AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌.. 20 మంది విద్యార్ధినులకు అశ్వస్థత

నిర్మల్‌ జిల్లా నర్సాపూర్‌ మండలంలోని కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌ తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనలో దాదాపు 20 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే పాఠశాల సిబ్బంది విద్యార్ధులను సమీపంలోని మండల ప్రభుత్వ దవాఖానకు చికిత్స నిమిత్తం తరలించారు. అశ్వస్థతకు గురైన విద్యార్ధుల్లో ఐదుగురిని నిర్మల్ జిల్లా కేంద్రంలోని హాస్పిటల్‌కు తరలించారు. సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంఘ్వాన్‌, మండల విద్యాధికారి హాస్పిటల్‌కు చేరుకుని..

Telangana: కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌.. 20 మంది విద్యార్ధినులకు అశ్వస్థత
Food Poision
Srilakshmi C
|

Updated on: Apr 04, 2024 | 4:19 PM

Share

నిర్మల్‌, ఏప్రిల్ 4: రాష్ట్రంలోని నిర్మల్‌ జిల్లాలో ఉన్న కస్తూర్భా గాంధీ బాలిక విద్యాలయలో ఫుడ్ పాయిజన్‌ అయ్యింది. దీంతో 20 మంది విద్యార్ధులు తీవ్రంగా అశ్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ సంఘటన బుధవారం (ఏప్రిల్ 3) చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

నిర్మల్‌ జిల్లా నర్సాపూర్‌ మండలంలోని కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌ తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనలో దాదాపు 20 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే పాఠశాల సిబ్బంది విద్యార్ధులను సమీపంలోని మండల ప్రభుత్వ దవాఖానకు చికిత్స నిమిత్తం తరలించారు. అశ్వస్థతకు గురైన విద్యార్ధుల్లో ఐదుగురిని నిర్మల్ జిల్లా కేంద్రంలోని హాస్పిటల్‌కు తరలించారు. సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంఘ్వాన్‌, మండల విద్యాధికారి హాస్పిటల్‌కు చేరుకుని విద్యార్థినులను పరామర్శించారు. వారి ఆరోగ్యం గురించి వైద్యులను ప్రశ్నించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

ప్రస్తుతం విద్యార్ధినులకు ప్రాణాపాయం లేదని, వారి ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. విద్యార్ధినుల అశ్వస్థతపై విచారణ చేపడతామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరో ఘటన: హైదరాబాద్‌లో భారీగా నకిలీ నోట్లు పట్టివేత

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌లో భారీగా నకిలీ నోట్లు పట్టుబడ్డాయి. సాధారణ తనిఖీల్లో భాగంగా పోలీసులు వాహనాలను చెక్‌ చేస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దాదాపు రూ.25 లక్షల నకిలీ నోట్లను మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ నకిలీ నోట్లను మహారాష్ట్ర నుంచి తెలంగాణకు తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు మీడియాకు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?