AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Warangal: ప్రీతి ఘటన మరువకముందే వరంగల్ జిల్లాలో మరో ఘోరం.. పాపం రక్షిత కూడా..

మెడికో స్టూడెంట్‌ ప్రీతి ఘటన మరువకముందే.. ర్యాగింగ్‌ భూతానికి మరో విద్యార్థిని బలికావడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. తోటి విద్యార్థి వేధింపులు తాళలేక అదే వరంగల్ జిల్లాలో..

Warangal: ప్రీతి ఘటన మరువకముందే వరంగల్ జిల్లాలో మరో ఘోరం.. పాపం రక్షిత కూడా..
Rakshita
Shaik Madar Saheb
|

Updated on: Feb 27, 2023 | 9:41 AM

Share

మెడికో స్టూడెంట్‌ ప్రీతి ఘటన మరువకముందే.. ర్యాగింగ్‌ భూతానికి మరో విద్యార్థిని బలికావడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. తోటి విద్యార్థి వేధింపులు తాళలేక అదే వరంగల్ జిల్లాలో రక్షిత అనే 20ఏళ్ల ఇంజినీరింగ్ స్టూడెంట్‌ సూటైడ్ చేసుకోవడం కలకలం రేపింది. ఓ యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తుండటంతో రక్షిత సూసైడ్ చేసుకున్నట్లు పేర్కొంటున్నారు. భూపాలపల్లికి చెందిన శంకరాచారి, రమ దంపతుల కూతులు రక్షిత నర్సంపేట లోని జయముఖి ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీ మూడవ సంవత్సరం చదువుతోంది. అయితే, రక్షితకు చెందిన ఫొటోలను రాహుల్ అనే వ్యక్తి, ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని వేధించడంతో మనస్తాపం చెందిన యువతి.. వరంగల్ నగరంలోని తన బంధువుల ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

అయితే, అంతకుముందే రాహుల్ వేధింపులు ఎక్కువవ్వడంతో హాస్టల్‌లో ఉండలేనంటూ రక్షిత తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు బంధువుల ఇంట్లో ఉంచి చదివిస్తున్నారు. ఆదివారం బంధువుల ఇంట్లోనే ఉన్న రక్షిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా, సమాచారం అందుకున్న పోలీసులు రక్షిత మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎంజీఎంకి తరలించారు.

ప్రీతి లాగే తమ కూతురు కూడా సీనియర్ల వేధింపులకు బలయిందని తల్లిదండ్రులు రోదిస్తున్నారు. వరంగల్‌ కాకతీయ మెడికల్ కాలేజీకి చెందిన పీజీ విద్యార్థి ప్రీతి సీనియర్ వేధింపులు తాళలేక లేక ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి నిమ్స్ లో కన్నుమూసింది. ఈ రెండు ఘటనలు వరంగల్ జిల్లాలోనే జరగడం కలకలం రేపుతోంది.

ఇవి కూడా చదవండి

అయితే, బెదిరింపుకు పాల్పడిన రాహుల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని రక్షిత బంధువులు, విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం.. క్లిక్ చేయండి..