AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లంచం అడిగిన తహశీల్దార్.. కోపం తో తిరగబడ్డ రైతులు

లంచం అడిగిన తహశీల్దార్.. కోపం తో తిరగబడ్డ రైతులు

Phani CH
|

Updated on: Mar 05, 2026 | 6:40 PM

Share

ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు రైతులు తహశీల్దార్, వీఆర్ఓ నరేంద్రపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాదారు పాస్‌బుక్‌ల మంజూరుకు లక్షల్లో డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తూ నిరసన తెలిపారు. ఇతర శాఖలు సానుకూలంగా స్పందించినా, తహశీల్దార్‌ ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండల తహశీల్దార్‌ కార్యాలయం ముందు మూలపాడు రైతులు, కూటమి నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పట్టాదారు పాస్‌బుక్‌ల మంజూరులో జాప్యం, అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. తహశీల్దార్, వీఆర్ఓ నరేంద్ర తమకు పట్టాదారు పాస్‌బుక్‌లు ఇవ్వడానికి లక్షల్లో డబ్బులు డిమాండ్ చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరిగేషన్, పంచాయతీ వంటి ఇతర ప్రభుత్వ శాఖలు, అలాగే జిల్లా కలెక్టర్ తమ పట్ల సానుకూలంగా స్పందించినా, తహశీల్దార్ మాత్రం అనవసర ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు పేర్కొన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Telangana: తెలంగాణ టీచర్ల జీతాల కోతపై ప్రభుత్వ స్పష్టత..

US-Israel-Iran War: ఇరాన్ ఆయుధ సామగ్రిని ధ్వంసం చేస్తోన్న అమెరికా

SonuSood: మరోసారి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్

CM Chandrababu: ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలను కంటే రూ.25 వేలు

US-Israel-Iran War: ట్రంప్ ను మట్టుబెట్టేందుకు పాక్ గూఢచారిని పంపిన ఇరాన్

Follow Us