IND vs ENG: ఇంగ్లాండ్ ముందు భారీ టార్గెట్.. 12 ఏళ్ల హిస్టరీ బ్రేక్ అయ్యేనా?
IND vs ENG: ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య టీ20 ప్రపంచ కప్ రెండో సెమీఫైనల్ జరుగుతోంది. టాస్ గెలిచి ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు నిర్నీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 253 పరుగులు చేసింది. శివం దుబే 43 పరుగులు, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 11, ఇషాన్ కిషన్ 39, సంజు సామ్సన్ 89, అభిషేక్ శర్మ 9 పరుగులు చేశారు.

IND vs ENG: ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. టీ20 ప్రపంచ కప్ రెండో సెమీఫైనల్లో ఇంగ్లాండ్ ముందు భారత్ 254 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టీం ఇండియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగులు చేసింది. ఇది టీ20 ప్రపంచ కప్లో ఆ జట్టు సాధించిన రెండవ అత్యధిక స్కోరుగా నిలిచింది.
టీం ఇండియా తరపున సంజు సామ్సన్ 89 పరుగులు చేయగా, శివం దుబే 43 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 39, హార్దిక్ పాండ్యా 27, తిలక్ వర్మ 21 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ తరఫున విల్ జాక్స్, ఆదిల్ రషీద్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. జోఫ్రా ఆర్చర్ ఒక వికెట్ తీశారు. ఇద్దరు బ్యాట్స్మెన్ రనౌట్ అయ్యారు.
భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(కీపర్), హ్యారీ బ్రూక్(కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కుర్రాన్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
