ఓవైపు కూల్చివేతలు.. మరోవైపు నిర్వాసితుల నిరసనలు.. కాకరేపుతున్న మూసీ సుందరీకరణ..!
మూసీ బ్యూటిఫికేషన్ కేంద్రంగా తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. ఓవైపు కూల్చివేతల పర్వం..మరోవైపు నిర్వాసితుల తరిలింపు, డబుల్ బెడ్ ఇళ్ల కేటాయింపు ప్రక్రియలు కొనసాగుతున్నాయి.

మూసీ సుందరీకరణ తెలంగాణలో రాజకీయ మంటలు రేపుతోంది. సుందరీకరణ చేసి తీరుతామని అధికార పార్టీ కుండబద్ధలు కొట్టి చెప్తుంటే.. పేద, మధ్య తరగతి ప్రజల ఇళ్లు కూల్చి ఎలా ముందుకు వెళ్తారో తాము చూస్తామంటూ విపక్షాలు సవాల్ విసురుతున్నాయి. మూసీ సుందరీకరణ.. తెలంగాణ రాజకీయాల్లో కాక రేపిన అంశం. కాంగ్రెస్ Vs బీఆర్ఎస్ గా మారిపోయింది ఈ ఇష్యూ. నార్సింగి టు నాగోల్. 55 కిలోమీటర్ల మేర రూపురేఖలు మార్చి కమర్షియల్ హబ్గా మార్చుతామని అంటోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలో ఆక్రమణలను తొలగించేందుకు సిద్ధమైంది. సుందరీకరణ పనుల్లో భాగంగా చాదర్ఘాట్ మూసీ పరిధిలో నదీ గర్భంలో ఉన్న ఇండ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. ఇక్కడ ఉన్న 140 నిర్వాసిత కుటుంబాలను చంచల్గూడ డబుల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్లలోకి తరలించారు.. అయితే సర్కారు చర్యలపై ప్రతిపక్షాలు కన్నెర్ర చేస్తున్నాయి. ఇది అభివృద్ధినా? పేదలను రోడ్డు మీద వేయడమా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అది బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గురువారం(అక్టోబర్ 3) నాడు LB నగర్లో పర్యటిస్తా.. ఎవరో అడ్డుకుంటారో చూస్తా అంటూ సవాల్ విసిరారు. మూసీ ప్రక్షాళన విషయంలో ప్రభుత్వ చర్యలను విపక్షాలు తప్పుబడుతున్నాయి. అది బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్ అంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మూసీ ప్రాజెక్టు రాహుల్ డైరెక్షన్లో నడుస్తుందన్నారు. కర్ణాటక సీఎం స్కాంలో ఇరుకున్నారు. అక్కడ డిప్యూటీ సీఎం...
