Telangana: మెదక్‌లో ఘోరం..! బెట్టింగ్‌లో రూ.2 కోట్లు పోగొట్టాడనీ.. కన్న కొడుకును రాడ్డుతో కొట్టి చంపిన తండ్రి!

నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ సెల్‌ఫోన్‌​మోజులో పడి జీవితాన్ని గుల్ల చేసుకుంటున్నారు. పిల్లల నుంచి పెద్ద వారి వరకు మొబైల్‌ ఫోన్లను వాడుతున్నారు. సోషల్​మీడియా, ఆన్‌లైన్ గేమ్స్ అంటూ పగలూ రాత్రీ తేడా లేకుండా ఫోన్లకు బానిసలై పోతున్నారు. ఈ క్రమంలో కొందరు ఆన్‌లైన్ గేమ్స్‌ మాయలో పడి నిత్యం లక్షల డబ్బు పోగొట్టుకుంటున్నారు. ఒకప్పుడు ఎక్కడో గుట్టుగా కొందరి వ్యక్తుల మధ్య జరిగే బెట్టింగ్‌ వ్యవహారం..

Telangana: మెదక్‌లో ఘోరం..! బెట్టింగ్‌లో రూ.2 కోట్లు పోగొట్టాడనీ.. కన్న కొడుకును రాడ్డుతో కొట్టి చంపిన తండ్రి!
Father Killed Son Due To Online Betting Addiction
Follow us

|

Updated on: May 12, 2024 | 12:15 PM

మెదక్‌, మే 12: నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ సెల్‌ఫోన్‌​మోజులో పడి జీవితాన్ని గుల్ల చేసుకుంటున్నారు. పిల్లల నుంచి పెద్ద వారి వరకు మొబైల్‌ ఫోన్లను వాడుతున్నారు. సోషల్​మీడియా, ఆన్‌లైన్ గేమ్స్ అంటూ పగలూ రాత్రీ తేడా లేకుండా ఫోన్లకు బానిసలై పోతున్నారు. ఈ క్రమంలో కొందరు ఆన్‌లైన్ గేమ్స్‌ మాయలో పడి నిత్యం లక్షల డబ్బు పోగొట్టుకుంటున్నారు. ఒకప్పుడు ఎక్కడో గుట్టుగా కొందరి వ్యక్తుల మధ్య జరిగే బెట్టింగ్‌ వ్యవహారం.. ఇప్పుడు యూట్యూబ్‌ ఛానళ్లు, వెబ్‌సైట్లు, మొబైల్‌ యాప్‌ల రూపంలోనూ అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో వీటి మాయలో పడిన అమాయకుల జేబులను కేటుగాళ్లు కొల్లగొడుతున్నారు. నష్టపోయిన వారు గత్యంతరం లేక ఆత్మహత్యల బాట పడుతున్నారు. తాజాగా బెట్టింగ్‌ అలవాటు పడి కోట్ల రూపాయలు పొగొట్టిన కుమారుడిని ఆ తండ్రి క్షమించలేక పోయాడు. పట్టరాని ఆవేశంతో కన్న కొడుకని కూడా చూడకుండా రాడ్డుతోకొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన మెదక్‌ జిల్లాలో శనివారం రాత్రి (మే 11) చోటు చేసుకుంది.

మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం బగిరాత్‌పల్లికి చెందిన ముకేశ్‌ కుమార్‌ (28) ముకేశ్‌ చేగుంట మండలం మల్యాలలో రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతను ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, జల్సాలకు అలవాటు పడ్డాడు. గమనించిన తండ్రి సత్యనారాయణ అలవాటు మానుకోవాలని పలుమార్లు హెచ్చరించాడు. అయినా పద్ధతి మార్చుకోని ముకేశ్‌ ఇప్పటి వరకూ రూ.2 కోట్ల వరకు డబ్బులు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో పొగొట్టాడు. ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోని కొడుకుపై ఆ తండ్రికి పట్టరాని కోపం వచ్చింది. ఈ క్రమంలో శనివారం రాత్రి కుమారుడు ముకేశ్‌పై తండ్రి సత్యనారాయణ దాడి చేశాడు. కుమారుడి తలపై ఇనుప రాడ్డుతో బలంగా కొట్టడంతో తీవ్రగాయాల పాలైన ముకేశ్‌ కుమార్ మృతి చెందాడు.

మేడ్చల్‌లో ఉన్న ఇళ్లు, ప్లాటు బెట్టింగ్‌ కారణంగా అమ్మేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు కౌశిక్‌కు భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యవహారమే తండ్రీ కుమారుల మధ్య గొడవకు దారితీసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!