PM Modi: హైదరాబాద్లో తన ఐడియా ఆఫ్ ఇండియాను వివరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
నాలుగోవ విడత పార్లమెంట్ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. నేటితో ప్రధాని మోదీ తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎల్బీ స్టేడియం సభలో పాల్గొన్న మోదీ.. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఫినిషింగ్ టచ్ గట్టిగానే ఇచ్చారు. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పడొక లెక్క.. అన్నట్లు ప్రధాని మోదీ ప్రసంగం అడుగడుగునా ఉర్రూతలు ఊగిస్తూ సాగింది.
నాలుగోవ విడత పార్లమెంట్ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. నేటితో ప్రధాని మోదీ తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎల్బీ స్టేడియం సభలో పాల్గొన్న మోదీ.. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఫినిషింగ్ టచ్ గట్టిగానే ఇచ్చారు. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పడొక లెక్క.. అన్నట్లు ప్రధాని మోదీ ప్రసంగం అడుగడుగునా ఉర్రూతలు ఊగిస్తూ సాగింది. ప్రధాని విషయాన్ని స్పష్టంగా ప్రజలకు వివరిస్తుంటే, జనం నుంచి అంతే రేంజ్లో రియాక్షన్ రావడంతో, ఎల్బీ స్టేడియం మొత్తం మోదీ నినాదాలతో మార్మోగింది.
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో 10 నుంచి 12 సీట్లు గెలవాలన్నదే టార్గెట్గా కమలనాథులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అందుకే అగ్రనేతలు తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలను కలిపి ఎల్బీ స్టేడియంలో భారీ బహరింగ సభ నిర్వహించారు బీజేపీ నేతలు. అయితే.. చివరి సభలో మోదీ, తీవ్రస్థాయిలో విపక్షాలపై విరుచుకుపడ్డారు.
జూన్ 4 తర్వాత ఉమ్మడి పౌరస్మృతి వ్యతిరేకులు, ఆర్టిక్ 370 రద్దు వద్దన్న వ్యక్తులు పారిపోక తప్పదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. మధ్య తరగతి ప్రజల కలలను భారతీయ జనతా పార్టీ సర్కార్ నెరవేరుస్తోందన్నారు. గత పదేళ్లలో ఎన్నో సమస్యలకు ఎన్డీయే సర్కార్ పరిష్కారం చూపిందన్న మోదీ. డిజిటల్ రంగంలో, స్టార్టప్ సంస్థల్లో నేడు భారత్ సూపర్ పవర్ వంటి అనేక అంశాల్లో సాధించిన విజయాలే మోదీ ట్రాక్ రికార్డ్ అయితే, దేశాన్ని లూటీ చేయడం, వారసత్వ రాజకీయాలు చేయడంలో దేశాన్ని విభజించి పాలించాలనేది ఆ పార్టీ కుట్ర అని మోదీ విమర్శించారు. రాముడికి పూజ చేయడం తప్పా? దేశ ద్రోహమా? అన్నారు మోదీ.
రామమందిరం, రామనవమి జరుపుకోవడం సరికాదన్నారు కాంగ్రెస్ నేతలు. రాముడిని పూజించడం భారతదేశ ఆలోచనకు విరుద్ధమని వారు అంటున్నారు. ఎప్పుడూ ఫారిన్ లెన్స్తో భారతదేశాన్ని చూసే కాంగ్రెస్కు భారతదేశం అనే ఆలోచన లేదన్నారు మోదీ. ఏది ఏమైనప్పటికీ…భారతదేశం ఆలోచన ఏంటో ఒక్కటిగా వివరించారు ప్రధాని నరేంద్ర మోదీ.
భారతదేశం ఆలోచన… భారతదేశపు వేల సంవత్సరాల నాటి సంస్కృతికి ప్రతిబింబం. ఐడియా ఆఫ్ ఇండియా అంటే…సత్యమేవ జయతే భారతదేశం ఆలోచన.. అహింస అత్యున్నత మతం. భారతదేశం ఆలోచన అంటే ఆచరః పర్మో ధర్మః. భారతదేశం ఆలోచన అంటే… అహింసో పరమ ధర్మం: ఐడియా ఆఫ్ ఇండియా అంటే ఏకం సత్ విప్రా, బహుధా వదంతి ఐడియా ఆఫ్ ఇండియా అంటే వసుధైక కుటుంబం. భారతదేశం ఆలోచన అంటే సర్వ పంత్ సమానత్వం ఐడియా ఆఫ్ ఇండియా అంటే ఆప్ దీపో భవ ఐడియా ఆఫ్ ఇండియా అంటే బుద్ధం శరణం గచ్ఛామి భారతదేశ ఆలోచన అంటే సర్వే భద్రాణి పశ్యన్తు, మా కశ్చిద్ దుఃఖ్ భాగ్ భవేత్ భారతదేశం ఆలోచన… దాతృత్వ సాతాన్ విభూతే: భారతదేశం ఆలోచన: మానవ సేవయే.. మానవ సేవ భారతదేశం ఆలోచన అంటే ఈశ్వర్: సర్వభూతానన్ ఐడియా ఆఫ్ ఇండియా అంటే అన్ని వెలుగుల మధ్య సమానత్వం. భారతదేశం ఆలోచన… దేవుడు గొప్పవాడు భారతదేశం ఆలోచన.. మనిషిలో నారాయణుడు, జీవిలో శివుడు! భారతదేశం ఆలోచన … దేవి సర్వభూతేషు మాత్రి లాంటి సంస్థ. ఐడియా ఆఫ్ ఇండియా…మా విద్విషవహై. ఐడియా ఆఫ్ ఇండియా… మిచ్చామి దుక్కడం. భారతదేశం ఆలోచన.. లక్ష్మణుడికి తన బంగారు లంకపై ఆసక్తి ఉండేది. తల్లి జన్మస్థలం, స్వర్గం, స్వర్గం, పేదరికం, జనని జన్మ భూమిచ్చా.. స్వర్గాధపి, ధరియసి, అందుకే ఈ భూమి.. నాకు స్వర్గం కంటే ప్రియమైనది అంటూ ప్రధాని మోదీ ఎమోషనల్ ప్రసంగం చేశారు
అంతేకాదు, ఇవి శ్రీరాముడి మాటలు మాత్రమే కాదు, ఈ రోజు భారతదేశం ఈ ఆలోచన కేవలం నమ్మకాలకే పరిమితం కాలేదు. ఈ భారతదేశపు ఆలోచనే నేటి భారతదేశానికి గుర్తింపు అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ భారతదేశం ఆలోచన నేడు భారతదేశం వాయిస్ అన్నారు. మరి అందుకే ఈరోజు ఐడియా ఆఫ్ ఇండియా అంటే అంతర్జాతీయ యోగా దినోత్సవం. భారతదేశం ఆలోచన అంటే ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు. భారతదేశం ఆలోచన అంటే ప్రపంచానికి ఒక సూర్యుడు ఒక భూమి ఒక గ్రిడ్ ఆలోచన, ఐడియా ఆఫ్ ఇండియా అంటే చంద్రునిపై శివశక్తి పాయింట్, ఐడియా ఆఫ్ ఇండియా…మదర్ ఆఫ్ డెమోక్రసీ, భారతదేశం ఆలోచన అంటే.. అందరికీ న్యాయం, ఎవరికీ శాంతి భద్రతలు, భారతదేశం ఆలోచనకు వ్యతిరేకంగా మనకు ఈ ప్రేరణ లభించిన శ్రీరాముని ఆరాధనను వద్దంటుంది.
అంతేకాదు, అటు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్లాగే.. కాంగ్రెస్ కూడా తెలంగాణను లూటీ చేస్తోందన్నారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ హామీలు మరిచి.. ఫేక్ వీడియోల దుకాణం తెరిచిందని విమర్శించారు. ఆర్ఆర్ ట్యాక్స్పై ఢిల్లీలో సైతం చర్చ జరుగుతుందన్నారు మోదీ. వీటన్నింటికి సమాధానం చెప్పే సమయం దగ్గరకు వచ్చిందన్నారు.
వారసత్వ రాజకీయాలే కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్. గతంలో బాంబు పేళుళ్లు జరిగేవి.. ఇప్పుడు జరుగుతున్నాయా? అన్ని ప్రధాని మోదీ ప్రశ్నించారు. ఢిల్లీలో బలమైన ప్రభుత్వం వచ్చే పేళ్లు ఆగిపోయాయి. కాంగ్రెస్కు ఓటు వేయడమంటే మళ్లీ పాత రోజులను ఆహ్వానించడమే అన్నారు. మీ సంపదను లాక్కునేవారు కావాలా? సంపదను పెంచేవారు కావాలా? తేల్చుకోవాలని మోదీ సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…