తెలంగాణలో పాఠశాలలు పునఃప్రారంభం.. మొదటి రోజు విద్యార్థుల హాజరు శాతం ఎంతో తెలుసా..?
తెలంగాణలో ఎట్టకేలకు సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. 10 నెలల విరామం అనంతరం ఉన్నత తరగతుల విద్యార్ధుల కోసం..
తెలంగాణలో ఎట్టకేలకు సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. 10 నెలల విరామం అనంతరం ఉన్నత తరగతుల విద్యార్ధుల కోసం పాఠశాలలు తెరుచుకున్నాయి. తొమ్మిది, పది తరగతి విద్యార్ధులకు కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా క్లాస్ లు నిర్వహిస్తున్నారు.
విద్యార్ధులకు మాస్క్ లు, బౌతికదూరం ఖచ్చింతం చేశారు. పాఠశాలకు వచ్చిన ప్రతి విద్యార్ధికి శానిటైజెషన్ చేసిన అనంతరం క్లాస్ రూమ్ లలోకి అనుమతిచ్చారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 60 శాతం విద్యార్థులు స్కూళ్లకు హాజరయ్యారన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.
వచ్చే రెండు మూడు రోజుల్లో 100 శాతం విద్యార్థులు స్కూళ్లకు హాజరవుతారనే ఆశాభావం వ్యక్తం చేశారు. క్లాసులకు రాని విద్యార్థులకు సైతం ఉపాధ్యాయులు ఆన్లైన్లో క్లాసులు నిర్వహిస్తారని చెప్పారు. 70శాతం సిలబస్ ప్రకారమే మూడు నెలలు తరగతులు కొనసాగుతాయన్నారు. కింది స్థాయి తరగతులు ప్రారంభించే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.