Hyderabad: హైదరాబాద్‌లో పలు కార్పొరేట్ హాస్పిటల్స్‌కు షాక్.. కరోనా పేషెంట్స్‌కు బిల్లుల రీఫండ్

హైదరాబాద్ పరిసరాల్లోని ఆసుపత్రులు అధిక ఛార్జీలు వసూలు చేశారనే ఫిర్యాదులపై తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ చర్యలకు దిగింది. ఇందులో భాగంగా మొత్తం 44 ఆసుపత్రులకు పేషంట్లకు డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా వైద్య ఆరోగ్య శాఖ నోటీసులు జారీ చేసింది

Hyderabad: హైదరాబాద్‌లో పలు కార్పొరేట్ హాస్పిటల్స్‌కు షాక్.. కరోనా పేషెంట్స్‌కు బిల్లుల రీఫండ్
Hyderabad Hospital
Follow us

|

Updated on: May 25, 2022 | 12:51 PM

Hyderabad: కరోనా మహమ్మారి (Corona Virus) వెలుగులోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ ఆస్పత్రి నుంచి చిన్న ఆసుపత్రులు కూడా తమ దగ్గరకు చికిత్స కోసం వచ్చిన బాధితుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేశాయని ఆరోపణలు అనేకం వినిపించాయి. అయితే తాజాగా హైదరాబాద్ పరిసరాల్లోని ఆసుపత్రులు అధిక ఛార్జీలు వసూలు చేశారనే ఫిర్యాదులపై తెలంగాణ(Telangana) రాష్ట్ర ఆరోగ్య శాఖ చర్యలకు దిగింది. ఇందులో భాగంగా మొత్తం 44 ఆసుపత్రులకు పేషంట్లకు డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా వైద్య ఆరోగ్య శాఖ నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఏకంగా రూ.1.61 కోట్ల మొత్తం రోగుల కుటుంబాలకు తిరిగి ఇచ్చారు.  ఇందులో భాగంగా ఏకంగా జూన్ 22, 2021 నాటికి రోగుల కుటుంబాలకు రూ. 1,61,22,484 తిరిగి ఇచ్చినట్లు పేర్కొన్నారు.

హైదరాబాద్‌లోని నాలుగు ఆసుపత్రులు ఒక్కొక్కటి రూ. 10 లక్షలకు పైగా తిరిగి ఇవ్వగా..  కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్  ఆసుపత్రి రోగి కుటుంబ సభ్యులకు మొత్తం రూ. 27.41 లక్షలు తిరిగి ఇచ్చి అగ్రస్థానంలో నిలిచింది. నగరంలోని  కూకట్‌పల్లి, ఎల్‌బీనగర్‌, సచివాలయం, హైటెక్‌ సిటీ, బషీర్‌బాగ్‌, గచ్చిబౌలి,  నాగోల్‌ ఇలా అనేక ప్రాంతాల్లోని అనేక ఆస్పత్రులు తాము కరోనా సమయంలో వసూలు చేసిన డబ్బులను రోగి కుటుంబాలకు తిరిగి ఇచ్చాయి.

ఇవి కూడా చదవండి

నగరంలోని పలు ఆసుపత్రులు ఎక్కువ మొత్తాన్ని వాపసు చేసినప్పటికీ.. ఎక్కువ ఛార్జీలు వసూలు చేసినట్లు గుర్తించిన అనంతరం రోగులకు డబ్బును తిరిగి ఇచ్చే ఆసుపత్రుల జాబితాలో మొత్తం 44 ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నట్లు ఆర్టీఐ వెల్లడించింది.

Hyd 1

Hyd 1

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..