కేటీఆర్
కల్వకుంట్ల రామారావు (కేటీఆర్) తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. ప్రస్తుతం ఆయన భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ తనయుడైన కేటీఆర్.. ప్రస్తుతం సిరిసిల్ల నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిథ్యంవహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగం అయ్యేందుకు అమెరికాలో ఉద్యోగాన్ని వదిలి 2004 నుంచి పరోక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో తొలిసారి సిరిసిల్లి నియోజకవర్గం నుంచి పోటీచేసి తన సమీప ప్రత్యర్థి కేకే మహేందర్ రెడ్డిపై 171 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తెలంగాణ సాధన కోసం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, 2010 ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డిపై 68 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో రెండోసారి గెలిచారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి గెలుపొంది.. కేసీఆర్ కేబినెట్లో మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రిగా పనిచేశారు. 2018 ఎన్నికల్లో 89 వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందిన ఆయన.. 2019 సెప్టెంబర్ 8న రెండోసారి కేసీఆర్ కేబినెట్లో ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల బాధ్యతలు చేపట్టారు.
KTR: ‘రేవంత్ ఏం తిట్టినా, సహనం కోల్పోవద్దని కేసీఆర్ నాకు చెప్పారు’
రేవంత్ రెడ్డి విమర్శలపై సంయమనం పాటించాలని కేసీఆర్ తనకు సూచించినట్లు కేటీఆర్ వెల్లడించారు. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు, దిగజారుడు ఆరోపణల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు రాజకీయ నాయకులపై నమ్మకం కోల్పోయారని, పార్టీ నాయకత్వాలు తమ సభ్యులను నియంత్రించాలని ఆయన పిలుపునిచ్చారు.
- Ram Naramaneni
- Updated on: Nov 8, 2025
- 9:21 pm
Congress vs BRS: బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ జెండా.. మణుగూరులో ఏం జరిగిందంటే..
మణుగూరులో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మణుగూరు మంటలు కాకరేపుతున్నాయి. మణుగూరు పార్టీ కార్యాలయం దహనం చేసిన ఘటన పెనుదుమారంగా మారింది. బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి జెండా ఎగరేయడంతో.. పాలిటిక్స్ మరింత వేడెక్కాయి.. దీనిపై కేటీఆర్ కూడా స్పందించారు.
- N Narayana Rao
- Updated on: Nov 2, 2025
- 6:51 pm
KTR: పేదలకు ఒక న్యాయం.. పెద్దలకు మరో న్యాయమా..? హైడ్రా సమాధానం చెప్పాలి
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా కేవలం పేదల ఇళ్లను ఎందుకు కూల్చుతుందో సమాధానం చెప్పాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.. పెద్దల జోలికి హైడ్రా ఎందుకు వెళ్లడం లేదన్నారు. తెలంగాణ భవన్లో ఆదివారం కేటీఆర్ హైడ్రా ఎగ్జిబిషన్ కార్యక్రమం నిర్వహించారు.
- Shaik Madar Saheb
- Updated on: Nov 2, 2025
- 3:35 pm
సెంటిమెంట్ టు సెటిలర్స్.. దేశభక్తి టు రౌడీ పాలిటిక్స్.. అంతా రాజకీయమే ఇక్కడ!
ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క. కార్నర్లలో నిల్చుని డైనమైట్ లాంటి డైలాగ్స్ పేల్చుతున్నారు. గల్లీ చిన్నది కావొచ్చు గానీ ఆ లీడర్ల డైలాగ్స్ పెద్దవి. బడా లీడర్లంతా గ్రౌండ్ అయ్యారు కాబట్టే అంత సౌండ్. ఊహకు కూడా అందని అంశాలు.. ఎన్నికల ప్రచారంలో వినిపిస్తున్నాయి. ఏదైనా పార్టీ ఓ టాపిక్ మొదలుపెడితే.. మిగిలిన రెండు పార్టీలు అట్నుంచి, ఇట్నుంచి కౌంటర్ ఇస్తున్నాయి. ఓవరాల్గా జూబ్లీహిల్స్ బైఎలక్షన్ పాకాన పడుతోంది.
- Balaraju Goud
- Updated on: Nov 1, 2025
- 10:53 pm
KTR: ఆయన తప్పేం లేదు. అంతా మనమే చేశాం.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
ఆయన తప్పేం లేదు. అంతా మనమే చేశాం.. ఎంతో పనిచేశాం. కానీ.. ఎన్నికల్లో ఓడిపోయాం అంటే.. కార్యకర్తలు చేసిన తెలివితక్కువ పనే కారణమన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇంకోసారి అలా చేయొద్దంటూ స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇంతకీ కేడర్ చేసిన తప్పేంటి? ఫలితాలపై పార్టీలో అంతర్మథనం జరిగిందా?..
- Shaik Madar Saheb
- Updated on: Sep 24, 2025
- 8:45 pm
KTR: ఒడిసిన ముచ్చట.. కవిత సస్పెన్షన్పై తొలిసారి స్పందించిన కేటీఆర్.. ఏమన్నారంటే..
కవిత అంశం ఒడిసిన ముచ్చట.. ఆ టాపిక్ మళ్లీ తేవొద్దు అంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశాక చర్చ అనవసరం అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. అన్నీ చర్చించాకే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిందని కేటీఆర్ పేర్కొన్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Sep 9, 2025
- 9:01 am
Kavitha: ఆరడుగుల బుల్లెట్ నాకు గాయం చేసింది.. తర్వాత మీవంతే రామన్న..
రామన్నా.. హరీష్, సంతోష్ మీతో ఉన్నట్టు కనిపించవచ్చు కానీ.. మీ గురించి, తెలంగాణ గురించి ఆలోచించే వ్యక్తులు కాదు .. వాళ్లను పక్కనపెడితేనే పార్టీ బతుకుతుంది.. నాన్న పేరు నిలబడుతుంది.. అంటూ కవిత పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కవిత తొలిసారి మాట్లాడారు.. మీడియాతో మాట్లాడిన కవిత మరోసారి హరీష్రావు, అలాగే.. సంతోష్ రావు టార్గెట్గా తీవ్ర విమర్శలు చేశారు.
- Shaik Madar Saheb
- Updated on: Sep 3, 2025
- 1:13 pm
KTR: రాహుల్, మోదీ కలిసి చర్చించుకుంటే అరగంటలో బిల్లు పాస్: కేటీఆర్ ఏమన్నారంటే..
తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లపై అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది.. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్లపై అందరూ ఒకే మాటపై ఉన్నారని..ఇది అసెంబ్లీలో తేలే అంశం కాదని రాహుల్ గాంధీ, మోదీ కలిసి చర్చించుకుంటే అరగంటలో బిల్లు పాస్ అవుతుందంటూ కేటీఆర్ పేర్కొన్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Aug 31, 2025
- 1:22 pm
Telangana Assembly: కేసీఆర్ వస్తారా..? అసెంబ్లీ ముందుకు కాళేశ్వరం కమిషన్ నివేదిక
కాళేశ్వరం అంశం క్లైమాక్స్కు చేరుకుంది. ఇప్పటికే దీనిపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇవ్వడంతో.. దీన్ని అసెంబ్లీలో పెట్టి చర్చించేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరోవైపు సభలో కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు అనుతివ్వాలంటున్న బీఆర్ఎస్.. కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో పెట్టకుండా చూడాలని హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో మాజీ సీఎం సభకు రావాలని అధికార పార్టీ డిమాండ్ చేస్తుంటే.. కేసీఆర్ సభకు రావాల్సిన అవసరం లేదని వాదిస్తోంది కారు పార్టీ. ఇంతకీ కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? రారా?
- Shaik Madar Saheb
- Updated on: Aug 31, 2025
- 6:53 am
Jagadish Reddy: పార్టీలో అందరూ సమానమే.. కవిత గురించి మాజీ మంత్రి జగదీష్రెడ్డి ఏమన్నారంటే..
రాజకీయాల్లో ఎవరూ ఎవర్ని ఎలిమినేట్ చేయలేరు.. మా ప్రెసిడెంట్ KCR .. వర్కింగ్ ప్రెసిడెంట్ KTR.. పార్టీలో అందరూ సమానమే.. 2028లో కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారు.. అంటూ టీవీ9 క్రాస్ఫైర్లో మాజీ మంత్రి జగదీష్రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ దుష్ప్రచారం వాళ్లకే రివర్సు కొడుతుంది.. రిపోర్టులు బయటికొస్తే అసలు కథ మొదలవుతుంది.. అంటూ వ్యాఖ్యానించారు.
- Shaik Madar Saheb
- Updated on: Aug 24, 2025
- 7:42 pm