కేటీఆర్
కల్వకుంట్ల రామారావు (కేటీఆర్) తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. ప్రస్తుతం ఆయన భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ తనయుడైన కేటీఆర్.. ప్రస్తుతం సిరిసిల్ల నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిథ్యంవహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగం అయ్యేందుకు అమెరికాలో ఉద్యోగాన్ని వదిలి 2004 నుంచి పరోక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో తొలిసారి సిరిసిల్లి నియోజకవర్గం నుంచి పోటీచేసి తన సమీప ప్రత్యర్థి కేకే మహేందర్ రెడ్డిపై 171 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తెలంగాణ సాధన కోసం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, 2010 ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డిపై 68 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో రెండోసారి గెలిచారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి గెలుపొంది.. కేసీఆర్ కేబినెట్లో మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రిగా పనిచేశారు. 2018 ఎన్నికల్లో 89 వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందిన ఆయన.. 2019 సెప్టెంబర్ 8న రెండోసారి కేసీఆర్ కేబినెట్లో ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల బాధ్యతలు చేపట్టారు.
తెలంగాణ పాలిటిక్స్లో ‘11 AM’ హైటెన్షన్: ఒకే ముహూర్తం.. మూడు వేదికలు.. ‘సై’ అంటే ‘సై’ అంటున్న కాంగ్రెస్ – బీఆర్ఎస్!
తెలంగాణ రాజకీయం ప్రస్తుతం తీవ్ర స్థాయికి చేరుకుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య నడుస్తున్న ‘డేట్, టైమ్, లొకేషన్’ సవాళ్లు రాష్ట్రంలో పొలిటికల్ హీట్ను పీక్స్కు తీసుకెళ్లాయి. నిన్నటివరకు కేవలం ప్రెస్ మీట్లు, ట్వీట్లకే పరిమితమైన విమర్శల పర్వం.. ఇప్పుడు "ఇవాళ ఉదయం 11 గంటల" డెడ్లైన్కు చేరింది. ముహూర్తం ఒక్కటే అయినప్పటికీ, నేతలు కొట్లాడేందుకు ఎంచుకున్న వేదికలు మాత్రం మూడు కావడం విశేషం. అటు తెలంగాణ భవన్, ఇటు సోమాజిగూడ ప్రెస్ క్లబ్, మరోవైపు గన్ ఫౌండ్రీ అమరవీరుల స్థూపం.. ఎక్కడ చూసినా 11 గంటల సమయం చుట్టూనే ఉత్కంఠ తిరుగుతోంది.
- Balaraju Goud
- Updated on: Jul 2, 2026
- 10:49 am
బీఆర్ఎస్గా మారాక నష్టపోయాం.. మళ్లీ టీఆర్ఎస్గా ఉండాలనుకుంటున్నాంః కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్చాట్ రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. గత ఎన్నికల ఓటమి తర్వాత పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు ఆయన సిద్ధం చేసిన కార్యాచరణను ఈ సందర్భంగా బయటపెట్టారు. పార్టీని తిరిగి 'టీఆర్ఎస్'గానే మార్చాలనే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టం చేశారు.
- Balaraju Goud
- Updated on: Apr 12, 2026
- 6:23 pm
బీఆర్ఎస్లోకి జీవన్ రెడ్డి.. పార్టీలోకి స్వయంగా ఆహ్వానించనున్న కేటీఆర్, హరీష్ రావు!
శ్రీపరాభవ నామ సంవత్సరంలో పరాభవం జరగని పార్టీలోకి వెళ్తానన్న జీవన్ రెడ్డి, బీఆర్ఎస్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్లో తనకు గౌరవం ఇవ్వడం లేదని.. తన సీనియార్టీని గుర్తించడం లేదని ఆ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి కారెక్కేందుకు సిద్ధమవుతున్నారు. జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. తాజా రాజకీయాలపై చర్చించారు.
- Balaraju Goud
- Updated on: Apr 8, 2026
- 9:39 pm
KTR: కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామన్నారు.. కానీ తెలంగాణయే కేసీఆర్ ఆనవాళ్లు
కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తామని కొందరు మాట్లాడుతున్నారని, కానీ తెలంగాణ రాష్ట్రమే కేసీఆర్ ఆనవాళ్లని కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేస్తూ, తెలంగాణనే కేసీఆర్ స్థాపించిన గొప్ప వారసత్వమని, దానిని ఎవరూ చెరివేయలేరని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తామనే వ్యాఖ్యలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
- Phani CH
- Updated on: Feb 17, 2026
- 6:18 pm
KTR: గ్రేటర్ ఎన్నికలపై కేటీఆర్ ఫోకస్.. ఫలితాలపై కీలక వ్యాఖ్యలు!
హైదరాబాద్ మహానగరంలో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఒకటి కాదు, ఎన్ని కార్పొరేషన్లు చేసినా ఎగిరేది మాత్రం ఖచ్చితంగా గులాబీ జెండానేనని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన యువ నాయకుడు విజయ్ కుమార్ రెడ్డి తన అనుచరులతో కలిసి గురువారం తెలంగాణ భవన్లో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు.
- Anand T
- Updated on: Feb 12, 2026
- 5:28 pm
KTR: కేసీఆర్ ను తిట్టుడు తప్ప రెండేళ్లలో రేవంత్ చేసిందేంటి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భూపాలపల్లి మున్సిపల్ ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ను తిట్టడం తప్ప రేవంత్కి పాలన చేతకాదని ఆయన విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ పాత్రను ప్రశ్నించి, లక్కీ డ్రాలో సీఎం అయ్యారని ఆరోపించారు. రెండేళ్లలో మళ్లీ తమ ప్రభుత్వమే వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు.
- Phani CH
- Updated on: Feb 9, 2026
- 4:22 pm
అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడిగి వేధించారు.. లీకులు ఇచ్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారుః కేటీఆర్
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పూర్తిగా సహకరిస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తెలిపారు. లీకులతో మాకు సంబంధం లేదని విషయాలను బయటపెట్టి బీఆర్ఎస్ నేతల మనోభావాలను దెబ్బతీస్తున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ టైమ్ పాస్ నడుపుతున్నారంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు.
- Balaraju Goud
- Updated on: Jan 23, 2026
- 7:49 pm
ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో సంక్రాంతి వేడుకలు
సిద్దిపేటలోని ఎర్రవల్లి ఫామ్హౌస్లో కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పండుగ వాతావరణంలో కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరి సంబరాల్లో పాల్గొన్నారు. టీవీ9 దృశ్యాలలో కనిపించిన ఈ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య జరిగాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.
- Samatha J
- Updated on: Jan 16, 2026
- 1:47 pm
KTR: ‘రేవంత్ ఏం తిట్టినా, సహనం కోల్పోవద్దని కేసీఆర్ నాకు చెప్పారు’
రేవంత్ రెడ్డి విమర్శలపై సంయమనం పాటించాలని కేసీఆర్ తనకు సూచించినట్లు కేటీఆర్ వెల్లడించారు. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు, దిగజారుడు ఆరోపణల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు రాజకీయ నాయకులపై నమ్మకం కోల్పోయారని, పార్టీ నాయకత్వాలు తమ సభ్యులను నియంత్రించాలని ఆయన పిలుపునిచ్చారు.
- Ram Naramaneni
- Updated on: Nov 8, 2025
- 9:21 pm
Congress vs BRS: బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ జెండా.. మణుగూరులో ఏం జరిగిందంటే..
మణుగూరులో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మణుగూరు మంటలు కాకరేపుతున్నాయి. మణుగూరు పార్టీ కార్యాలయం దహనం చేసిన ఘటన పెనుదుమారంగా మారింది. బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి జెండా ఎగరేయడంతో.. పాలిటిక్స్ మరింత వేడెక్కాయి.. దీనిపై కేటీఆర్ కూడా స్పందించారు.
- N Narayana Rao
- Updated on: Nov 2, 2025
- 6:51 pm
KTR: పేదలకు ఒక న్యాయం.. పెద్దలకు మరో న్యాయమా..? హైడ్రా సమాధానం చెప్పాలి
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా కేవలం పేదల ఇళ్లను ఎందుకు కూల్చుతుందో సమాధానం చెప్పాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.. పెద్దల జోలికి హైడ్రా ఎందుకు వెళ్లడం లేదన్నారు. తెలంగాణ భవన్లో ఆదివారం కేటీఆర్ హైడ్రా ఎగ్జిబిషన్ కార్యక్రమం నిర్వహించారు.
- Shaik Madar Saheb
- Updated on: Nov 2, 2025
- 3:35 pm
సెంటిమెంట్ టు సెటిలర్స్.. దేశభక్తి టు రౌడీ పాలిటిక్స్.. అంతా రాజకీయమే ఇక్కడ!
ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క. కార్నర్లలో నిల్చుని డైనమైట్ లాంటి డైలాగ్స్ పేల్చుతున్నారు. గల్లీ చిన్నది కావొచ్చు గానీ ఆ లీడర్ల డైలాగ్స్ పెద్దవి. బడా లీడర్లంతా గ్రౌండ్ అయ్యారు కాబట్టే అంత సౌండ్. ఊహకు కూడా అందని అంశాలు.. ఎన్నికల ప్రచారంలో వినిపిస్తున్నాయి. ఏదైనా పార్టీ ఓ టాపిక్ మొదలుపెడితే.. మిగిలిన రెండు పార్టీలు అట్నుంచి, ఇట్నుంచి కౌంటర్ ఇస్తున్నాయి. ఓవరాల్గా జూబ్లీహిల్స్ బైఎలక్షన్ పాకాన పడుతోంది.
- Balaraju Goud
- Updated on: Nov 1, 2025
- 10:53 pm