AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revanth Reddy: తెలంగాణ టెట్‌ పరీక్షను వెంటనే వాయిదా వేయాలి.. రేవంత్‌ రెడ్డి డిమాండ్‌..

Revanth Reddy: తెలంగాణలో ఈనెల 12న నిర్వహించనున్న టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (TS TET 2022) పరీక్షను వెంటనే వాయిదా వేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. అదే రోజు రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (ఆర్‌ఆర్‌బీ) పరీక్ష కూడా...

Revanth Reddy: తెలంగాణ టెట్‌ పరీక్షను వెంటనే వాయిదా వేయాలి.. రేవంత్‌ రెడ్డి డిమాండ్‌..
Revanth Reddy
Narender Vaitla
|

Updated on: Jun 10, 2022 | 12:10 PM

Share

Revanth Reddy: తెలంగాణలో ఈనెల 12న నిర్వహించనున్న టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (TS TET 2022) పరీక్షను వెంటనే వాయిదా వేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. అదే రోజు రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (ఆర్‌ఆర్‌బీ) పరీక్ష కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఒకేరోజు రెండు పోటీ పరీక్షలు ఉంటే అభ్యర్థులు ఒక పరీక్షను కోల్పోవాల్సి వస్తుందని రేవంత్‌ రెడ్డి ట్వీట్ చేశారు. ‘ఆర్‌ఆరీఆర్‌బీ జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్ష, టెట్‌ రాష్ట్ర స్థాయిలో నిర్వహించే పరీక్ష. కాబట్టి టెట్‌ పరీక్షను మరో రోజు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. వెంటనే తెలంగాణలో టెట్ పరీక్షను వాయిదా వేయాలి’ అంటూ రేవంత్‌ రెడ్డి ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే టెట్‌ పరీక్షను వాయిదా వేయాలనే వాదన రావడం ఇదే తొలిసారి కాదు. కొన్ని రోజుల క్రితం కొంతమంది అభ్యర్థులు టెట్‌ పరీక్షను వాయిదా వేయాలని కేటీఆర్‌కు ట్విట్వర్‌ వేదికగా విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. సదరు ట్వీట్స్‌ను విద్యాశాఖమ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి రీట్వీట్ చేసిన కేటీఆర్‌. పరీక్షల వాయిదా విషయంపై ఆలోచించండి అంటూ ట్వీట్‌ చేశారు. అయితే దీనిపై సబితా అప్పట్లోనే ఫుల్‌ క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో టెట్‌ను వాయిదా వేయమని. పరీక్షకు సంబంధించిన అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. తాజాగా రేవంత్‌ రెడ్డి ట్వీట్‌తో ఈ అంశం మరో సారి తెరపైకి వచ్చింది.

ఇక జూన్‌ 12న జరగాల్సిన టెట్‌ పరీక్ష కోసం సర్వం సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే హాల్‌ టికెట్‌లు విడుదల కూడా చేశారు. టెట్‌ పరీక్ష అనంతరం పరీక్షా ఫలితాలను ఈ నెల 27న విడుదల చేయనున్నారు. ఆర్‌ఆర్‌బీ పరీక్షలు సైతం జూన్‌ 12న మొదలై 17 వరకు కొనసాగనున్నాయి. ఈ పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా షాలి‌మా‌ర్‌-సి‌కింద్రా‌బాద్‌, బిలా‌స్‌‌పూ‌ర్‌-సి‌కింద్రా‌బాద్‌, భువ‌నే‌శ్వర్‌-‌తం‌బా‌రామ్‌, గుంటూ‌రు-భ‌ద్రక్‌ స్టేషన్ల మార్గా‌లలో ఈ నెల 10, 11, 13 తేదీ‌లలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోన్న విషయం తెలిసిందే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ