Ernakulam-Patna Express: టికెట్‌ అడిగినందుకు ఘోరం.. టీటీఈని కదులుతున్న రైల్లో నుంచి బయటికి తోసేశాడు!

కేరళలో దారుణ ఘటన చోటు చేసుకుంది. టికెట్‌ లేకుండా రైలులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ)ని కదులుతున్న రైలు నుంచి అమాంతం తోసేశాడు. దీంతో టీటీఈ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఎర్నాకుళం నుంచి పాట్నా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌లో ట్రైన్‌లో ఈ ఘటన బుధవారం (ఏప్రిల్ 3) చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..

Ernakulam-Patna Express: టికెట్‌ అడిగినందుకు ఘోరం.. టీటీఈని కదులుతున్న రైల్లో నుంచి బయటికి తోసేశాడు!
Ernakulam Patna Express
Follow us

|

Updated on: Apr 03, 2024 | 4:11 PM

వయనాడ్, ఏప్రిల్‌ 3: కేరళలో దారుణ ఘటన చోటు చేసుకుంది. టికెట్‌ లేకుండా రైలులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ)ని కదులుతున్న రైలు నుంచి అమాంతం తోసేశాడు. దీంతో టీటీఈ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఎర్నాకుళం నుంచి పాట్నా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌లో ట్రైన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన బుధవారం (ఏప్రిల్ 3) వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..

ఎర్నాకుళం నుంచి పాట్నా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌లో ట్రైన్‌లో ఒడిశాకు చెందిన రజనీకాంత్‌ అనే వ్యక్తి మద్యం మత్తులో స్లీపర్‌ కోచ్‌లో త్రిసూర్‌ స్టేఫన్‌లో ఎక్కాడు. టికెట్‌ లేకుండా అతను ప్రయాణిస్తున్నాడు. టీటీఈ వినోద్‌ తన విధుల్లో భాగంగా రైలులోని ఎస్‌ 11 బోగీలో ప్రయాణికుల వద్ద టికెట్లు తనిఖీ చేస్తున్నాడు. ఇందులో భాగంగా రజనీకాంత్‌ను కూడా టీటీఈ టెకెట్‌ చూపించమని అడిగారు. అతను టికెట్‌ చూపించకపోవడంతో ఇద్దరిమధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. టీటీఈ డోర్‌ వద్ నిలబడి డీబోర్డ్‌ చేయడం గురించి కంట్రోల్‌ సెంటర్‌కు సమాచారం ఇస్తున్నాడు. ఇంతలో తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రయాణికుడు రజనీకాంత్‌ టీటీఈని కేరళలోని ములన్‌కున్నతుకవు రైల్వే స్టేషన్‌కు సమీపంలో కదులుతున్న రైలులో నుంచి అమాంతం బయకు తోసేశాడు. దీంతో వినోద్‌ కుమార్‌ అవతలి పట్టాలపై పడిపోయాడు. సరిగ్గా అదే సమయంలో వచ్చిన మరో రైలు ఆయనను ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన మంగళవారం (ఏప్రిల్ 2) అర్ధరాత్రి చోటు చేసుకుంది.

సమాచారం అందుకున్న పోలీసులు పాలక్కాడ్‌ వద్ద నిందితుడు రజనీకాంత్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడిపై త్రిసూర్ రైల్వే పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. అతడు మద్యం మత్తులో ఉన్నాడని అధికారులు తెలిపారు. కేరళలోని ములన్‌కున్నతుకవు రైల్వే స్టేషన్‌కు సమీపంలో కదులుతున్న ఎర్నాకులం-పాట్నా ఎక్స్‌ప్రెస్‌ నుంచి ఆ వ్యక్తి టీటీఈని బయటకు నెట్టాడని పోలీసులు తెలిపారు. ఐపీసీ సెక్షన్‌ 302 కింద నిందితుడిని అరెస్ట్‌ చేసి, విచారణ చేపట్టినట్లు త్రిసూర్ రైల్వే పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ అధికారి తెలిపారు. మృతుడు వినోద్ స్వస్థలం ఎర్నాకులం జిల్లా మంజుమ్మెల్‌. అతనికి శారీరక గాయాల కారణంగా రెండేళ్ల క్రితం డీజిల్ లోకో యూనిట్ నుంచి బదిలీపై టీటీఈ విభాగంలో చేరాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!