US-Israel Iran War LIVE: భీకరంగా యుద్ధం.. భగభగమంటున్న బంగారం.. తగ్గేదేలే అంటున్న ట్రంప్..
US-Israel Iran War News LIVE Updates in Telugu: ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం మధ్యప్రాచ్యాన్ని అతలాకుతలం చేస్తోంది. కువైట్, ఖతర్, యూఏఈ, బహ్రెయిన్ వంటి గల్ఫ్ దేశాలపై దాడులు జరగడంతో అక్కడ ఉద్యోగాలు చేస్తున్న లక్షలాది మంది తెలుగువారు భయాందోళనల్లో గడుపుతున్నారు. ఆకాశంలో పేలుళ్ల దృశ్యాలను చూసి ఇక్కడ వారి కుటుంబసభ్యులు క్షణక్షణం భయంతో కాలం వెళ్లదీస్తున్నారు. ఈ సమయంలో మోదీ ఇజ్రాయెల్ ప్రధానితో మాట్లాడారు.

LIVE NEWS & UPDATES
-
క్రూడ్ ఆయిల్ కుతకుత.. బంగారం భగభగ
- ముడిచమురు సరఫరాకు బ్రేకులు పడొచ్చని భయాలు
- ఇప్పటికే 80 డాలర్లకు చేరువలో బ్యారెల్ ముడిచమురు ధర
- హర్ముజ్ జలసంధిని మూసేయడంతో అంతర్జాతీయంగా కలవరం
- 2025లో మూడొంతుల చమురు సరఫరా జరిగిన ప్రాంతం ఈ జలసంధి
- అంర్జాతీయంగా భారీగా పెరుగుతున్న గోల్డ్ ధరలు
- నెలరోజుల గరిష్ఠస్థాయికి చేరుకున్న బంగారం
- 5340 డాలర్లకుపైనే ట్రేడవుతున్న ఔన్స్ బంగారం
- ఇప్పటికే నష్టాల్లో మొదలైన ఆసియా మార్కెట్లు
-
ఇరాన్ ప్రతిదాడులు
- అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ ప్రతిదాడులు
- పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడి
- UAEలోని అమెజాన్ డేటా సెంటర్పై ఇరాన్ దాడులు
- ఇరాన్ మిసైల్ దాడిలో దెబ్బతిన్న UAE అమెజాన్ సెంటర్
-
-
ఇజ్రాయెల్పై మూడు వైపుల నుంచి దాడులు
- ఇజ్రాయెల్పై మూడు వైపుల నుంచి దాడులు
- ఇరాన్ మిసైళ్లు, హెజ్బొల్లా, హుతీల రాకెట్ దాడులు
- మూడు దాడులను ఏక కాలంలో ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్
- లెబనాన్ నుంచి ఇజ్రాయెల్పై దాడులు చేసిన హెజ్బొల్లా
- కౌంటర్ స్ట్రైక్స్ చేస్తున్న ఇజ్రాయెల్
- దక్షిణ బీరూట్లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు
- రాత్రి నుంచి వరుస దాడులు చేస్తున్న ఇజ్రాయెల్
-
అమెరికా, ఇజ్రాయెల్కు బ్రిటన్ సాయం
- అమెరికా, ఇజ్రాయెల్కు బ్రిటన్ సాయం
- అవసరమైతే తమ బేస్లు వాడుకొవచ్చన్న బ్రిటన్ ప్రధాని
- ఇప్పటికే ఇరాన్పై దాడుల్లో పాల్గొంటున్న బ్రిటన్ ఎయిర్ఫోర్స్
- మరోవైపు అమెరికాకు సాయం చేస్తున్నందుకు..
- సిప్రస్లోని యూకే బేస్లపైకి మిసైళ్లను సంధించిన ఇరాన్
- తమ ఎయిర్డిఫెన్స్ వాటిని అడ్డుకుందని ప్రకటించిన యూకే
- మిడిల్ ఈస్ట్లోని తమ ఆర్మీ బేస్లను యాక్టివేట్ చేసిన యూకే
-
ముగ్గురు యూఎస్ సైనికులు మృతి
- మిడిల్ ఈస్ట్లో తీవ్రంగా నడుస్తున్న యుద్ధం
- ఇరాన్ దాడిలో ముగ్గురు సైనికులను కోల్పోయామన్న అమెరికా
- ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు ప్రకటించిన USA
- ఎక్కడ మరణించారో వెల్లడించని అమెరికా ప్రభుత్వం
- ఇప్పటికే అమెరికా యుద్ధనౌకలు, ఆర్మీ బేస్లపై ఇరాన్ మిసైల్ దాడులు
- సైనికుల మృతికి ప్రతీకారం తప్పదన్న ట్రంప్
- అమెరికా దాడుల్లో ఇరాన్లో 201 మంది మృతి, 750 మందికి గాయాలు
- ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్లో పదిమంది మృతి, 120 మందికి గాయాలు
- UAEలో ముగ్గురు మృతి, 58మందికి గాయాలు
-
ఇజ్రాయిల్-ఇరాన్ వార్ భీకరంగా మారుతోంది. ఈ యుద్ధం కేవలం రెండు దేశాలకు మాత్రమే పరిమితం కాకుండా, మొత్తం మిడిల్ ఈస్ట్నే అతలాకుతలం చేస్తోంది. భారతీయులు.. ప్రత్యేకించి తెలుగువాళ్లు ఎక్కువగా నివసించే కువైట్, ఖతర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ వంటి దేశాలపైనా దాడులు జరిగాయి. ఆకాశంలో పేలుతున్న దృశ్యాలు చూసి హైదరాబాద్ వాసులు భయప్రాంతాలకు గురవుతున్నారు.. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం తెలంగాణకు చెందిన లక్షల మంది గల్ఫ్ దేశాల్లో వివిధ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. యుద్ధం నేపథ్యంలో ఏ క్షణాన ఏ వార్త వినాల్సి వస్తుందో అన్న భయంతో గడుపుతున్నారు. ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో అక్కడ ఉపాధి పొందుతున్న వారి బాధిత కుటుంబసభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉంది.
ఇజ్రాయెల్ ప్రధానితో మోదీ
ఈ క్రమంలో ప్రధాని మోదీ ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో టెలిఫోన్లో మాట్లాడారు. ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేనీ హత్య నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులు, ఇరాన్ చేపట్టిన ప్రతీకార దాడుల నేపథ్యంలో ఈ చర్చ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రాంతీయ పరిస్థితులను వివరంగా చర్చించామని మోదీ తెలిపారు. “ఇటీవలి పరిణామాలపై భారత ఆందోళనలను నెతన్యాహుకు తెలియజేశాను. పౌరుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. శత్రుత్వాలను త్వరగా నిలిపివేయాల్సిన అవసరం ఉంది” అని మోదీ స్పష్టం చేశారు.
మరోవైపు ఇరాన్తో యుద్ధంపై ట్రంప్ మరో ప్రకటన చేశారు. 9 ఇరాన్ యుద్ధనౌకలు సముద్రంలో మునిగిపోయాయని, ఇరాన్ నేవీ హెడ్క్వార్టర్స్ను కూడా ధ్వంసం చేశామన్నారు. మిగిలిన నౌకల వేట కూడా కొనసాగుతోందని.. ఇరాన్ నౌకాదళం మొత్తం నాశనమైందని తెలిపారు. దాడుల్లో 48 మంది ఇరాన్ నేతలు చనిపోయారన్నారు. చమురు ధరల పెరుగుదలపై ఆందోళన వద్దని తెలిపారు ట్రంప్. ఇరాన్ నేతలు నాతో మాట్లాడాలని కోరుకుంటున్నారని, ఇరాన్తో చర్చలకు సిద్ధం అన్నారు ట్రంప్. చర్చల కోసం ఇరాన్ ముందే రావాల్సిందన్నారు ట్రంప్.
Published On - Mar 02,2026 7:54 AM




