AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇదేం పాడు బుద్ధి.. ఏటీఎం నుంచి రూ.77 లక్షల నగదు కాజేసిన సిబ్బంది!

డబ్బు కోసం ఆ అధికారుల బుద్ధి గడ్డితినింది. ఏటీఎం మెషీన్లలో డబ్బులు పెట్టేందుకు వెళ్లి భారీగా నగదును దోచేశారు. దాదాపు రూ.77 లక్షల వరకు డబ్బు పక్కదారి పట్టించారు. అనుమానం వచ్చిన కంపెనీ ఇంటర్నల్‌ ఆడిటర్‌ ఆరా తీయగా అసలు బండారం బయటపడింది. ఈ షాకింగ్‌ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Telangana: ఇదేం పాడు బుద్ధి.. ఏటీఎం నుంచి రూ.77 లక్షల నగదు కాజేసిన సిబ్బంది!
cash stolen from ATM
Srilakshmi C
|

Updated on: May 13, 2024 | 7:37 AM

Share

పాల్వంచ, మే 13: డబ్బు కోసం ఆ అధికారుల బుద్ధి గడ్డితినింది. ఏటీఎం మెషీన్లలో డబ్బులు పెట్టేందుకు వెళ్లి భారీగా నగదును దోచేశారు. దాదాపు రూ.77 లక్షల వరకు డబ్బు పక్కదారి పట్టించారు. అనుమానం వచ్చిన కంపెనీ ఇంటర్నల్‌ ఆడిటర్‌ ఆరా తీయగా అసలు బండారం బయటపడింది. ఈ షాకింగ్‌ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

వరంగల్‌ జిల్లా హనుమకొండలోని సీఎంఎస్‌ ఇన్ఫో సిస్టమ్స్‌ లిమిటెడ్‌ కంపెనీ బ్యాంకుల నుంచి నగదు తీసుకొని ఏటీఎం మెషీన్లలో అమర్చుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రామవరం-2 ఎంక్లైన్‌కు చెందిన ములుగురి రాజశేఖర్‌, కొత్తగూడెం గాజులరాజంతోపాటు బస్తీకి చెందిన కందుకూరి సందీప్‌ అనే ముగ్గురు వ్యక్తులు ఆ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. వీరు ఆ ఏజెన్సీ నుంచి నగదు తీసుకుని కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాల్లోని పలు చోట్ల ఉన్న ఏటీఎం సెంటర్లలో డబ్బులు పెడుతుంటారు.

ఈక్రమంలో వీరు తాజాగా కొత్తగూడెం, పాల్వంచ ఏటీఎంలలో నగదు పెట్టేందుకు వెళ్లారు. అయితే ఆయా ఏటీఎంలలో మొత్తం రూ.76,77,400 మేర లెక్కల్లో తేడా కనిపించింది. దీనిని ఆ కంపెనీ ఇంటర్నల్‌ ఆడిటర్‌ రాజు మే 8వ తేదీన గుర్తించారు. ఈ విషయమై రాజు విచారించగా.. రాజశేఖర్‌, సందీప్‌ అనే ఇద్దరు వ్యక్తులు కంపెనీని మోసం చేసి ఆ మొత్తాన్ని కాజేసినట్లు గ్రహించాడు. వెంటనే కంపెనీ మేనేజర్‌ జితేందర్‌కు విషయం తెలియజేయగా.. ఆయన పాల్వంచ పట్టణ పోలీసులకు శనివారం రాత్రి ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై బాణాల రాము మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..
మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..
రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు
రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు
రెడ్ vs గ్రీన్ క్యాప్సికమ్: ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది
రెడ్ vs గ్రీన్ క్యాప్సికమ్: ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది
పచ్చి కూరగాయల స్వీట్ హల్వా .. ఒక్కసారి తింటే మర్చిపోలేని రుచి
పచ్చి కూరగాయల స్వీట్ హల్వా .. ఒక్కసారి తింటే మర్చిపోలేని రుచి
రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం నుంచి సూపర్ న్యూస్
రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం నుంచి సూపర్ న్యూస్