AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: యాసంగి ధాన్యం కొనుగోళ్లకు భారీ స్పందన.. అప్పుడే టార్గెట్‌ పూర్తి..!

ఈసారి సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500 బోనస్ ప్రకటించింది. ఇప్పటివరకు అందిన సన్న రకం ధాన్యంపై రూ.767 కోట్ల బోనస్ చెల్లించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విధంగా రైతులకు గరిష్ట ధర అందిస్తూ, ప్రభుత్వ ఖరీదుపై ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా గణనీయంగా కొనసాగుతోంది.

Telangana: యాసంగి ధాన్యం కొనుగోళ్లకు భారీ స్పందన.. అప్పుడే టార్గెట్‌ పూర్తి..!
Paddy Procurement Gains
Prabhakar M
| Edited By: |

Updated on: May 13, 2025 | 7:48 PM

Share

రాష్ట్రవ్యాప్తంగా యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా సాగుతోంది. మే 12వ తేదీ నాటికి ప్రభుత్వం మొత్తం 43.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఇది యాసంగి సీజన్‌కు నిర్దేశించిన 70.13 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యంలో 61.45 శాతంకు సమానం.

గతంతో పోలిస్తే కొనుగోళ్ల ఉత్పత్తిలో భారీ వృద్ధి:

2023-24లో ఇదే సమయానికి 29.88 లక్షల మెట్రిక్ టన్నులు, 2022-23లో 19.62 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయగా… ఈసారి గణనీయంగా కొనుగోళ్లు పెరిగాయి. రైతుల నుంచి పెద్దఎత్తున ధాన్యం వచ్చేందుకు, ప్రభుత్వం ఈసారి 8245 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. గతేడాది ఇది 7178 మాత్రమే.

ఇవి కూడా చదవండి

వరిసాగులో విస్తీర్ణం పెరిగింది:

ఈ యాసంగిలో రాష్ట్రవ్యాప్తంగా 60.14 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం ఈ సీజన్‌లో 1.29 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇందులో 70.13 లక్షల మెట్రిక్ టన్నులను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తీసుకుంటామని అంచనా.

ధాన్యం రకాల వారీగా కొనుగోళ్లు:

ఇప్పటివరకు ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యంలో 27.75 లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డు రకం, 15.35 లక్షల మెట్రిక్ టన్నులు సన్న రకం ఉన్నాయి. మొత్తం 6 లక్షల 58 వేల మంది రైతులు తమ ధాన్యాన్ని విక్రయించారు.

ధరల చెల్లింపులు, బోనస్‌లపై స్పష్టత:

ప్రభుత్వం ఇప్పటివరకు దాదాపు రూ.9999.36 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేసింది. ఇందులో రూ.6671 కోట్ల చెల్లింపులు ఇప్పటికే పూర్తయ్యాయి. రైతులకు వెంటనే బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తోంది పౌర సరఫరాల శాఖ.

సన్న రకం ధాన్యానికి బోనస్ కూడా:

ఈసారి సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500 బోనస్ ప్రకటించింది. ఇప్పటివరకు అందిన సన్న రకం ధాన్యంపై రూ.767 కోట్ల బోనస్ చెల్లించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ విధంగా రైతులకు గరిష్ట ధర అందిస్తూ, ప్రభుత్వ ఖరీదుపై ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా గణనీయంగా కొనసాగుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..