AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: దీనిపై చర్చించే దమ్ము ఎవరికైనా ఉందా?.. కేంద్రానికి సీఎం కేసీఆర్‌ సవాల్‌

తెలంగాణ మాత్రమే బాగుపడితే సరిపోదు ... దేశం కూడా బాగుపడాలి. ఆ మార్పు తెలంగాణతోనే సాధ్యం..! దేశం మారాలి.. మారుస్తాం అంటూ జగిత్యాల గడ్డమీది నుంచి సమరశంఖం..

CM KCR: దీనిపై చర్చించే దమ్ము ఎవరికైనా ఉందా?.. కేంద్రానికి సీఎం కేసీఆర్‌ సవాల్‌
Cm Kcr
Subhash Goud
|

Updated on: Dec 07, 2022 | 7:03 PM

Share

తెలంగాణ మాత్రమే బాగుపడితే సరిపోదు .. దేశం కూడా బాగుపడాలి. ఆ మార్పు తెలంగాణతోనే సాధ్యం.. దేశం మారాలి.. మారుస్తాం అంటూ జగిత్యాల గడ్డమీది నుంచి సమరశంఖం పూరించారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. కేంద్ర ప్రభుత్వ విధానాలను తనదైన శైలిలో ఎండగట్టారు. మేకిన్ ఇండియా నుంచి మొదలుపెడితే ఎన్‌పీఏల రద్దు, ఎల్‌ఐసీ అమ్మకం, పరిశ్రమల మూత పడ్డాయని తీవ్ర విమర్శలు చేశారు కేసీఆర్‌. చర్చకు సిద్ధమంటూ కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే.. దేశం మరో 100 సంవత్సరాలు వెనక్కిపోతుందని హెచ్చరించారు.

దేశంలో గోల్‌మాల్‌ గోవిందంగాళ్లు ఎక్కువైపోయారని, భారత రాజకీయాలను తెలంగాణ ప్రభావితం చేయాలి..మోదీ వచ్చాక ఒక్కటైనా మంచి పని జరిగిందా? అంటూ ప్రశ్నించారు. దీపావళి టపాసులు, జాతీయ జెండా కూడా చైనా నుంచేనా? ఇదేనా మోదీ చెప్పే మేకిన్ ఇండియా? అంటూ ఆరోపణలు గుప్పించారు. ఎల్‌ఐసీని కూడా అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని, సబ్‌కా సాథ్‌.. సబ్‌కా వికాస్‌.. సబ్ బక్వాస్ అంటూ కేసీఆర్ ఎద్దేవా చేశారు. అంగన్‌వాడీ నిధులు కాజేయడమే బేటీ పడావోనా? దీనిపై చర్చించే దమ్ము ఎవరికైనా ఉందా? అంటూ సవాల్‌ విసిరారు కేసీఆర్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి