AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suryapet: మట్టి పనులు చేస్తుండగా దొరికిన లంకెబిందెలు.. వాటిల్లో నాణేలు.. అసలు మిస్టరీ తర్వాతనే

బంగారం ధరలు చుక్కలనంటుతోంది. ఇలా బంగారం ధరలు మండిపోతున్న వేళ.. ఈజీమనీ కోసం కొందరు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. కొందరు టెక్నాలజీ సహాయంతో స్మార్ట్ గా బురిడీ కొట్టిస్తుంటే.. మరి కొందరు జనం మూఢ నమ్మకాలు, అత్యాశ, సెంటిమెంట్ ను ఆసరగా చేసుకొని కోట్లు కొల్లగొడుతున్నారు. తాజాగా లంకెబిందెల పేరుతో కేటుగాళ్లు.. ఓ వ్యాపారిని 20 లక్షలకు బురిడీ కొట్టించారు. ఇది ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Suryapet: మట్టి పనులు చేస్తుండగా దొరికిన లంకెబిందెలు.. వాటిల్లో నాణేలు.. అసలు మిస్టరీ తర్వాతనే
Treasure Pot Scam
M Revan Reddy
| Edited By: |

Updated on: Aug 25, 2025 | 9:19 PM

Share

సూర్యాపేట జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని దూరాజ్ పల్లి తెల్లబండ కాలనీకి చెందిన పసుపుల గణేష్, ఓర్సు చంటిలు కూలీలుగా పనిచేస్తున్నారు. సూర్యాపేటకు చెందిన వ్యాపారి నిమ్మనగోటి వెంకటేశ్వర్లు హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిని ఆనుకొని హోటల్ నిర్మాణాన్ని చేపట్టాడు. ఈ హోటల్ నిర్మాణం మట్టి పనులను గణేష్, చంటీలిద్దరూలు చేశారు. వ్యాపారి వెంకటేశ్వర్లు వద్ద చాలా డబ్బు ఉందని గ్రహించిన ఈ కేటుగాళ్లు.. ఆ డబ్బులు కొట్టేసేందుకు ప్లాన్ వేసి.. ఫ్రెండ్స్‌తో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. ఇతర ప్రాంతాల్లో తాము మట్టి పని చేస్తున్న క్రమంలో లంకె బిందెలు దొరికాయని వాటిలో కేజీల కొద్దీ పురాతన బంగారు నాణాలు ఉన్నాయని చెప్పారు. లంకె బిందెలకు సంబంధించి ఫేక్ వీడియోలు చూపించి వ్యాపారి వెంకటేశ్వర్లను కేటుగాళ్లు నమ్మించారు.

లంకె బిందెలు దొరికితే అదృష్టం వరిస్తుందని.. ధనవంతులవుతారని ఒక నమ్మకం. ఈ నమ్మకంతో లంకె బిందెల బంగారు నాణాలను కొనుగోలు చేయాలని వెంకటేశ్వర్లు భావించాడు. ఈ లంకె బిందెల్లోని బంగారు నాణాలను అతితక్కువ ధరకు అమ్ముతామని చెప్పి విడతల వారీగా 20 లక్షల రూపాయలను కంత్రిగాళ్లు వసూలు చేశారు. లంకె బిందెలు తీసుకురావడంలో కొంత ఇబ్బందులు ఉన్నాయని చెబుతూ కాలయాపన చేస్తూ కట్టు కథలు చెప్పారు. డబ్బులు తీసుకెళ్ళి బంగారం ఇవ్వకపోవడంతో వ్యాపారి వెంకటేశ్వర్లు వారిపై సీరియస్ అయ్యాడు. ఒంటికి కోడి రక్తం పూసుకుని గుర్తు తెలియని వ్యక్తులు తమను కొట్టి డబ్బులెత్తుకెళ్లారని ఈ కేటుగాళ్లు.. వ్యాపారి వెంకటేశ్వర్లుకు చెప్పారు. దీంతో మోసపోయానని గ్రహించిన వెంకటేశ్వర్లు చివ్వేంల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు చాకచక్యంగా గ్యాంగ్ లోని నలుగురు ప్రధాన నిందితులను అరెస్ట్ చేసి 13.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. ఇలాంటి మోసగాళ్ల పట్ల జగ్రత్తగా ఉండాలని, అత్యాశకు పోయి డబ్బులు కోల్పోవొద్దని సూర్యాపేట డిఎస్పి ప్రసన్నకుమార్ ప్రజలకు సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు
మైక్రోవేవ్ ప్రాణాంతకమా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!
మైక్రోవేవ్ ప్రాణాంతకమా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!
చలితో బరువుతగ్గొచ్చట.. బ్రౌన్ ఫ్యాట్ సీక్రెట్ చెప్పిన సైంటిస్టులు
చలితో బరువుతగ్గొచ్చట.. బ్రౌన్ ఫ్యాట్ సీక్రెట్ చెప్పిన సైంటిస్టులు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన, బంగారం, వెండి ధరలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన, బంగారం, వెండి ధరలు