Lok Sabha Election 2024: లోక్‌సభ ఎన్నికలలో ఏ అంశాలు ఆధిపత్యం చెలాయిస్తాయి.. దేశ ప్రజలు ఏం కోరుకుంటున్నారు..?

2024 లోక్‌సభ ఎన్నికల సంగ్రామం కొనసాగుతోంది. అన్ని పార్టీల ప్రచారం జోరుగా సాగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP) హ్యాట్రిక్ సాధించడానికి ప్రయత్నిస్తుండగా, కాంగ్రెస్ నేతృత్వంలోని I.N.D.I.A కూటమి దశాబ్దాల నాటి ఎన్‌డీఏ కోటను కూల్చివేసేందుకు ప్రయత్నిస్తోంది.

Lok Sabha Election 2024: లోక్‌సభ ఎన్నికలలో ఏ అంశాలు ఆధిపత్యం చెలాయిస్తాయి.. దేశ ప్రజలు ఏం కోరుకుంటున్నారు..?
Pm Narendra Modi, India
Follow us

|

Updated on: Apr 03, 2024 | 4:02 PM

2024 లోక్‌సభ ఎన్నికల సంగ్రామం కొనసాగుతోంది. అన్ని పార్టీల ప్రచారం జోరుగా సాగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP) హ్యాట్రిక్ సాధించడానికి ప్రయత్నిస్తుండగా, కాంగ్రెస్ నేతృత్వంలోని I.N.D.I.A కూటమి దశాబ్దాల నాటి ఎన్‌డీఏ కోటను కూల్చివేసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీని ఓడించేందుకు వ్యూహరచనలో బిజీగా ఉన్న కాంగ్రెస్ కూటమి సీట్ల పంపకంపై పలుచోట్ల చర్చలే జరగలేదు. ఇది మాత్రమే కాదు, భారత కూటమిలోని అంతర్గత పోరు చాలాసార్లు బహిరంగ వేదికపై ప్రస్తావనకు వచ్చింది. దీని కారణంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయ స్థిరత్వం పెద్ద సమస్య.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో లోక్‌సభలో 400కు పైగా మెజారిటీతో ఈసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2019లో, బీజేపీ హిందీ బెల్ట్‌లో మెజారిటీని గెలుచుకుంది. మొత్తం 543 సీట్లకు గానూ లోక్‌సభలో 303 సీట్లు సాధించింది. ఇక దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. ఏప్రిల్ 19న మొదటి దశలో 102 స్థానాలకు ఓటింగ్ ప్రారంభమవుతుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఇక కేంద్రంలో ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. సామాన్య ప్రజలకు ఎలాంటి సమస్యలు, అంచనాలు ఉన్నాయి? అనేదీ చర్చనీయాంశంగా మారింది.

లోక్‌సభ ఎన్నికల్లో ఏయే అంశాలపై పోరు జరుగుతోంది?

2024 లోక్‌సభ ఎన్నికలలో రాజకీయ పార్టీలు అనేక అంశాల గురించి మాట్లాడుతూ ఓటర్లను ఆకర్షించడంలో బిజీగా ఉన్నాయి. ఇందులో మోదీ హామీ, కాంగ్రెస్ న్యాయ హామీ, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆర్టికల్ 370, సీఏఏ, యూనిఫాం సివిల్ కోడ్, రామ మందిరం, ఎలక్టోరల్ బాండ్, అమృత్ కాల్ వర్సెస్ అన్యాయ కాల్, రైతుల సమస్యలు, ఎంఎస్‌పీ హామీ, సిద్ధాంతకర్తల పోరాటం, సీబీఐ, ఈడీ రైడ్, డెవలప్‌డ్ ఇండియా విజన్ వంటివి అంశాలు ప్రధానాస్త్రాలు ఉన్నాయి. మరోవైపు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉన్న భారతదేశపు పెద్ద ఆర్థిక వ్యవస్థ మరొక ప్రధాన సమస్య. దేశం ప్రపంచ శక్తిగా ఎదగడానికి దోహదపడుతోంది. అదే సమయంలో చైనాతో పోటీకి సిద్ధమైంది. అయితే కేంద్రం తీసుకుంటున్న కొన్ని చర్యల వల్ల దేశ వృద్ధి రేటు పెరుగుతున్నప్పటికీ యువతకు ఉద్యోగాలు కల్పించకపోవడం మోదీ ప్రభుత్వానికి పెద్ద సవాల్. కొత్త ప్రభుత్వం ఈ విషయంలో కొన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని ఇప్పుడు నిరుద్యోగులు భావిస్తున్నారు.

అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం చేసిన తప్పులను పునరావృతం కాకుండా మెరుగుపరిచేందుకు భారతీయ జనతా పార్టీ అనేక విధాలుగా ప్రయత్నించిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి 2004లో డీఎంకే, పాశ్వాన్‌లతో పొత్తు పెట్టుకోనందుకు వాజ్‌పేయి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈసారి వివిధ ఎన్డీయే భాగస్వామ్య పక్షాలన్నింటినీ తన వెంట తెచ్చుకునేందుకు మోదీ ప్రయత్నించారు. ఈసారి ఆంధ్రప్రదేశ్‌‌లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా బీజేపీతోనే ఉన్నారు.

కేంద్రంలో రాజకీయ సుస్థిరత చాలా ముఖ్యం

మహారాష్ట్రలో శివసేన విడిపోయిన తర్వాత షిండే వర్గంతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. అదే సమయంలో, కాంగ్రెస్ నేతృత్వంలోని భారత కూటమి ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, తమిళనాడు, బీహార్, మహారాష్ట్రలలో సీట్ల పంపకంపై దాదాపు ఒప్పందాలను కుదుర్చుకుంది. అయితే ఇది ఉన్నప్పటికీ, కూటమి అస్తవ్యస్తంగా కనిపిస్తోంది. దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలంటే కేంద్రంలో రాజకీయ సుస్థిరత చాలా ముఖ్యమని రేటింగ్ ఏజెన్సీలతో పాటు ఓటర్లు కూడా అభిప్రాయపడ్డారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తమ అతిపెద్ద బలాల్లో ఒకటిగా అభివర్ణించింది. రాజకీయ సుస్థిరత ఉంటే అభివృద్ధికి ఎలాంటి ఆటంకం ఉండదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!