AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మేడారం జాతర

మేడారం జాతర

మేడారం జాతర.. ప్రతి రెండేళ్లకోసారి జరిగే మహా గిరిజన జాతర. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరకు నాలుగైదు రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తుల తరలివస్తారు. తెలంగాణలో కుంభమేళాను తలపిస్తుంది మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర. 2022 మేడారం జాతరలో దాదాపు కోటిన్నర మంది భక్తులు గిరిజన దేవతలను దర్శించుకున్నట్లు ప్రభుత్వ అంచనా. ఈ సారి దీనికి మించి భక్తులు వనదేవతలు సమ్మక్క, సారక్కను దర్శించుకునే అవకాశముంది. సమ్మక్క సారక్క మహాజాతరను 2024 ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నారు. ఈ నాలుగు రోజులు మేడారం అభయారణ్యం జనారణ్యంగా మారుతుంది.

కోట్లాదిమంది భక్తుల నమ్మకానికి ప్రతిరూపం, కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం… మేడారం జాతర. సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం. స్థానిక ఆదివాసీ బిడ్డ సీతక్క మంత్రి కావడం, అదే జిల్లాకు చెందిన కొండా సురేఖ దేవాదాయ మంత్రిగా చార్జ్ తీసుకోవడం… ఈ రెండు ప్రత్యేకతల ప్రభావం ఈసారి మహా జాతరపై స్పష్టంగా కనిపించబోతోంది. రూ.100 కోట్లగా పైగా ఖర్చయ్యే జన జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 70 కోట్లు మంజూరు చేసింది. జాతరకు 10 రోజుల ముందే ఏర్పాట్లు పూర్తిచేయాలని జిల్లా అధికార యంత్రాంగానికి మంత్రి సీతక్క డెడ్‌లైన్ విధించారు.

వీఐపీలు, ప్రజాప్రతినిధుల రాక నేపథ్యంలో జాతర నిర్వహణలో పోలీసులదే కీలక పాత్ర. మావోయిస్టు యాక్షన్ టీమ్‌తో ముప్పు ఉన్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం అయ్యాయి. భారీగా సీసీటీవీ కెమరాలు, డ్రోన్ కెమరాలతో అక్కడ భద్రతా ఏర్పాట్లను సమీక్షించనున్నారు.

ఇంకా చదవండి

Medaram Jathara: మేడారం భక్తులకు బ్యాడ్‌న్యూస్.. బెల్లం ధరలు ఒకేసారి పెంపు.. కేజీ ఎంతంటే..?

మేడారం జాతరకు వెళ్లే భక్తులకు షాక్. వ్యాపారులు బెల్లం ధరలను ఒక్కసారిగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సిండికేట్‌గా ఏర్పడి ఉద్దేశపూర్వంగా ధరలను పెంచారు. దీంతో బెల్లం కొనాలంటే భక్తులు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. జాతర ముగిసే వరకు బెల్లం ధరలు ఇలాగే ఉండనున్నాయి.

Medaram Jatara: మేడారం జాతరకు వెళ్తున్నారా..? రైల్వేశాఖ నుంచి బిగ్ న్యూస్.. ప్రత్యేక రైళ్లపై కీలక అప్డేట్

మేడారం జాతరకు వెళ్లే భక్తులకు రైల్వేశాఖ శుభవార్త తెలిపింది. జాతర రద్దీ కారణంగా వరంగల్, కాజీపేటకు ప్రత్యేక రైళ్లను వివిధ ప్రాంతాల నుంచి నడపనుంది. సికింద్రాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి ప్రత్యేక రైళ్ల సర్వీసులను తిప్పనుంది. వీటికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Medaram Jatara: మేడారంలో తొలి ఘట్టం.. ఈ మండమెలిగే పండగ ప్రత్యేకత ఏంటి.. ఎందుకు జరుపుతారో మీకు తెలుసా?

మేడారం మహాజాతరకు సరిగ్గా వారం రోజుల ముందు నిర్వహించే తొలిఘట్టం మండమేలిగే పండుగ మహా వైభవంగా జరిగింది. ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం ఆ కార్యక్రమం నిర్వహించారు. దృష్టశక్తుల చూపు మేడారం వైపు పడకుండా దిగ్బంధం చేసి కోడిపిల్లను బలిచ్చి ఊరుకట్టు నిర్వహించారు. మాఘశుద్ధ పంచమి సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకతో మేడారం జాతర ప్రారంభమైనట్టే భావిస్తారు. మండమెలిగే పండుగ నుంచి సరిగ్గా వారం రోజులకు అమ్మవార్లు వనం నుండి జనంలోకి వస్తారు.

Medaram Jathara: మేడారం జాతరలో కుక్కకు తులాభారం.. మరో వీడియో రిలీజ్ చేసిన తెలుగు హీరోయిన్

మేడారం జాతరలో పెంపుడు కుక్కను తూకం వేసి మొక్కు చెల్లించుకున్న టాలీవుడ్ హీరోయిన్ పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవయ్యాయి. ఇది అమ్మవార్లను అవమానించడమేనంటూ చాలా మంది హీరోయిన్ తీరును తప్పుపట్టారు. ఈ క్రమంలో తనపై వస్తోన్న విమర్శలపై స్పందిస్తూ మరో వీడియోను రిలీజ్ చేసిందీ అందాల తార.

Chicken Prices: నాన్ వెజ్ ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. మళ్లీ పెరిగిన చికెన్, కోడిగుడ్ల ధరలు.. ఇప్పుడు ఎంతంటే..?

మేడారం జాతర సందడి ఇప్పటినుంచే మొదలైంది. ఇప్పటినుంచే సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు వెళ్తున్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి అసలు జాతర ప్రారంభం కానుంది. ఈ క్రమంలో చికెన్ ధరలు కూడా పెరుగుతున్నాయి. కేజీ ప్రస్తుతం ఎంత పలుకుతుందో తెలుసా..?

Medaram Jatara: మేడారం మహా జాతరకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఇక టెన్షన్ ఫ్రీ జర్నీ

ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరగా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ్యత సంపాదించుకున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు రంగం సిద్దంమైంది. ఈ నెల 28వ తేదీ నుంచి జాతర ప్రారంభం కానుంది. 31వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జాతర జరగనుంది. దీంతో ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.

పెంపుడు కుక్కకు ‘నిలువెత్తు బంగారం’తో తులాభారం.. ఎందుకో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..!

పెద్దపల్లికి చెందిన కాసర్ల రాజు తన పెంపుడు కుక్క భైరవ తీవ్ర అనారోగ్యం నుండి కోలుకోవడంతో అరుదైన మొక్కు తీర్చుకున్నారు. సమ్మక్క సారక్క దేవతలకు మొక్కుకుని, కుక్క ఆరోగ్యంగా మారితే నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పిస్తానని ప్రమాణం చేశారు. మొక్కు నెరవేరడంతో భైరవ బరువుకు సమానమైన బెల్లాన్ని తులాభారం వేసి సమర్పించారు. జంతువుల పట్ల ఆయనకున్న ప్రేమను స్థానికులు అభినందించారు.

Medaram Jatara: ఎవరీ సమ్మక్క-సారలమ్మ..? మేడారం వన దేవతల జాతర చరిత్ర తెలుసా..?

Medaram Jatara: ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క-సారక్క జాతర ఈ ఏడాది జనవరి 28 నుంచి జనవరి 31 వరకు జరగనుంది. కోట్లాది మంది భక్తులు వనదేవతలను దర్శించుకునేందుకు వస్తున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. 4వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ అద్భుతమైన జాతరకు మూలమైన సమ్మక్క-సారక్కలు ఎవరు, వారి చరిత్ర ఏమిటి, ఈ పండుగ ఎలా ప్రారంభమైంది అనే వివరాలను తెలుసుకుందాం.

Medaram Jatara 2026: దారులన్నీ మేడారం వైపే.. అలా చేస్తే ఇట్టే పసిగడతారు.. AI టెక్నాలజీతో ఖాకీల మూడో కన్ను

మేడారం మహాజాతర నిర్వహణలో పోలీస్ డిపార్ట్మెంట్ ఆధునిక హంగులతో సన్నద్దమవుతోంది. తొలిసారిగా ఎఐ టెక్నాలజీతో భద్రత కల్పించబోతున్నారు. AI టెక్నాలజీ కెమెరాలతో పాటు, 20 డ్రోన్స్ గగనతలం నుంచి డేగ కన్నుతో భద్రత పర్యవేక్షణ చేయబోతున్నారు. మేడారంలో ఏర్పాటుచేసిన పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచే చుట్టూ 20 కిలో మీటర్ల మేర ఎఐ టెక్నాలజీతో మూడో కన్ను నిఘా పెట్టారు. మేడారం జాతరలో పోలీస్ భద్రతపై స్పెషల్ రిపోర్ట్..

Medaram 2.O: కోట్లాది భక్తులకు కొంగు బంగారం.. శిలాక్షరాలుగా సమ్మక్క సారలమ్మ చరితలు

Medaram Sammakka Saralamma Jathara: మేడారం చరిత్ర దాదాపు వెయ్యేళ్ల నాటిది. అలాంటి ఘన చరిత్రకు ఆధునిక హంగులు అద్దింది తెలంగాణ ప్రభుత్వం. గిరిజనుల మనోభావాలకు తగ్గట్టుగా, ఆదివాసీల నమ్మకాన్ని ప్రతిబింబించేలా రాతి ప్రాకారాలతో, శిలాతోరణాలతో తీర్చిదిద్దింది సర్కార్. కోయ తెగల ఆచార వ్యవహారాలకు అద్దం పడుతూ, జాతరకు వచ్చిన వాళ్లందరికీ వనదేవతల ప్రాశస్త్యం తెలియజేసేలా తెల్లరాతి స్తంభాలతో సిద్ధమైంది మేడారం.

Medaram Jatara Buses: మేడారం జాతరకు వెళ్లే మహిళలకు శుభవార్త.. ఆ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం..

మేడారం సమక్క సారలమ్మ జాతరకు సమయం దగ్గర పడుతోంది. మరో 10 రోజుల్లో జాతర ప్రారంభం కానుంది. దీంతో ఆర్టీసీ ప్రత్యేక బస్సులతో పాటు వాటిల్లో ఛార్జీల వివరాలను ప్రకటించింది. వీటిల్లో ఉచిత బస్సు ప్రయాణంపై వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ కీలక ప్రకటన చేసింది.

Medaram Jatara: మేడారం జాతరకు వెళ్లేవారికి బిగ్ అప్డేట్.. ఈ సారి ప్రభుత్వం కొత్త నిర్ణయం.. చరిత్రలో ఇదే తొలిసారి..

మేడారం జాతరలో దాదాపు 13 వేల మంది పోలీసులు భద్రత పర్యవేక్షించనున్నారు. ఈ మేరకు ఎలాంటి తొక్కిసలాట జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకోనున్నారు. అలాగే గత జాతరలో 30 వేల మంది వరకు తప్పిపోయారు. దీంతో ఈ సారి తప్పిపోయినవారిని గుర్తించేందుకు జియో ట్యాగింగ్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు.