MLC Election: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం.. ఓటు ప్రాధాన్యత తెలుపడం ఎలాగో తెలుసా..?

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు జరిగే పోలింగ్ కు అధికార యంత్రాంగం చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రచారం ముగించిన అభ్యర్థులు ఇక పట్టభద్రుల ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. విద్యావంతుల ఓటు ప్రాధాన్యత తెలుపడం ఎలాగో తెలుసా..?

MLC Election: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం.. ఓటు ప్రాధాన్యత తెలుపడం ఎలాగో తెలుసా..?
Graduate Mlc By Election
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: May 26, 2024 | 12:02 PM

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక తుది అంకానికి చేరుకుంది. ప్రచారానికి గడువు ముగియడంతో ఇక అందరి దృష్టి పోలింగ్‌పై పడింది. మే 27వ తేదీన ఉదయం 8గంటలకు పోలింగ్‌ ప్రారంభం కానుంది. సాయంత్రం నాలుగింటికి ముగియనుంది. పోలింగ్ కోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. జిల్లాల కేంద్రాల్లో బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ మెటీరియల్ పంపిణీ చేస్తున్నారు. పోలింగ్ రోజు ఉదయం 6 నుంచి రాత్రి 8గంటల వరకు 144 సెక్షన్ అమలు చేయనున్నారు. 48 గంటలపాటు వైన్‌ షాపులు బంద్ చేశారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 52మంది బరిలో ఉన్నారు. జంబో బ్యాలెట్ పేపర్‌తో పోలింగ్ నిర్వహించనున్నారు ఎన్నికల అధికారులు. మొత్తం 4లక్షల 63వేల 839 మంది ఓటర్లు ఉండగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో లక్షా 73వేల 406మంది, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లక్షా 23వేల 985, ఉమ్మడి నల్గొండ జిల్లాలో లక్షా 66వేల 448 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. పోలింగ్ డే రోజు ఈ మూడు జిల్లాల్లో ప్రత్యేక సెలవు ప్రకటించారు. అధికారులు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద పోలింగ్ సామాగ్రి పంపిణీ చేశారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు జరిగే పోలింగ్ కు అధికార యంత్రాంగం చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రచారం ముగించిన అభ్యర్థులు ఇక పట్టభద్రుల ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. విద్యావంతుల ఓటు ప్రాధాన్యత తెలుపడం ఎలాగో తెలుసా..?

అయితే సాధారణ ఎన్నికలతో పోల్చితే పట్టభద్రుల పోలింగ్ కాస్త భిన్నంగా ఉంటుంది.. 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన నేపథ్యంలో జంబో బ్యాలెట్ ద్వారా పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఓటర్లు అభ్యర్థులకు అంకె ద్వారా వారి ప్రాధాన్యత తెలపాల్సి ఉంటుంది. ఒకటోవ ప్రాధాన్యత, రెండోవ ప్రాధాన్యత ఇలా వారికి నచ్చిన అభ్యర్థికి ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాల్సి ఉంటుంది.

ఓటు వేసే క్రమంలో ఇంటూ గుర్తు, ఇతర సింబల్స్ రాయకూడదు. మొదటి ప్రాధాన్యత అయితే అక్కడ ఒక నిలువు గీత మాత్రమే పెట్టి వారి ప్రాధాన్యత తెలపాలి. పోలింగ్ బూత్‌లో ఇచ్చిన పెన్ను మాత్రమే వాడాలి. కాదని ఎలాంటి ప్రయోగాలు చేసిన మీ ఓటు బురదలో వేసినట్లే అవుతుందంటున్నారు ఎన్నికల సంఘం అధికారులు. సోమవారం 27వ తేదీ ఉదయం 8గంటల నుండి సా.4 వరకు పోలింగ్ జరుగుతుంది.. 48 గంటల పాటు మూడు జిల్లాల పరిధిలో మద్యం దుకాణాలు మూసి వేశారు. పోలింగ్ రోజు ఉ.6 నుండి సా.8 వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Latest Articles
డయాబెటిస్‌తో బాధపడుతున్నారా.? కంటి సమస్యలు రాకూడదంటే..
డయాబెటిస్‌తో బాధపడుతున్నారా.? కంటి సమస్యలు రాకూడదంటే..
డబ్బుల కోసం ఏ పనైనా చేస్తా.. కానీ అది తప్ప..
డబ్బుల కోసం ఏ పనైనా చేస్తా.. కానీ అది తప్ప..
డిప్యూటీ సీఎం పదవి రాజ్యాంగబద్దమా కాదా..? అతనికి ఉన్న అధికారాలివే
డిప్యూటీ సీఎం పదవి రాజ్యాంగబద్దమా కాదా..? అతనికి ఉన్న అధికారాలివే
ఇంట్లో జమ్మి మొక్కను పెంచుకోవడానికి వాస్తు నియమాలున్నాయని తెలుసా
ఇంట్లో జమ్మి మొక్కను పెంచుకోవడానికి వాస్తు నియమాలున్నాయని తెలుసా
చల్లచల్లని.. కూల్ న్యూస్.. ఏపీలో వచ్చే 3 రోజులు భారీ వర్షాలు..
చల్లచల్లని.. కూల్ న్యూస్.. ఏపీలో వచ్చే 3 రోజులు భారీ వర్షాలు..
ఏటీఎంలలో నగదు విత్ డ్రా చేసే వారికి బ్యాడ్ న్యూస్..
ఏటీఎంలలో నగదు విత్ డ్రా చేసే వారికి బ్యాడ్ న్యూస్..
ఎవడ్రా నువ్వు.. ఏకంగా కింగ్ కోబ్రాతోనే కితకితలా! ఏం చేశాడో చూస్తే
ఎవడ్రా నువ్వు.. ఏకంగా కింగ్ కోబ్రాతోనే కితకితలా! ఏం చేశాడో చూస్తే
ఈ ఫీచర్లు.. సెల్ ఫోన్లను కాపాడే పోలీసులు.. షాక్ అవ్వకండి..
ఈ ఫీచర్లు.. సెల్ ఫోన్లను కాపాడే పోలీసులు.. షాక్ అవ్వకండి..
మనిషి నీరు లేకుండా ఎంతకాలం జీవించవచ్చు.. నిపుణులు ఏమంటున్నారు?
మనిషి నీరు లేకుండా ఎంతకాలం జీవించవచ్చు.. నిపుణులు ఏమంటున్నారు?
చంద్రబాబును చూసైనా రేవంత్ రెడ్డి నేర్చుకోవాలి.. హరీష్ రావు
చంద్రబాబును చూసైనా రేవంత్ రెడ్డి నేర్చుకోవాలి.. హరీష్ రావు
చంద్రబాబును చూసైనా రేవంత్ రెడ్డి నేర్చుకోవాలి.. హరీష్ రావు
చంద్రబాబును చూసైనా రేవంత్ రెడ్డి నేర్చుకోవాలి.. హరీష్ రావు
నన్ను నేనే మిస్ అవుతున్నాను.. హార్ట్‌ ను టచ్ చేస్తున్న సేతుపతి..
నన్ను నేనే మిస్ అవుతున్నాను.. హార్ట్‌ ను టచ్ చేస్తున్న సేతుపతి..
హ్యాట్సాఫ్..రవితేజ గారు.! తీవ్ర మెడనొప్పి లెక్కచేయని మాస్‌రాజా..!
హ్యాట్సాఫ్..రవితేజ గారు.! తీవ్ర మెడనొప్పి లెక్కచేయని మాస్‌రాజా..!
స్టార్ హీరోయిన్ ఘరానా మోసం.? కోర్టుకెక్కిన వ్యాపారి..
స్టార్ హీరోయిన్ ఘరానా మోసం.? కోర్టుకెక్కిన వ్యాపారి..
హజ్‌ యాత్ర ప్రారంభం.. 48 డిగ్రీల ఉష్ణోగ్రత ఎడారిలో యాత్ర.!
హజ్‌ యాత్ర ప్రారంభం.. 48 డిగ్రీల ఉష్ణోగ్రత ఎడారిలో యాత్ర.!
అందర్నీ చంపేయాలనే కసి వారిలో కనిపించింది.. కశ్మీర్లో ఉగ్రవాదులు..
అందర్నీ చంపేయాలనే కసి వారిలో కనిపించింది.. కశ్మీర్లో ఉగ్రవాదులు..
ప్రాణాలకు తెగించి కాపాడాడు.. ఆపై పొట్టుపొట్టుగా కొట్టాడు..
ప్రాణాలకు తెగించి కాపాడాడు.. ఆపై పొట్టుపొట్టుగా కొట్టాడు..
ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి దాదాపు పూర్తి.. మన దగ్గరే..
ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి దాదాపు పూర్తి.. మన దగ్గరే..
హైదరాబాద్‌లో అర్థరాత్రి పోకిరీ బ్యాచ్‌ వీరంగం. ఇంటి ఓనర్ పై దాడి.
హైదరాబాద్‌లో అర్థరాత్రి పోకిరీ బ్యాచ్‌ వీరంగం. ఇంటి ఓనర్ పై దాడి.
అదుపు తప్పి అలకనంద నదిలో పడ్డ టెంపో.. 8 మంది మృతి.
అదుపు తప్పి అలకనంద నదిలో పడ్డ టెంపో.. 8 మంది మృతి.