AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి కావడం లేదని.. తండ్రిని చంపిన కొడుకు.. కట్‌చేస్తే ఇలా దొరికిపోయాడు..!

ఇక ఆ మర్నాడు ఉదయం స్థానిక డాక్టర్‌ని పిలిపించి తన తండ్రి లేవడం లేదని చూపించాడు..అమృతాన్ని పరీక్షించిన డాక్టర్‌ అతను చనిపోయినట్లుగా ధ్రువీకరించాడు. అమృతానిది సహజ మరణంగా చిత్రీకరించిన మహిపాల్‌ బంధువులకు సమాచారమిచ్చాడు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా

పెళ్లి కావడం లేదని.. తండ్రిని చంపిన కొడుకు.. కట్‌చేస్తే ఇలా దొరికిపోయాడు..!
Crime
Jyothi Gadda
|

Updated on: Oct 22, 2024 | 8:20 AM

Share

తనకు పెళ్లి కావడం లేదని ఓ కొడుకు తన తండ్రిని చంపిన దారుణ ఘటన నిజామాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని నవీపేట్‌ మండలం అనంతగిరికి చెందిన మహిపాల్‌ తన తండ్రి గౌరు అమృతాన్ని గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత సహజమరణంగా నమ్మించే ప్రయత్నం చేసి దొరికిపోయాడు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా కథ అడ్డం తిరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు మహిపాల్‌ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం ఒప్పుకున్నాడు.. పూర్తి వివరాల్లోకి వెళితే..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతర గిరి గ్రామానికి చెందిన గౌరు అమృతం కుమారుడు గౌరు మహిపాల్‌ గత కొంతకాలంగా దుబాయ్‌లో ఉంటున్నాడు.. ఇటీవలే దుబాయి నుంచి స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. మహిపాల్‌ ఇంటికి వచ్చేసరికి తన తల్లి తండ్రి నుంచి విడిపోయి దూరంగా ఉంటోందని తెలిసింది. ఈ క్రమంలోనే తన తండ్రి అమృతం తన పశువులను కూడా అమ్ముకున్నాడని తెలిసింది. తల్లిని వేరుగా ఉంచడం, తనకు పెళ్లి చేయకపోవడం, పశువులు అమ్ముకోవడంతో తండ్రిపై మహిపాల్‌ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇలాంటి తండ్రి లేకపోవటమే మంచిదని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి తండ్రీకొడుకులు మద్యం సేవించారు. అమృతం మత్తులోకి జారుకోవడంతో అతడి గొంతుకు టవల్‌ బిగించి హత్య చేశాడు.

ఇక ఆ మర్నాడు ఉదయం స్థానిక డాక్టర్‌ని పిలిపించి తన తండ్రి లేవడం లేదని చూపించాడు..అమృతాన్ని పరీక్షించిన డాక్టర్‌ అతను చనిపోయినట్లుగా ధ్రువీకరించాడు. అమృతానిది సహజ మరణంగా చిత్రీకరించిన మహిపాల్‌ బంధువులకు సమాచారమిచ్చాడు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా అమృతం మెడపై గాయాలను గమనించిన బంధువులు, స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తమదైన స్టైల్లో మహిపాల్‌ను విచారించగా తండ్రిని తానే చంపినట్లు ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడిని అరెస్టు చేసినట్టుగా నిజామాబాద్‌ నార్త్‌ రూరల్‌ సీఐ సతీశ్‌, ఎస్సై వినయ్‌ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..