Warangal: ‘అబ్బే..పెంచుకోవడానికి ఇచ్చానంతే’ డబ్బులకు ఆశపడి నాలుగేళ్ల పసివాడిని అమ్మిన కన్న తండ్రి!

డబ్బులకు ఆశపడి ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. అభంశుభం తెలియని నాలుగేళ్ల కొడుకును బేరానికి పెట్టాడు. కుటుంబ సభ్యులకు తెలియకుండా గట్టుచప్పుడుకాకుండా అమ్మేశాడు. అనక విషయం బయటికి పొక్కడంతో..

Warangal: 'అబ్బే..పెంచుకోవడానికి ఇచ్చానంతే' డబ్బులకు ఆశపడి నాలుగేళ్ల పసివాడిని అమ్మిన కన్న తండ్రి!
Father Sold His Son
Follow us

|

Updated on: May 30, 2023 | 12:58 PM

డబ్బులకు ఆశపడి ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. అభంశుభం తెలియని నాలుగేళ్ల కొడుకును బేరానికి పెట్టాడు. కుటుంబ సభ్యులకు తెలియకుండా గట్టుచప్పుడుకాకుండా అమ్మేశాడు. అనక విషయం బయటికి పొక్కడంతో ‘అబ్బే.. అమ్మలేదు! పెంచుకోవడానికి ఇచ్చానంతే’ అంటూ బుకాయించాడు. వరంగల్‌లో చోటుచేసుకున్న ఈ వ్యవహారం స్థానికంగా కలకలం రేపింది. రంగంలో దిగారు.

కరీమాబాద్‌కు చెందిన మసూద్‌కు నాలుగేళ్ల కుమారుడు అయాన్‌ను డబ్బుకు ఆశపడి అమ్మేశాడు. ఈ విషయం తెలుసుకున్న అతని బావమరిది అక్బర్‌ మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీనిలో భాగంగా బాలుడి తండ్రి మసూద్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. తన కొడుకును అమ్మలేదని, పోచమ్మమైదాన్‌లో ఉన్న తమ బంధువులకు పెంచుకోవడానికి ఇచ్చానని నిందితుడు మసూద్‌ పోలీసులకు తెలిపాడు. వాస్తవాలు తెలుసుకునేందుకు ఈ కేసును మిల్స్‌ కాలనీ పోలీస్‌స్టేషన్‌ నుంచి మట్టెవాడ స్టేషన్‌కు బదిలీ చేసినట్లు పోలీసులు తెలిపారు.

మరోవైపు కుటుంబసభ్యులకు తెలియకుండా ఇతరులకు పెంపకం కోసం కన్నతండ్రి ఎలా ఇస్తాడనే అనుమానాలు తలెత్తుతున్నాయి. పిల్లలను అక్రమంగా రవాణా చేసే ముఠా సభ్యులకు డబ్బుల కోసం అమ్మాడా లేదా సంతానం లేనివాళ్లు పెంపకం కోసం తీసుకున్నారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపితేగానీ నిజానిజాలు తెలియవని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.