజనాలతో జాతర పరిసమాప్తమైనట్టు గిరిజన పూజారులు తెలిపారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మల మహాజాతర ముగిసింది. ఈనెల 21 నుండి 24 వరకు జరిగిన జాతర మహా వైభవంగ సాగింది. ఈ సారి జాతరలో సరికొత్త రికార్డ్‎లు నమోదయ్యాయి.

Medaram Jathara: ఈసారి మేడారం జాతరలో హుండీలు ఎన్ని..?.. నిండిన ఆ హుండీలను ఎక్కడికి తరలించారు..?

మేడారం మహాజాతర ముగిసింది. మునుపెన్నడూ లేని విధంగా మేడారం జాతర చరిత్రలోనే సరికొత్త రికార్డు నమోదయింది. జాతరకు నెల రోజులు ముందు, జాతర సమయంలో నాలుగు రోజులు కలుపుకుని సుమారు రెండుకోట్ల మంది భక్తులు వన దేవతలు సమ్మక్క సారక్క దేవతలకు మొక్కులు చెల్లించు కున్నారు. మొక్కలు చెల్లించుకోవడంతో పాటు భక్తులు సమర్పించిన కానుకలతో హుండీలు కూడా దండిగా నిండిపోయాయి.

Medaram Jathara: శభాష్ ఎస్పీ శబరీష్.. మేడారం జాతరలో రికార్డ్ సృష్టించిన యువ ఐపీఎస్

మేడారం మహా జాతర విజయవంతంగా ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా కోటిన్నర మంది భక్తులు వనదేవతలు సమ్మక్క, సారక్కలను దర్శనం చేసుకున్నారు. అయితే ఈ మహా జాతర మొత్తంలో హైలెట్‌గా నిలిచాడు ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఆయనే ములుగు పోలీస్ సూపరిండెంట్ శబరీష్. కట్టుదిట్టమైన భద్రతా చర్యలతోపాటు ట్రాఫిక్ నుండి భక్తుల కంట్రోలింగ్ వరకు అన్ని తానై నిలిచి జాతర సక్సెస్‌లో కీలకంగా వ్యవహరించారు.

Telangana: మేడారం మహాజాతర సరికొత్త రికార్డ్.. జనం నుండి వనంలోకి సమ్మక్క..

తెలంగాణలో మేడారం మహాజాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆదివాసి ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహిస్తున్న పూజారులు. గద్దెల వద్ద పూజలు నిర్వహించిన అనంతరం వన ప్రవేశం చేశారు. చిలుకలగుట్టకు సమ్మక్క, కన్నేపల్లికి సారలమ్మ‎ను సాగనంపనున్నారు. దీంతో వనప్రవేశంకు మూడంచెల రోప్ పార్టీతో పోలీసులు భద్రతా ఏర్పాటు చేశారు పోలీసుల అధికారులు.

  • Srikar T
  • Updated on: Feb 24, 2024
  • 7:03 pm

CM Revanth Reddy: తెలంగాణ ప్రజలకు రెండు గుడ్ న్యూస్‌లు చెప్పిన సీఎం రేవంత్ 

అధికారంలోకి వ‌చ్చిన 60 రోజుల్లోనే 25 వేల ఉద్యోగాలు భ‌ర్తీ చేశామ‌ని, 6,956 మంది స్టాఫ్ న‌ర్సుల నియామ‌కం, 441 సింగ‌రేణి ఉద్యోగులు, 15 వేల పోలీసు, ఫైర్ డిపార్టుమెంట్ ఉద్యోగాలు భ‌ర్తీ చేశామ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. మార్చి 2వ తేదీన మ‌రో 6 వేలపైచిలుకు ఉద్యోగాలు భ‌ర్తీ చేయ‌బోతున్నామ‌న్నారు.

Medaram Jatara: వనదేవతల దర్శనం కోసం ప్రముఖుల రాక.. నేడు మేడారం వెళ్లనున్న కేంద్ర మంత్రి, తెలంగాణ, గవర్నర్, సీఎంలు

గిరిజన జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.. సమ్మక్క తల్లి వచ్చింది.  ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య కుంకుమభరిణె రూపంలోని అమ్మవారిని చిలుకలగుట్ట నుంచి కిందికి తీసుకురాగానే అమ్మరాకకు గౌరవ సూచకంగా ములుగు ఎస్పీ శబరీష్​ ఏకే 47తో గాల్లోకి కాల్పులు జరిపారు. జనారణ్యంలో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరిసింది.

Medaram Jathara: మేడారానికి పూనకం.. వనం వీడి జనం మధ్యకు సమ్మక్క

మేడారం పులకించింది. గిరిజన జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సమ్మక్క ఆగమనంతో జాతరకు పూనకం పుట్టింది. కోయదొరల డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలు, పోలీసు అధికారి తుపాకీ కాల్పుల మధ్య... తల్లి సమ్మక్కను గద్దెలపైకి చేర్చారు. ఈ పతాక ఘట్టాన్ని చూసేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఆ అద్భుతాన్ని కనులారా వీక్షించిన భక్తకోటి పరవశించింది.

Telangana: అమాంతం పెరిగిన నాటు కోడి ధర.. ప్రస్తుతం కేజీ రేటు ఎంతంటే..?

సమ్మక్క-సారక్క అనుబంధ అలయాలలో భక్తులు పోటెత్తున్నారు. అమ్మవారికి మొక్కు సమర్పించిన తరువాత జాతర సమీపంలోనే విందు చేసుకుంటున్నారు.  గత జాతరతో పోలిస్తే ఇప్పుడు నాటుకోళ్ళ ధరలు ముప్పై ఐదు‌ శాతానికంటే అదనంగా పెరిగాయి. అయితే ‌ఇప్పుడు నాటుకోళ్ళు‌ గ్రామాలనుండి తీసుకువచ్చి అమ్ముతున్నారు.

Medaram Jatara 2024: అంగరంగ వైభవంగా గద్దె పైకి సమ్మక్క.. ప్రత్యక్ష ప్రసారం.!

నేడే సమ్మక్క రాక..వనం నుండి జనం మధ్యకు వన దేవత ఆగమనానికి సర్వం సిద్ధమైంది.. రాత్రి మేడారం మహాజాతరలో తొలి ఘట్టం ఆవిష్కృతమైంది.. డప్పు చప్పుళ్లు.. కోయల నృత్యాలు.. భక్తుల జయజయ ధ్వానాల నడుమ సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు ఆగమనం పూర్తయింది..ఇక మేడారం జాతర రెండో రోజు మరింత ప్రత్యేకం..సారలమ్మ గద్దెకు చేరుకోగా సమ్మక్క నేడు గద్దెపైకి రానుంది..

విమానంలో మహిళా ఇలా చేసిందేంటి.. ఒక్కసారిగా అంత షాక్.!
విమానంలో మహిళా ఇలా చేసిందేంటి.. ఒక్కసారిగా అంత షాక్.!
ప్రొటీన్ పౌడర్ అతిగా వాడారో.. అవి దెబ్బతింటాయి.!
ప్రొటీన్ పౌడర్ అతిగా వాడారో.. అవి దెబ్బతింటాయి.!
భారత క్రికెట్‌ జట్టుకు కొత్త కోచ్‌.? ద్రవిడ్‌ కూడా అప్లై చేసుకోవచ
భారత క్రికెట్‌ జట్టుకు కొత్త కోచ్‌.? ద్రవిడ్‌ కూడా అప్లై చేసుకోవచ
సామాన్యుడిలా కనిపించిన ప్రధాని.. సిక్కుల లంగర్ సేవలో మోదీ..
సామాన్యుడిలా కనిపించిన ప్రధాని.. సిక్కుల లంగర్ సేవలో మోదీ..
తాబేళ్లకు ఆహారం వేస్తున్న యువతికి షాక్. ఉన్నట్టుండి ఏం జరిగిందంటే
తాబేళ్లకు ఆహారం వేస్తున్న యువతికి షాక్. ఉన్నట్టుండి ఏం జరిగిందంటే
ఓటేసే వాళ్లకు ఫ్రీ రైడ్.. ర్యాపిడో ఆఫర్.. వినియోగించుకోండి.
ఓటేసే వాళ్లకు ఫ్రీ రైడ్.. ర్యాపిడో ఆఫర్.. వినియోగించుకోండి.
ఎలుగుబంట్లు చకచకా చెట్టు ఎక్కడం చూశారా.? వీడియో వైరల్..
ఎలుగుబంట్లు చకచకా చెట్టు ఎక్కడం చూశారా.? వీడియో వైరల్..
కొండలు ఎక్కి, గుట్టలు దాటొచ్చి ఓటు వేసిన గిరిజనులు.. వైరల్ వీడియో
కొండలు ఎక్కి, గుట్టలు దాటొచ్చి ఓటు వేసిన గిరిజనులు.. వైరల్ వీడియో
ఈ ఆకుకూరలో ఉన్న ఆ రహస్యం తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఈ ఆకుకూరలో ఉన్న ఆ రహస్యం తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
మంగళగిరిలో ఓటు వేసిన పవన్ కళ్యాణ్.. సతీమణితో కలిసి వచ్చి..
మంగళగిరిలో ఓటు వేసిన పవన్ కళ్యాణ్.. సతీమణితో కలిసి వచ్చి..