AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSRTC: సిటీ బస్సుల్లో చిల్లర సమస్యలకు చెక్‌.. క్యాష్‌తో పనిలేకుండా డిజిటల్‌ చెల్లింపులు.. ఎప్పటినుంచంటే?

సిటీ బస్సుల్లో చిల్లర సమస్యలకు చెక్‌ పెడుతూ క్యాష్‌తో పనిలేకుండా, ఈ మెషిన్ల ద్వారా డిజిటల్‌ చెల్లింపులను ప్రవేశపెడుతున్నట్లు రీజియన్‌ మేనేజర్‌ చెప్పారు.

TSRTC: సిటీ బస్సుల్లో చిల్లర సమస్యలకు చెక్‌..  క్యాష్‌తో పనిలేకుండా డిజిటల్‌ చెల్లింపులు.. ఎప్పటినుంచంటే?
Tsrtc
Basha Shek
|

Updated on: Oct 15, 2022 | 4:05 PM

Share

సిటీ బస్సుల్లో యూపీఐ చెల్లింపులను స్వీకరించేందుకు టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ సిద్ధమైంది. వచ్చే నెల నుంచే ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. క్రెడిట్‌, డెబిట్‌ కార్డులతో పాటు ఫోన్‌పే, గూగుల్‌ పే దితర డిజిటల్‌ చెల్లింపులకు అవకాశం కల్పిస్తున్నట్లు సికింద్రాబాద్‌ రీజియన్‌ మేనేజర్‌ వెంకన్న తెలిపారు. కాగా ఇప్పటికే దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ఐ-టిమ్స్‌ సహాయంతో డిజిటల్‌ చెల్లింపులు జరుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈనేపథ్యంలో సిటీ బస్సుల్లో చిల్లర సమస్యలకు చెక్‌ పెడుతూ క్యాష్‌తో పనిలేకుండా, ఈ మెషిన్ల ద్వారా డిజిటల్‌ చెల్లింపులను ప్రవేశపెడుతున్నట్లు రీజియన్‌ మేనేజర్‌ చెప్పారు.

కాగా ఇప్పటికే మియాపూర్‌-1, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, బీహెచ్‌ఈఎల్‌, కుషాయిగూడ డిపోల నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ఇప్పటికే ప్రయోగాత్మకంగా యూపీఐ చెల్లింపులు విజయవంతంగా అమలు చేశామని వెంకన్న తెలిపారు. అలాగే ఎయిర్‌పోర్టుకు వెళ్లే బస్సుల్లోనూ డిజిటల్‌ చెల్లింపుల విధానం అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. కాగా ఆర్టీసీ ప్రయాణికుల కోసం మరిన్ని సేవలు, సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురానున్నారు. బస్సు పాసుల రెన్యూవల్‌ కోసం కౌంటర్ల ముందు గంటల తరబడి వేచి చూసే పని లేకుండా.. సిటీ బస్సుల్లోనే బస్సు ఈ అవకాశం కల్పించనున్నట్లు రీజియన్‌ మేనేజర్‌ పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి