AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahabubnagar: ఇప్పటివరకు లోక్‌సభలో అడుగుపెట్టని మహిళలు.. ఈసారైనా పాలమూరు ఓటర్లు చరిత్ర తిరగరాసేనా..!

ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఇప్పటి వరకు మహిళలు పార్లమెంట్ మెట్లు ఎక్కలేదు. సుధీర్ఘ కాలంగా మహిళా నేతలు బరిలో ఉంటున్న రెండు స్థానాల్లో ఒక్కసారి కూడా ఆమెను లోక్‌సభకు పంపలేదు పాలమూరు ప్రజలు. మహిళలే ఎక్కువగా ఓటర్లు ఉన్నప్పటికీ మహిళా నాయకురాలిని గెలిపించుకోలేకపోతున్నారు.

Mahabubnagar: ఇప్పటివరకు లోక్‌సభలో అడుగుపెట్టని మహిళలు.. ఈసారైనా పాలమూరు ఓటర్లు చరిత్ర తిరగరాసేనా..!
Dk Aruna
Boorugu Shiva Kumar
| Edited By: |

Updated on: May 04, 2024 | 9:12 AM

Share

ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఇప్పటి వరకు మహిళలు పార్లమెంట్ మెట్లు ఎక్కలేదు. సుధీర్ఘ కాలంగా మహిళా నేతలు బరిలో ఉంటున్న రెండు స్థానాల్లో ఒక్కసారి కూడా ఆమెను లోక్‌సభకు పంపలేదు పాలమూరు ప్రజలు. మహిళలే ఎక్కువగా ఓటర్లు ఉన్నప్పటికీ మహిళా నాయకురాలిని గెలిపించుకోలేకపోతున్నారు. తాజా ఎంపీ ఎన్నికల్లో అయిన ఎదో ఒక స్థానం నుంచి మహిళా ఎంపీగా ఎన్నుకునే కల నెరవేరుస్తారా అన్నదీ ఆసక్తిగా మారింది..!

మొదటి నుంచి పాలమూరు పాలిటిక్స్ కాస్తా డిఫరెంట్. దశాబ్దాలుగా జరుగుతున్న ఎన్నికల్లో అనేక రకాల ఈక్వేషన్స్ తో అభ్యర్థులు ఎన్నికల్లో విజయం సాధిస్తూ వస్తున్నారు. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు కోరుకున్న ఓటర్లు తాజా పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి తీర్పు ఇస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుధీర్ఘ కాలంగా ఎంతో మంది మహిళ నేతలు బరిలో ఉన్న ప్రతిసారీ ఓటమే వరించింది. ఈ సారైన పాలమూరు ఓటర్లు ఆ చరిత్ర తిరగరాస్తారా అనేది ఓ పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది.

మహబూబ్ నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన ఏకైక మహిళా డీకే అరుణ. 1996లో తొలిసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో దిగి ఓటమి పాలయ్యారు. తిరిగి 2019 ఎంపీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి రెండోస్థానంలో నిలిచారు. ఇక ఇప్పుడు మూడోసారి ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ దఫా కూడా బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచి గట్టి పోటీ ఇస్తున్నారు. ఎలాగైనా సరే ఈసారి పార్లమెంట్ లో అడుగుపెట్టాలని సర్వశక్తులు ఒడ్డుతున్నారు డీకే అరుణ.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి పలువురు మహిళలు పోటీ చేసినప్పటికీ ఎవరికి విజయం వరించలేదు. 1996 నుంచి టీడీపీ అభ్యర్థిగా ఇందిరా పోటీ చేసి ఓటమి చెందారు. 2004లో బీఎస్పీ తరుపున రాణి రత్నమాల పోటీ చేసి గెలవలేదు. ఇక 2019 ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బంగారు శృతి పోటీ చేసి మూడో స్థానానికే పరిమితమయ్యారు. ఈ దఫా పోటీ చేయాలని టికెట్ ఆశించినప్పటకీ కమలం అధిష్టానం ఇతరులకు టికెట్ కేటాయించారు. మరోవైపు నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా శిరీష(బర్రెలక్క), మరో ఇద్దరు మహిళలు బరిలో నిలిచారు.

గత సంప్రదాయాలకు భిన్నంగా పార్లమెంట్ ఎన్నికల్లో పాలమూరు ప్రజలు మార్పు కోరుకుంటారా అనేది ఆసక్తిగా మారింది. సుధీర్ఘ కాలంగా పోటీకే పరిమితమవుతున్న మహిళలు ఈసారైనా ఉమ్మడి జిల్లా నుంచి పార్లమెంట్ లో అడుగుపెడతారా లేదో చూడాలి..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…