AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇదేం పాడు బుద్ధి.. ఏటీఎం నుంచి రూ.77 లక్షల నగదు కాజేసిన సిబ్బంది!

డబ్బు కోసం ఆ అధికారుల బుద్ధి గడ్డితినింది. ఏటీఎం మెషీన్లలో డబ్బులు పెట్టేందుకు వెళ్లి భారీగా నగదును దోచేశారు. దాదాపు రూ.77 లక్షల వరకు డబ్బు పక్కదారి పట్టించారు. అనుమానం వచ్చిన కంపెనీ ఇంటర్నల్‌ ఆడిటర్‌ ఆరా తీయగా అసలు బండారం బయటపడింది. ఈ షాకింగ్‌ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Telangana: ఇదేం పాడు బుద్ధి.. ఏటీఎం నుంచి రూ.77 లక్షల నగదు కాజేసిన సిబ్బంది!
cash stolen from ATM
Srilakshmi C
|

Updated on: May 13, 2024 | 7:37 AM

Share

పాల్వంచ, మే 13: డబ్బు కోసం ఆ అధికారుల బుద్ధి గడ్డితినింది. ఏటీఎం మెషీన్లలో డబ్బులు పెట్టేందుకు వెళ్లి భారీగా నగదును దోచేశారు. దాదాపు రూ.77 లక్షల వరకు డబ్బు పక్కదారి పట్టించారు. అనుమానం వచ్చిన కంపెనీ ఇంటర్నల్‌ ఆడిటర్‌ ఆరా తీయగా అసలు బండారం బయటపడింది. ఈ షాకింగ్‌ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

వరంగల్‌ జిల్లా హనుమకొండలోని సీఎంఎస్‌ ఇన్ఫో సిస్టమ్స్‌ లిమిటెడ్‌ కంపెనీ బ్యాంకుల నుంచి నగదు తీసుకొని ఏటీఎం మెషీన్లలో అమర్చుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రామవరం-2 ఎంక్లైన్‌కు చెందిన ములుగురి రాజశేఖర్‌, కొత్తగూడెం గాజులరాజంతోపాటు బస్తీకి చెందిన కందుకూరి సందీప్‌ అనే ముగ్గురు వ్యక్తులు ఆ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. వీరు ఆ ఏజెన్సీ నుంచి నగదు తీసుకుని కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాల్లోని పలు చోట్ల ఉన్న ఏటీఎం సెంటర్లలో డబ్బులు పెడుతుంటారు.

ఈక్రమంలో వీరు తాజాగా కొత్తగూడెం, పాల్వంచ ఏటీఎంలలో నగదు పెట్టేందుకు వెళ్లారు. అయితే ఆయా ఏటీఎంలలో మొత్తం రూ.76,77,400 మేర లెక్కల్లో తేడా కనిపించింది. దీనిని ఆ కంపెనీ ఇంటర్నల్‌ ఆడిటర్‌ రాజు మే 8వ తేదీన గుర్తించారు. ఈ విషయమై రాజు విచారించగా.. రాజశేఖర్‌, సందీప్‌ అనే ఇద్దరు వ్యక్తులు కంపెనీని మోసం చేసి ఆ మొత్తాన్ని కాజేసినట్లు గ్రహించాడు. వెంటనే కంపెనీ మేనేజర్‌ జితేందర్‌కు విషయం తెలియజేయగా.. ఆయన పాల్వంచ పట్టణ పోలీసులకు శనివారం రాత్రి ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై బాణాల రాము మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..