AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మునుగోడులో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ.. టీఆర్‌ఎస్‌లోకి పల్లె రవికుమార్ గౌడ్‌ దంపతులు

తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న బూర నర్సయ్యగౌడ్‌ టీఆర్‌ఎస్‌కు షాకిచ్చి..

Telangana: మునుగోడులో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ.. టీఆర్‌ఎస్‌లోకి పల్లె రవికుమార్ గౌడ్‌ దంపతులు
Palle Ravikumar Goud
Subhash Goud
|

Updated on: Oct 15, 2022 | 3:23 PM

Share

తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న బూర నర్సయ్యగౌడ్‌ టీఆర్‌ఎస్‌కు షాకిచ్చి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోగా,  తాజాగా కాంగ్రెస్‌కు అక్కడ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మనుగోడు కాంగ్రెస్‌ నేత పల్లె రవికుమార్‌ గౌడ్‌ దంపతులు టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి కేటీఆర్‌తో భేటీ అయిన రవికుమార్‌ గౌడ్‌, ఆయన భార్య జ్యోతిలు టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకొన్నారు. ప్రస్తుతం జ్యోతి చండూరు ఎంపీపీగా కొనసాగుతున్నారు. పార్టీ కండువా కప్పి పల్లె రవి దంపతులను టిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌.  బూర నర్సయ్య గౌడ్, పల్లె రవికుమార్ గౌడ్ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం విశేషం. మునుగోడు ఉప ఎన్నికల్లో గౌడ సామాజిక వర్గం ఓట్లు కీలకంగా మారిన నేపథ్యంలో ఈ తాజా రాజకీయ సమీకరణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఉద్యమ కాలం నుంచి మాతో కలిసి పని చేసిన పల్లె రవికుమార్ మళ్లీ టీఆర్ఎస్ పార్టీ కుటుంబంలోకి రావడం సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రస్తుతం కీలకమైన మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా పార్టీ గెలుపు కోసం టీఆర్ఎస్ లో చేరేందుకు ముందుకు వచ్చిన పల్లె రవికుమార్‌కు కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. పాత మిత్రుడు పల్లె రవికుమార్ కి కచ్చితంగా భవిష్యత్తులో మరిన్ని మంచి రాజకీయ అవకాశాలను పార్టీ కల్పిస్తుందని అన్నారు.

ఈ సందర్భంగా పల్లె రవికుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. చండూరును రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలన్న ప్రధానమైన ప్రజల కోరికను కేటీఆర్‌కు తెలియజేశానని, ఇందుకు కేటీఆర్‌ సానుకూలంగా స్పందించారని అన్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం మా వంతు కృషిని చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు టీఆర్‌ఎస్‌ నేతలు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మార్రి రాజశేఖరరెడ్డి, కర్నె ప్రభాకర్, బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
పెళ్లైన మూడు నెలలకే విషాదం.. మాల్టాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ..
పెళ్లైన మూడు నెలలకే విషాదం.. మాల్టాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ..
రఘువరన్, రోహిణి విడాకులు తీసుకోవడానికి కారణం అదే..
రఘువరన్, రోహిణి విడాకులు తీసుకోవడానికి కారణం అదే..
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌: ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే ఆఫర్లు
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌: ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే ఆఫర్లు
బొమ్మలా ఉంటుంది.. దగ్గరికి వెళ్తే కమ్మేస్తుంది..
బొమ్మలా ఉంటుంది.. దగ్గరికి వెళ్తే కమ్మేస్తుంది..
గంజాయి సేవించి విమానం నడిపిన పైలట్..!
గంజాయి సేవించి విమానం నడిపిన పైలట్..!
ఇవి రోజుకు 3 తింటే చాలు.. కళ్లద్దాలు తీసిపడేస్తారు..
ఇవి రోజుకు 3 తింటే చాలు.. కళ్లద్దాలు తీసిపడేస్తారు..
మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు.. డీప్‌ఫేక్‌లపై ‘హ్యూమన్ రివ్యూ’..
మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు.. డీప్‌ఫేక్‌లపై ‘హ్యూమన్ రివ్యూ’..
రెండో రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?
రెండో రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?
రొమాన్స్‏లో యువరాజు.. ఒక్కో సినిమాతో సంచలనం.. ఇప్పుడు తోపు విలన్.
రొమాన్స్‏లో యువరాజు.. ఒక్కో సినిమాతో సంచలనం.. ఇప్పుడు తోపు విలన్.
మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగనార్
మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగనార్