AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మెదక్‌లో ఘోరం..! బెట్టింగ్‌లో రూ.2 కోట్లు పోగొట్టాడనీ.. కన్న కొడుకును రాడ్డుతో కొట్టి చంపిన తండ్రి!

నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ సెల్‌ఫోన్‌​మోజులో పడి జీవితాన్ని గుల్ల చేసుకుంటున్నారు. పిల్లల నుంచి పెద్ద వారి వరకు మొబైల్‌ ఫోన్లను వాడుతున్నారు. సోషల్​మీడియా, ఆన్‌లైన్ గేమ్స్ అంటూ పగలూ రాత్రీ తేడా లేకుండా ఫోన్లకు బానిసలై పోతున్నారు. ఈ క్రమంలో కొందరు ఆన్‌లైన్ గేమ్స్‌ మాయలో పడి నిత్యం లక్షల డబ్బు పోగొట్టుకుంటున్నారు. ఒకప్పుడు ఎక్కడో గుట్టుగా కొందరి వ్యక్తుల మధ్య జరిగే బెట్టింగ్‌ వ్యవహారం..

Telangana: మెదక్‌లో ఘోరం..! బెట్టింగ్‌లో రూ.2 కోట్లు పోగొట్టాడనీ.. కన్న కొడుకును రాడ్డుతో కొట్టి చంపిన తండ్రి!
Father Killed Son Due To Online Betting Addiction
Srilakshmi C
|

Updated on: May 12, 2024 | 12:15 PM

Share

మెదక్‌, మే 12: నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ సెల్‌ఫోన్‌​మోజులో పడి జీవితాన్ని గుల్ల చేసుకుంటున్నారు. పిల్లల నుంచి పెద్ద వారి వరకు మొబైల్‌ ఫోన్లను వాడుతున్నారు. సోషల్​మీడియా, ఆన్‌లైన్ గేమ్స్ అంటూ పగలూ రాత్రీ తేడా లేకుండా ఫోన్లకు బానిసలై పోతున్నారు. ఈ క్రమంలో కొందరు ఆన్‌లైన్ గేమ్స్‌ మాయలో పడి నిత్యం లక్షల డబ్బు పోగొట్టుకుంటున్నారు. ఒకప్పుడు ఎక్కడో గుట్టుగా కొందరి వ్యక్తుల మధ్య జరిగే బెట్టింగ్‌ వ్యవహారం.. ఇప్పుడు యూట్యూబ్‌ ఛానళ్లు, వెబ్‌సైట్లు, మొబైల్‌ యాప్‌ల రూపంలోనూ అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో వీటి మాయలో పడిన అమాయకుల జేబులను కేటుగాళ్లు కొల్లగొడుతున్నారు. నష్టపోయిన వారు గత్యంతరం లేక ఆత్మహత్యల బాట పడుతున్నారు. తాజాగా బెట్టింగ్‌ అలవాటు పడి కోట్ల రూపాయలు పొగొట్టిన కుమారుడిని ఆ తండ్రి క్షమించలేక పోయాడు. పట్టరాని ఆవేశంతో కన్న కొడుకని కూడా చూడకుండా రాడ్డుతోకొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన మెదక్‌ జిల్లాలో శనివారం రాత్రి (మే 11) చోటు చేసుకుంది.

మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం బగిరాత్‌పల్లికి చెందిన ముకేశ్‌ కుమార్‌ (28) ముకేశ్‌ చేగుంట మండలం మల్యాలలో రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతను ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, జల్సాలకు అలవాటు పడ్డాడు. గమనించిన తండ్రి సత్యనారాయణ అలవాటు మానుకోవాలని పలుమార్లు హెచ్చరించాడు. అయినా పద్ధతి మార్చుకోని ముకేశ్‌ ఇప్పటి వరకూ రూ.2 కోట్ల వరకు డబ్బులు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో పొగొట్టాడు. ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోని కొడుకుపై ఆ తండ్రికి పట్టరాని కోపం వచ్చింది. ఈ క్రమంలో శనివారం రాత్రి కుమారుడు ముకేశ్‌పై తండ్రి సత్యనారాయణ దాడి చేశాడు. కుమారుడి తలపై ఇనుప రాడ్డుతో బలంగా కొట్టడంతో తీవ్రగాయాల పాలైన ముకేశ్‌ కుమార్ మృతి చెందాడు.

మేడ్చల్‌లో ఉన్న ఇళ్లు, ప్లాటు బెట్టింగ్‌ కారణంగా అమ్మేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు కౌశిక్‌కు భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యవహారమే తండ్రీ కుమారుల మధ్య గొడవకు దారితీసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్