AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహా కుంభమేళా 2025

మహా కుంభమేళా 2025

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా (Mahakumbh 2025)కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఈ మహా కుంభమేళాను నిర్వహిస్తున్నారు. ఈ సారి 2025 జనవరి 13 తేదీ నుంచి ఫిబ్రవరి 26 వరకు ఈ మహా కుంభమేళా నిర్వహించనున్నారు. కోట్లాది మంది యాత్రికులు దేశ నలుమూలల నుంచి ప్రయాగ్ రాజ్‌కు తరలిరానున్నారు. ఈ సారి కుంభమేళాలో దాదాపు 45 కోట్ల మంది యాత్రికులు పాల్గొంటారని అంచనావేస్తున్నారు. ఆ మేరకు యాత్రికులు, సాధువుల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

మహా కుంభమేళా దేశ ఐక్యతా మహాయజ్ఞంగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. మహా కుంభమేళాలో కుల, వర్గ వైషమ్యాలు నశించిపోతాయని అన్నారు. కోట్లాది మంది ఒకే భావజాలంతో ముడిపడేందుకు కుంభమేళా దోహదపడుతుందన్నారు.

ఇంకా చదవండి

Monalisa: ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకున్న మోనాలిసా ఇస్లాం మతంలోకి మారనుందా? ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా..

మహా కుంభమేళా బ్యూటీ మోనాలిసా భోంస్లే వివాహంపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. మోనాలిసాతో సినిమా తీస్తోన్న డైరెక్టర్ సరోజ్ మిశ్రా అయితే ఏకంగా ఈ వివాహాన్ని లవ్ జిహాద్ అని సంచలన కామెంట్స్ చేశాడు. అందుకు తగ్గట్టుగానే ఫర్మాన్ ఖాన్‌ను వివాహం చేసుకున్న మోనాలిసా ఇస్లాం మతంలోకి మారుతుందా? అని ప్రశ్నిస్తున్నారు.

Monalisa: మోనాలిసా పెళ్లి చేసుకున్న ఫర్మాన్ ఖాన్ ఏం చేస్తుంటాడో తెలుసా? వీరి లవ్ స్టోరీ మామూలుగా లేదుగా..

మహా కుంభమేళా వైరల్ బ్యూటీ మోనాలిసా భోంస్లే అందరికీ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం సినిమాలు, యాడ్స్ తో బిజీ బిజీగా ఉంటోన్న ఆమె బుధవారం (మార్చి11) నాటకీయ పరిస్థితుల మధ్య మొహమ్మద్ ఫర్మాన్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. మరి వీరి మధ్య ఎలా పరిచయం ఎలా మొదలైంది? ప్రేమగా ఎలా మారిందన్నది తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు.

Monalisa Bhosle: పూసలమ్ముకునే మోనాలిసా ఇప్పుడెలా మారిపోయిందా చూశారా? నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా?

మహా కుంభమేళా లో రోడ్డు మీద పూసలమ్ముతూ కెమెరాల కంటికి చిక్కింది మోనాలిసా. అంతే రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యింది. నెట్టింట సెన్సేషన్ అయ్యింది. ఓ ప్రముఖ దర్శకుడు ఆమెతో ఏకంగా సినిమా కూడా అనౌన్స్ చేశాడు. దీంతో ఇప్పుడామె స్టార్ సెలబ్రిటీగా మారిపోయింది.

Kumbh Mela: కుంభమేళా ప్రాంతంలో ఫుల్‌స్వింగ్‌లో క్లీనింగ్‌ డ్రైవ్‌

మహా కుంభమేళాను అత్యద్భుతంగా నిర్వహించిన ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం..కార్యక్రమం తర్వాత క్లీనింగ్‌ డ్రైవ్‌ను కూడా అదే స్థాయిలో చేపట్టింది. కుంభమేళా కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక ఏర్పాట్లను తొలగించడంతో పాటు.. నదిలో భారీగా పొగుబడ్డ వ్యర్థాలను క్లీన్ చేస్తోంది. పర్యావరణానికి హానికలగని రీతిలో..ఈ కార్యక్రమం చేపట్టింది యోగి ప్రభుత్వం.

ప్రయాగ్‌రాజ్‌లో నేత్ర కుంభ్ సేవలు అనిర్వచనీయం.. లక్షలాది మందికి ఉచిత కంటి పరీక్షలు

దృష్టి లోపం ఉన్నవారికి సేవ చేయడానికి ఒక చిన్న ప్రయత్నంగా నేత్ర కుంభ్ మొదటిసారిగా 2019 లో అర్ధ కుంభ్ సమయంలో ప్రారంభించారు. ఆ సమయంలో 2.5 లక్షలకు పైగా ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించారు. 1.25 లక్షల మందికి ఉచిత కళ్ళజోళ్ళు పంపిణీ చేశారు

Telangana: ఆ ఊరంతా అందిన కుంభమేళా పవిత్ర జలం.. కారణం ఆయనే

భూమ్మీద అతిపెద్ద జనసమ్మేళనానికి వేదిక ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభ్ నగరి. ప్రపంచంలోని హిందువుల జనాభాలో సగం మందికి పైగా కుంభమేళాకు వచ్చారు. అక్కడికి వెళ్లి వచ్చినవారిని ప్రయాగ్‌రాజ్ వెళ్లారా.. త్రివేణి సంగమంలో అమృత స్నానం ఆచరించారా.. మరి మాకూ కాసిన్ని పవిత్రజలాల్ని తేకపోయారూ.. అని ఇరుగూపొరుగూ అడిగితే.. అదొక పెద్ద ఇరకాటం. ఒకరు ఇద్దరకు అయితే ఇవ్వగలరు.. పదుల సంఖ్యలో అడిగితే ఏం చేయగలరు. కానీ ఈయన మాత్రం ఊరు అంతా పవిత్ర జలాన్ని పంపిణీ చేశారు.

Mahakumbh Mela 2025: మహా కుంభమేళకు వెళ్లలేకపోయారా..? మీ కోసమే ఈ ‘డిజిటల్‌ బాత్‌’.. అదేంటంటే..

సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 13వ తేదీన ప్రారంభం అయిన ఈ మహా కుంభమేళా 2025.. మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26వ తేదీతో ముగిసింది. మొత్తంగా 45 రోజుల్లో 66 కోట్లకు పైగా భక్తులు మహా కుంభమేళాకు వచ్చినట్లు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. అయితే, ఈ కుంభమేళకు సంబంధించి అనేక వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ వైరల్‌ వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Maha Kumbh Mela: మహా కుంభమేళాలో పవిత్ర స్నానం.. ఫొటోలు షేర్ చేసిన టాలీవుడ్ నటి.. ఎవరో గుర్తు పట్టారా?

ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా ముగిసింది. జనవరి 13న ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఫిబ్రవరి 26 వరకు అట్టహాసంగా జరిగింది. సుమారు 60 కోట్లకు పైగా భక్తులు మహా కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించారు. సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగమయ్యారు.

Maha Kumbh Mela: మహా కుంభమేళా ఫొటోలు షేర్ చేసిన ట్రెండింగ్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా? తల్లి కూడా స్టార్ నటినే

ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకగా గుర్తింపు పొందిన ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా ముగిసింది. జనవరి 13న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఫిబ్రవరి 26 వరకు అట్టహాసంగా జరిగింది. సుమారు 60 కోట్లకు పైగా భక్తులు మహా కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించారు.

చివరి అమృత్‌స్నాన్‌.. ప్రయాగ్‌రాజ్‌కు కోటి మందికి పైగా.. వీడియో!

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళాచివరి దశకు చేరింది. ఫిబ్రవరి 26తో ఈ మహాకుంభమేళా ముగియనుంది. పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు తరలివెళ్తున్నారు. చివరి అమృత్‌ స్నాన్‌ కోసం కోటి మందికిపైగా భక్తులు వస్తారని యోగి ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాగ్‌రాజ్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించింది. కుంభమేళా ప్రాంతాన్ని ‘నో వెహికల్‌ జోన్‌’ గా మారుస్తున్నారు అధికారులు. ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రకటించారు.

PM Modi: మహాయజ్ఞం పూర్తయింది.. అసౌకర్యం కలిగితే క్షమించండి: మహా కుంభమేళాపై ప్రధాని మోదీ వ్యాసం..

ఒక మహాయజ్ఞం ముగిసింది. 144 ఏళ్లకు ఒకసారి మాత్రమే జరిగే మహాద్భుతాన్ని ఈ తరం చూడగలిగింది. పుణ్యస్నానాలు చేసి తరించింది. ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళాతో.. త్రివేణి సంగమం పులకించింది. ఇసుకేస్తే రాలనంత జనం.. ఇసుమంతైనా చోటులేని త్రివేణి సంగమంతో నెలన్నరపాటు.. కన్నుల పండువగా సాగింది. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా.. ఫిబ్రవరి 26 శివరాత్రి పర్వదినంతో ముగిసింది.

Maha Kumbh Mela: మహా కుంభమేళాలో పుణ్య స్నానం ఆచరించిన టాలీవుడ్ హీరోయిన్.. ఫొటోస్ వైరల్

ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌ వేదికగా జరిగిన మహాకుంభమేళా బుధవారం (ఫిబ్రవరి 26)తో ముగిసింది. సుమారు 45 రోజుల పాటు జరిగిన ఈ ఆధ్యాత్మిక వేడుకలో కోట్లాది మంది భక్తులు స్నానమాచరించారు. ఇందులో సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు