AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kishan Reddy: బీఆర్‌ఎస్‌ ఓటమిని తట్టుకోలేకపోతోంది.. రేవంత్ మళ్లీ మోసం చేస్తున్నారు.. కిషన్ రెడ్డి ఫైర్..

బీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ నేతల తీరుపై తెలంగాణ బీజేపీ చీఫ్ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని బీఆర్‌ఎస్‌ నేతలు ఇంకా జీర్జించుకోలేక ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు కిషన్‌రెడ్డి. అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి..మళ్లీ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.

Kishan Reddy: బీఆర్‌ఎస్‌ ఓటమిని తట్టుకోలేకపోతోంది.. రేవంత్ మళ్లీ మోసం చేస్తున్నారు.. కిషన్ రెడ్డి ఫైర్..
Telangana Politics
Shaik Madar Saheb
|

Updated on: Apr 20, 2024 | 7:38 PM

Share

బీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ నేతల తీరుపై తెలంగాణ బీజేపీ చీఫ్ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని బీఆర్‌ఎస్‌ నేతలు ఇంకా జీర్జించుకోలేక ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు కిషన్‌రెడ్డి. అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి..మళ్లీ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి శనివారం బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బలహీన పడిందని.. ఆ పార్టీ పని అయిపోయినట్టేనంటూ వ్యాఖ్యానించారు. గులాబీ పార్టీ ఓడిపోయి ఐదు నెలలు గడిచినా.. కేసీఆర్, కేటీఆర్ ఇంకా ఓటమిని అంగీకరించలేదని ఎద్దేవా చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌లు పార్టీ ఓటమిని తట్టుకోలేక బీజేపీపై విమర్శలు చేస్తున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు.

ఎన్నికల ప్రచారంలో బీజేపీ అన్ని పార్టీల కంటే ముందుందని… అభ్యర్థులను కూడా అందరి కంటే ముందే ప్రకటించామని కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీకి ప్రజల సంపూర్ణ మద్దతు ఉందన్నారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సత్తా చాటుతుందని, ఎక్కువ స్థానాల్లో సీట్లను గెలుచుకుంటామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

గ్యారంటీల అమలు విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను మళ్లీ మోసం చేస్తున్నారని మండిపడ్డారు కిషన్‌రెడ్డి. గ్యారంటీల విషయంలో రేవంత్‌ అబద్ధాలు చెబుతున్నారు.. జూన్‌ 5 తర్వాత గ్యారంటీలు అమలు చేస్తారా..? కామారెడ్డిలో BRSను ఓడించింది బీజేపీనే అంటూ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..