BJP: అవన్నీ అవాస్తవాలే.! పవన్పై అనుచిత వ్యాఖ్యలంటూ ప్రచారం.. కిషన్ రెడ్డి క్లారిటీ..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేసిన విషయం మనకు తెలిసిందే. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజక వర్గాలకు గానూ 8 చోట్ల జనసేన పోటీ చేసింది. మిగిలిన స్థానాల్లో బీజేపీ పోటీ చేసి తమ ఉనికిని కాపాడుకోగలిగింది. గతంలో కంటే మెరుగైన ఎమ్మెల్యే సీట్లను తన ఖాతాలో వేసుకుంది. అయితే జనసేన గురించి తాను తప్పుగా మాట్లాడినట్లు కొన్ని అవాస్తవాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయంటూ బీజేపీ ఒక లేఖను విడుదల చేసింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేసిన విషయం మనకు తెలిసిందే. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజక వర్గాలకు గానూ 8 చోట్ల జనసేన పోటీ చేసింది. మిగిలిన స్థానాల్లో బీజేపీ పోటీ చేసి తమ ఉనికిని కాపాడుకోగలిగింది. గతంలో కంటే మెరుగైన ఎమ్మెల్యే సీట్లను తన ఖాతాలో వేసుకుంది. అయితే జనసేన గురించి తాను తప్పుగా మాట్లాడినట్లు కొన్ని అవాస్తవాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయంటూ బీజేపీ ఒక లేఖను విడుదల చేసింది. ఇలాంటి తప్పుడు విషయాలను ప్రచారం చేస్తున్న వాళ్లపై కేసులు పెడతామని హెచ్చరించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇంతకూ ఆ లేఖలో ఏమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అత్యవసర సందేశాన్ని విడుదల చేశారు. ‘ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల ప్రచారం సందర్భంలో జనసేనతో కలిసి బీజేపీ పోటీ చేసిన సంగతి మీకు తెలిసిందే’.
‘ఈ నిర్ణయం రెండు పార్టీలు ఆలోచించి తీసుకున్నదే. ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉన్నందునే మేము.. జనసేనతో కలిసి బరిలో దిగాం. అయితే, ఆదివారం సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో కొందరు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్పై నేను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా దుష్ప్రచారం చేస్తున్నారు’.
‘ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి అసత్యాలను ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నవారిపై సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయనున్నాం’. అని లేఖలో పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..