AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెట్రో ప్రయాణికులకు ముఖ్య సూచన.. ఈ రోజు నుంచి రైలు వేళల్లో మార్పులు.. కొత్త టైమింగ్స్

hyderabad metro rail: మెట్రో రైల్ సర్వీసు వేళ్లలో మార్పులు ఈ రోజు నుంచి అమలులోకి వచ్చాయి.  దీంతో  లాక్ డౌన్ సమయంలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం12.45 వరకూ...

మెట్రో ప్రయాణికులకు ముఖ్య సూచన.. ఈ రోజు నుంచి రైలు వేళల్లో మార్పులు.. కొత్త టైమింగ్స్
Hyderabad Metro Timings
Sanjay Kasula
|

Updated on: Jun 01, 2021 | 8:52 AM

Share

తెలంగాణలో లాక్ డౌన్ సడలింపు నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీసు వేళ్లలో మార్పులు చోటు చేసుకున్నాయి. మెట్రో రైల్ సర్వీసు వేళ్లలో మార్పులు ఈ రోజు నుంచి అమలులోకి వచ్చాయి.  దీంతో  లాక్ డౌన్ సమయంలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం12.45 వరకూ అన్ని రకాల కార్యకలాపాలకు సడలింపు ఇచ్చింది. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులు నడవనున్నాయి. ఈ మేరకు లాక్ డౌన్ కాలంలో మొదటి రైలు టెర్మినల్ స్టేషన్ల నుంచి ఉదయం 7 గంటలకు బయలుదేరనుంది. చివరి రైలు ఉదయం 11:45 నిమిషాలకు మొదలు కానుంది. ఈ రైలు ఉదయం 12:45 గంటల కల్లా సంబంధిత చివరి టెర్మినేషన్ స్టేషన్‌కు చేరుకుంటుంది.

ప్రతి ఒక్కరి భద్రత కోసం, ప్రయాణికులు సామాజిక దూరం, ఫేస్ మాస్క్‌లు ధరించడం, క్రమంగా హ్యాండ్ శానిటైజేషన్, థర్మల్ స్క్రీనింగ్ వంటి కోవిడ్-19 భద్రతా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని మెట్రో రైలు సంస్థ సూచించింది. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని సురక్షితంగా ఉంచే ప్రయత్నాలలో భద్రతా సిబ్బంది, హైదరాబాద్ మెట్రో రైలు సిబ్బందితో సహకరించాలని అభ్యర్థించారు.

ఇవి కూడా చదవండి : Good News: ఈ రోజు నుంచి మార్కెట్లోకి రానున్న డీఆర్‌డీవో మందు.. అందుబాటులోకి 6-8 లక్షల 2డీజీ మెడిసిన్ ప్యాకెట్లు

Good News: జూన్‌లో జోరందుకోనున్న కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ.. కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన

New Rules From Today: ఈ రోజు నుంచి చాలా మారిపోతున్నాయి..! గమనించారా..! అయితే మీ ఇష్టం..!