AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మేడారం జాతర

మేడారం జాతర

మేడారం జాతర.. ప్రతి రెండేళ్లకోసారి జరిగే మహా గిరిజన జాతర. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరకు నాలుగైదు రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తుల తరలివస్తారు. తెలంగాణలో కుంభమేళాను తలపిస్తుంది మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర. 2022 మేడారం జాతరలో దాదాపు కోటిన్నర మంది భక్తులు గిరిజన దేవతలను దర్శించుకున్నట్లు ప్రభుత్వ అంచనా. ఈ సారి దీనికి మించి భక్తులు వనదేవతలు సమ్మక్క, సారక్కను దర్శించుకునే అవకాశముంది. సమ్మక్క సారక్క మహాజాతరను 2024 ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నారు. ఈ నాలుగు రోజులు మేడారం అభయారణ్యం జనారణ్యంగా మారుతుంది.

కోట్లాదిమంది భక్తుల నమ్మకానికి ప్రతిరూపం, కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం… మేడారం జాతర. సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం. స్థానిక ఆదివాసీ బిడ్డ సీతక్క మంత్రి కావడం, అదే జిల్లాకు చెందిన కొండా సురేఖ దేవాదాయ మంత్రిగా చార్జ్ తీసుకోవడం… ఈ రెండు ప్రత్యేకతల ప్రభావం ఈసారి మహా జాతరపై స్పష్టంగా కనిపించబోతోంది. రూ.100 కోట్లగా పైగా ఖర్చయ్యే జన జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 70 కోట్లు మంజూరు చేసింది. జాతరకు 10 రోజుల ముందే ఏర్పాట్లు పూర్తిచేయాలని జిల్లా అధికార యంత్రాంగానికి మంత్రి సీతక్క డెడ్‌లైన్ విధించారు.

వీఐపీలు, ప్రజాప్రతినిధుల రాక నేపథ్యంలో జాతర నిర్వహణలో పోలీసులదే కీలక పాత్ర. మావోయిస్టు యాక్షన్ టీమ్‌తో ముప్పు ఉన్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం అయ్యాయి. భారీగా సీసీటీవీ కెమరాలు, డ్రోన్ కెమరాలతో అక్కడ భద్రతా ఏర్పాట్లను సమీక్షించనున్నారు.

ఇంకా చదవండి

Tollywood: మేడారం సమ్మక్క, సారక్కకు నిలువెత్తు బంగారం సమర్పించిన టాలీవుడ్ నటి.. వీడియో ఇదిగో

ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర గా మేడారం సమ్మక్క, సారక్క జాతర మొన్ననే అట్టహాసంగా జరిగింది. ఇక్కడ కొలువైన అమ్మవార్లకు బంగారం (బెల్లం) సమర్పించడం ఆనవాయితీగా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖ నటి కూడా అమ్మవార్లకు నిలువెత్త బంగారం సమర్పించింది.

మేడారం హుండీలో చిత్ర విచిత్రమైన కోరికలు.. చదివి షాకవుతున్న సిబ్బంది

మేడారం మహాజాతర హుండీల లెక్కింపులో భక్తుల వింత కోరికలు వెలుగుచూశాయి. హన్మకొండలో జరుగుతున్న ఈ ప్రక్రియలో ఆస్తి, ప్రేమ, ఉద్యోగం, వివాహం వంటి విషయాలపై భక్తులు రాసిన విజ్ఞప్తులు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. సొంత కొడుకు వేధింపుల నుండి రక్షించమని ఒక తండ్రి, పెళ్లికి కుటుంబాలు అంగీకరించాలని ప్రేమ జంట వేడుకోవడం వంటి లేఖలు వారి అచంచలమైన నమ్మకాన్ని చాటుతున్నాయి. ఈ లేఖలు చర్చనీయాంశంగా మారాయి.

  • Phani CH
  • Updated on: Feb 8, 2026
  • 1:30 pm

సమ్మక్క సారక్క మీరే దిక్కు.. మేడారం హుండీ కానుకల్లో చిత్ర విచిత్రాలు.. ఆస్తి కోసం ఒకరు.. ప్రేమకోసం మరొకరు..

మేడారం జాతర ముగిసింది.. హుండీల లెక్కింపు కొనసాగుతుంది. కానుకల లెక్కింపు సందర్భంగా లభ్యమవుతున్న భక్తుల వింత కోరికల లేఖలు సిబ్బందిని ఆశ్చర్యపరుస్తున్నాయి. కరెన్సీ కట్టలకు సమాంతరంగా వింత కోరికలు చూసి అంతా షాక్ అవుతున్నారు.. ఇంతకి ఆ లేఖల్లో ఏముంది..! భక్తుల వింత కోరికలు ఎలా ఉన్నాయో మీరే చూడండి..

IPS Vasundhara Yadav: మేడారంలో మెరిసిన డైనమిక్ ఐపీఎస్ మేడం..! బ్యాగ్రౌండ్ మాత్రం యమ పవర్‌ఫుల్..

మేడారం జాతర ముగిసింది.. అయితే.. అందం.. అభినయం.. నిబద్ధతతో ఓ మహిళా ఐపీఎస్ అధికారిని నెట్టింట వైరల్ గా మారింది. జాతరలో ఆమె ఎందుకలా హైలెట్ అయ్యారు. ప్రస్తుతం నెట్టింట ఫుల్ వైరల్ గా మారిన ఆ మహిళ ఐపీఎస్ అధికారిని ఎవరు.. ఆమె ప్రస్తుతం ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారు..! అని.. నిటిజన్లు సెర్చ్ చేస్తున్న ఆ లేడీ సింగం ఫుల్ డిటైల్స్ మీరే చూడండి..

Medaram Jatara: 1996లో మేడారం జాతర ఎలా జరిగేదో చూశారా.. చాలా అరుదైన వీడియో

తెలంగాణ కుంభమేళ..మేడారం మహాజాతర విజయవంతంగా పరిసమాప్తమైంది. చల్లని తల్లులు సమ్మక్క-సారాలమ్మ జనం నుంచి మళ్లీ వనంలోకి అంతర్ధానమయ్యారు. ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం చల్లని తల్లుల వనప్రవేశ ఘట్టం సజావుగా ముగిసింది. అశేష భక్తుల జయజయధ్వానాల నడుమ సమ్మక్కను మళ్లీ చిలకలగుట్టకు తరలించారు ఆదివాసీ పూజారులు.

IPS వసుంధర యాదవ్.. మేడారం జాతరలో ట్రెండింగ్..

మేడారం జాతర 3వ రోజుకు చేరుకుంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతరకు భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. నేటితో మేడారం మహా జాతర ముగుస్తుంది. అయితే ఈ సారి జాతరలో ఓ లేడీ ఐపీఎస్ ఆఫీసర్ బాగా ట్రెండ్ అవుతున్నారు.

మేడారంలో క్రౌడ్ బరస్ట్.. వనం నుంచి జనంలోకి సమ్మక్క.. AK 47 తూటాలతో ఘన స్వాగతం..!

లక్షలాది మంది భక్తజనం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మేడారం వన దేవతల జన ప్రవేశం పూర్తయింది. కన్నెపల్లి నుండి సారలమ్మ, చిలుకలగుట్ట నుండి సమ్మక్క దేవతలు ఇద్దరూ గద్దెలపై ప్రతిష్టాపన చేయడంతో భక్త జనకోటికి దర్శనమిస్తున్నారు. మహిమాన్వితురాలైన సమ్మక్క తల్లి రాకతో మేడారం ప్రాంగణం పులకించిపోయింది. శక్తి పీఠంగా మారిన మేడారం గద్దెల ప్రాంగణానికి భక్తకోటి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.

సారలమ్మను మేడారం గద్దెమీదికి తీసుకొచ్చేది ఇక్కడి నుంచే!

మేడారం మహాజాతర వైభవంగా ప్రారంభమైంది. కన్నెపల్లిలోని సారలమ్మ దేవాలయం నుండి పూజారులు ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం సారలమ్మ ప్రతిరూపాన్ని గద్దెలపైకి తీసుకువస్తారు. జంపన్న వాగు గుండా సాగే ఈ యాత్రకు పగిడిద్దరాజు, గోవిందరాజుల ఆగమనం తోడైంది. లక్షలాది మంది భక్తులతో మేడారం జనసంద్రమై, తొలి ఘట్టానికి సిద్ధమైంది.

Medaram Jatara: మేడారంలో పేలిపోతున్న మటన్, చికెన్ ధరలు.. వాయమ్మో చెట్టు నీడకు కూడా కిరాయినా.. నిలువునా దోపిడీ

మేడారం జాతర అట్టాహాసంగా ప్రారంభమైంది. భక్తులు లక్షలాదిగా తరలివస్తుండగా.. స్ధానిక వ్యాపారులు దోపిడీ చేస్తున్నారు. ధరలను రెట్టింపు చేసి అమ్ముతున్నారు. చికెన్, మటన్ ధరలు అయితే మండిపోతున్నాయి. చెట్టు నీడకు కూడా కిరాయి వసూలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలొస్తున్నాయి.

Medaram Jatara: సమ్మక్క-సారక్క కంటే ముందే తప్పనిసరి దర్శనం.. గట్టమ్మ తల్లి ఎవరు?

Gattamma Goddess: మేడారం సమ్మక్క–సారలమ్మ తల్లులను దర్శించుకునే భక్తులు ముందుగా ములుగు మార్గంలోని గట్టమ్మ తల్లిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అందుకే, మేడారం గిరిజన జాతరకు వెళ్లే భక్తులకు గట్టమ్మ ఆలయం ‘గేట్ వే ఆఫ్ మేడారం’గా ప్రసిద్ధి చెందింది. ఆ ఆలయం గురించిన ప్రత్యేక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Jabardasth Racha Ravi: మేడారం జాతరలో జబర్దస్త్ రచ్చరవి.. ఫ్యామిలీతో కలిసి అమ్మవార్లకు మొక్కులు.. ఫొటోస్

జబర్దస్త్ ఫేమ్, టాలీవుడ్ కమెడియన్ రచ్చ రవి మేడారంలో జరుగుతున్న సమ్మక్క సారక్క జాతరలో సందడి చేశాడు. తన కుటుంబ సభ్యులతో కలిసి జాతరకు వచ్చిన ఈ నటుడు అమ్మవారికి మొక్కులు సమర్పించుకుని దర్శనం చేసుకున్నాడు. అనంతరం ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Medaram Jatara: మేడారం జాతర.. బెల్లం ‘బంగారం’ ఎలా అయ్యిందో తెలుసా..?

Jaggery as Gold: జనవరి 28, బుధవారం రోజున మేడారం జాతర ప్రారంభమై జనవరి 31 వరకు జరగనుంది. తెలంగాణ కుంభమేళాగా పేరొందిన ఈ జాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే, ఈ జాతరలో ఒక ప్రత్యేకమైన విశ్వాసం అందరినీ ఆకర్షిస్తుంది. ఇక్కడ బెల్లాన్ని “బంగారం”గా గిరిజన దేవతలకు భక్తులు సమర్పించుకుంటారు. బెల్లాన్ని బంగారం ఎందుకు పిలుస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.