మహా కుంభమేళా 2025

మహా కుంభమేళా 2025

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా (Mahakumbh 2025)కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఈ మహా కుంభమేళాను నిర్వహిస్తున్నారు. ఈ సారి 2025 జనవరి 13 తేదీ నుంచి ఫిబ్రవరి 26 వరకు ఈ మహా కుంభమేళా నిర్వహించనున్నారు. కోట్లాది మంది యాత్రికులు దేశ నలుమూలల నుంచి ప్రయాగ్ రాజ్‌కు తరలిరానున్నారు. ఈ సారి కుంభమేళాలో దాదాపు 45 కోట్ల మంది యాత్రికులు పాల్గొంటారని అంచనావేస్తున్నారు. ఆ మేరకు యాత్రికులు, సాధువుల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

మహా కుంభమేళా దేశ ఐక్యతా మహాయజ్ఞంగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. మహా కుంభమేళాలో కుల, వర్గ వైషమ్యాలు నశించిపోతాయని అన్నారు. కోట్లాది మంది ఒకే భావజాలంతో ముడిపడేందుకు కుంభమేళా దోహదపడుతుందన్నారు.

ఇంకా చదవండి

Maha Kumbha mela: కుంభ సమయంలోనే నాగ సాధువులు ఎలా వస్తారు? తర్వాత ఎక్కడికి వెళ్తారు?

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ మరికొన్ని గంటల్లో ప్రారంభంకానుంది. సోమవారం నుంచి మహాకుంభోత్సవం ప్రారంభం కానుంది. హిందూ ధర్మంలోని ఒక ప్రత్యేకమైన సన్యాస సంప్రదాయానికి చెందినవారు. నాగ సాధువులు సనాతన ధర్మాన్ని రక్షించే యోధులుగా భావిస్తారు. ఈ నాగ సాధువులు భారీ సంఖ్యలో మహా కుంభలో పాల్గొంటారు. నాగ సాధువుల రహస్య జీవితం కారణంగా వీరు కుంభంలో మాత్రమే కనిపిస్తారు. కుంభమేళాకు ఈ నాగ సాధువులు ఎక్కడ నుంచి వస్తారు? ఎక్కడికి వెళతారు? ఇది ఎవరికీ తెలియదు.

Maha Kumbh 2025: మహాకుంభమేళా కోసం సిద్ధమైన ప్రయాగరాజ్‌.. 40 కోట్ల మంది వస్తారని అంచనా

ప్రయాగ్‌రాజ్‌ పిలుస్తోంది.. కుంభమేళాకు రారమ్మంటోంది. మహాకుంభమేళా కోసం ప్రయాగ్‌ రాజ్‌ సిద్ధమవుతోంది. రేపటి నుంచి ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా ప్రారంభమవుతుంది . ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే రైళ్లు, బస్సులు, ఫ్లైట్‌ బుకింగ్స్‌ ఫుల్‌ అయ్యాయి. 45 రోజుల పాటు సాగే ఈ కుంభమేళా కోసం దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తరలివస్తారని భావిస్తున్నారు. కుంభమేళాకు 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా ఉంది. కుంభమేళా పర్వదినాల్లో ఉత్తరప్రదేశ్‌కు రూ. 2 లక్షల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని యూపీ సీఎం ప్రకటించారు. పన్నెండు పుష్కరాలకు వచ్చే మహాకుంభమేళా కావడంతో అత్యంత వైభవంగా జరపాలని.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.

Tirumala: అక్కడ అచ్చం తిరుమల శ్రీవారి ఆలయమే.. సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ కూడా అన్ని కైంకర్యాలు..

అచ్చం తిరుమల శ్రీవారి ఆలయమే మరో చోట ఇప్పుడు దర్శనం ఇస్తోంది. తిరుమల ఆలయంలో జరిగే నిత్య కైకర్యాలు, నివేదనలు అక్కడ జరగబోతున్నాయి. ఈ నెల 13 నుంచి తిరుమల వెంకన్న ఆలయం భక్తులకు అక్కడ అందుబాటులోకి రాబోతుంది. ఇంతకీ ఎక్కడ ఉన్నదే భక్తుల సందేహం. అది ఎక్కడో కాదు మహా కుంభమేళా జరిగే ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లోనే.

Mahakumbh 2025: మహా కుంభమేళాకు రానున్న స్టీవ్‌ జాబ్స్‌ భార్య లారెన్‌.. కల్పవస్‌ దీక్షకు సంకల్పం

కామన్‌మేన్ నుంచి కుబేరుడి దాకా ప్రపంచం మొత్తం....ఇప్పుడు ప్రయాగ్‌రాజ్‌ వైపు అడుగులు వేస్తోంది. త్రివేణి గంగలో మునకలు వేసేందుకు లక్షలాదిమంది విదేశీయులు సైతం ఉరకలు వేస్తున్నారు. యాపిల్‌ కో ఫౌండర్‌ స్టీవ్‌ జాబ్స్‌ భార్య లారెన్‌ పావెల్‌ కూడా మహా కుంభమేళాకు తరలి రానున్నారు.

Maha Kumbhamela: మహా కుంభ భక్తులకు ఇస్కాన్ మహాప్రసాద వితరణ.. మేము సైతం అంటూ చేతులు కలిపిన అదానీ గ్రూప్..

ప్రయాగరాజ్ లో ఈ నెల 13 నుంచి జరగనున్న మహా కుంభ మేళాకు సర్వం సిద్ధమయింది. మన దేశం ప్రజలు మాత్రమే కాదు విదేశీయులు కూడా ఈ కుంభ మేళాపై ఆసక్తిని చూపిస్తున్నారు. ఇప్పటికే త్రివేణీ సంగమం వద్ద సందడి మొదలైంది. యాత్రికులు, భక్తులు , బాబాలు, స్వాములు చేరుకుంటున్నారు. అయితే ఈ మహా కుంభలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటారు అని భావిస్తూ ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేస్తోంది యూపీ సర్కార్. మరోవైపు ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులకు మహా ప్రసాదాన్ని అందించడానికి ఇస్కాన్ రెడీ అవుతుండగా.. భగవంతుడి సేవలో మేము సైతం అంటోంది అదానీ సంస్థ..

Kumbha Mela: ఈ టిప్స్‎తో మీ కుంభమేళా జర్నీ సేఫ్ అండ్​ హ్యాపీ​!

పవిత్ర నదుల్లో స్నానం చేయడం ముక్తి, మోక్ష మార్గమని భావించి వెళుతున్నారా? జనవరి 13వ ఉత్తరప్రదేశ్​ ప్రయాగ్​రాజ్​లో ప్రారంభం కానుంది. బుకింగ్‌: ప్రభుత్వ ట్రావెల్ ఏజెన్సీల సహాయం తీసుకుని ఎలా వెళ్లాలి? ఎక్కడ స్టే చేయాలి? అన్నది ముందే ప్లాన్​ చేసుకోవాలి.

Maha Kumbhamela 2025: మహాకుంభమేళాపై విదేశీయులూ అమితాసక్తి.. ఎన్ని దేశాల వారు ఆరా తీస్తున్నారంటే..?

ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరగనున్న మహా కుంభ మేళా కోసం యూపీ సర్కార్ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో యాత్రికులు వస్తారని అంచనా వేసి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ మహా కుంభ కోసం చేస్తోన్న ఏర్పాట్లను యుపీ సర్కార్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తుంది. ఈ కుంభమేళా కోసం చేస్తోన్న ఏర్పాట్లను ప్రదర్శిస్తున్న వెబ్ సైట్ ను 183 దేశాల ప్రజలు సందర్శిస్తున్నట్లు యూపీ సర్కార్ వెల్లడించింది.

కాశీ విశ్వేశ్వరుడి దర్శనం, మహా కుంభలో స్నానం.. సికింద్రాబాద్ నుంచి IRCTC ప్యాకేజీ.. పూర్తి వివరాలు మీ కోసం

మహా కుంభకు వేళాయెరా.. ప్రయగ్ రాజ్ లో జరగనున్న మహా కుంభ మేళా జాతరకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 45 రోజుల పాటు జరగనున్న ఈ మహా కుంభ వేడుకలపైనే అందరి దృష్టి నెలకొంది. అంతేకాదు ఈ కుంభలో పాల్గొనాలని.. పవిత్ర గంగమ్మ ని పూజించి ఒక్కసారైనా త్రివేణీ సంగమంలో స్నానమాచారించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఈ నేపధ్యంలో ప్రయాజ్ రాజ్ కు వెళ్లాలనుకునే తెలుగు వారికి రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. కాశీ విశ్వేశ్వరుడి దర్శనం.. సంగమ స్నానం చేసేలా ఓ స్పెషల్ ప్యాకేజీని ప్రకటించింది.

Maha Kumbhamela: కుంభమేళా వెళ్లే తెలుగువారికి గుడ్ న్యూస్.. ప్రయగ్ రాజ్ కు స్పెషల్ ట్రైన్స్.. ఎక్కడ నుంచి అందుబాటులో ఉండనున్నయంటే..

ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళాకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇప్పటికే భక్తుల సౌకర్యార్ధం ఏర్పాట్లపై యోగి సర్కార్ దృష్టి పెట్టింది. ప్రపంచం దృష్టి ఆకర్షించేలా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ భారీ సంఖ్యలో భక్తులు కుంభ మేళాలో పాల్గొంటారని భావిస్తున్న రైల్వే శాఖ ప్రయాణీకుల సౌకర్యార్ధం మరిన్ని రైళ్ళను నడడం కోసం రెంగం సిద్ధం చేసింది. దక్షిణ మధ్య రైల్వే శాఖ సైతం తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే వారి కోసం స్పెషల్ సర్వీసులను ఏర్పాటు చేసింది.

Maha Kumbha Mela: కుంభ మేళా ఏర్పాట్లు పరిశీలించిన సీఎం.. హనుమాన్‌ మందిర్‌లో ప్రత్యేక పూజలు

ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళాకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమయ్యింది. మరో 12 రోజుల్లో కుంభమేళా మొదలవుతుంది. ఈ సారి కుంభ మేళా ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల సౌకర్యార్ధం చేస్తోన్న ఏర్పాట్లను సీఎం యోగి పరిశీలించారు. ప్రయాగ్‌రాజ్‌ పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు.. త్రివేణి సంగమం దగ్గర ప్రత్యేక పూజలను నిర్వహించారు.