MLC Election: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం.. ఓటు ప్రాధాన్యత తెలుపడం ఎలాగో తెలుసా..?

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు జరిగే పోలింగ్ కు అధికార యంత్రాంగం చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రచారం ముగించిన అభ్యర్థులు ఇక పట్టభద్రుల ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. విద్యావంతుల ఓటు ప్రాధాన్యత తెలుపడం ఎలాగో తెలుసా..?

MLC Election: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం.. ఓటు ప్రాధాన్యత తెలుపడం ఎలాగో తెలుసా..?
Graduate Mlc By Election
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: May 26, 2024 | 12:02 PM

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక తుది అంకానికి చేరుకుంది. ప్రచారానికి గడువు ముగియడంతో ఇక అందరి దృష్టి పోలింగ్‌పై పడింది. మే 27వ తేదీన ఉదయం 8గంటలకు పోలింగ్‌ ప్రారంభం కానుంది. సాయంత్రం నాలుగింటికి ముగియనుంది. పోలింగ్ కోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. జిల్లాల కేంద్రాల్లో బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ మెటీరియల్ పంపిణీ చేస్తున్నారు. పోలింగ్ రోజు ఉదయం 6 నుంచి రాత్రి 8గంటల వరకు 144 సెక్షన్ అమలు చేయనున్నారు. 48 గంటలపాటు వైన్‌ షాపులు బంద్ చేశారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 52మంది బరిలో ఉన్నారు. జంబో బ్యాలెట్ పేపర్‌తో పోలింగ్ నిర్వహించనున్నారు ఎన్నికల అధికారులు. మొత్తం 4లక్షల 63వేల 839 మంది ఓటర్లు ఉండగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో లక్షా 73వేల 406మంది, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లక్షా 23వేల 985, ఉమ్మడి నల్గొండ జిల్లాలో లక్షా 66వేల 448 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. పోలింగ్ డే రోజు ఈ మూడు జిల్లాల్లో ప్రత్యేక సెలవు ప్రకటించారు. అధికారులు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద పోలింగ్ సామాగ్రి పంపిణీ చేశారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు జరిగే పోలింగ్ కు అధికార యంత్రాంగం చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రచారం ముగించిన అభ్యర్థులు ఇక పట్టభద్రుల ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. విద్యావంతుల ఓటు ప్రాధాన్యత తెలుపడం ఎలాగో తెలుసా..?

అయితే సాధారణ ఎన్నికలతో పోల్చితే పట్టభద్రుల పోలింగ్ కాస్త భిన్నంగా ఉంటుంది.. 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన నేపథ్యంలో జంబో బ్యాలెట్ ద్వారా పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఓటర్లు అభ్యర్థులకు అంకె ద్వారా వారి ప్రాధాన్యత తెలపాల్సి ఉంటుంది. ఒకటోవ ప్రాధాన్యత, రెండోవ ప్రాధాన్యత ఇలా వారికి నచ్చిన అభ్యర్థికి ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాల్సి ఉంటుంది.

ఓటు వేసే క్రమంలో ఇంటూ గుర్తు, ఇతర సింబల్స్ రాయకూడదు. మొదటి ప్రాధాన్యత అయితే అక్కడ ఒక నిలువు గీత మాత్రమే పెట్టి వారి ప్రాధాన్యత తెలపాలి. పోలింగ్ బూత్‌లో ఇచ్చిన పెన్ను మాత్రమే వాడాలి. కాదని ఎలాంటి ప్రయోగాలు చేసిన మీ ఓటు బురదలో వేసినట్లే అవుతుందంటున్నారు ఎన్నికల సంఘం అధికారులు. సోమవారం 27వ తేదీ ఉదయం 8గంటల నుండి సా.4 వరకు పోలింగ్ జరుగుతుంది.. 48 గంటల పాటు మూడు జిల్లాల పరిధిలో మద్యం దుకాణాలు మూసి వేశారు. పోలింగ్ రోజు ఉ.6 నుండి సా.8 వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!