AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: న్యూఇయర్ వేడుకలకు ముందు భారీగా డ్రగ్స్‌ పట్టివేత.. రూ.3.14 కోట్ల విలువైన ఆల్ఫ్రా జోం సీజ్‌

తెలంగాణ రాష్ట్రంలో భారీగా మత్తు పదార్ధాలను నార్కోటిక్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 70 కిలోల ఆల్ప్రా జోలంను సీజ్ చేశారు. కేజీ ఆల్ఫ్రా జోం 2.5 లక్షలకు కొనుగోలు చేసి కస్టమర్లకు 3.5 లక్షలకు విక్రయిస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు దాడి చేశారు. ఆల్ప్రా జోలం విక్రయాలపై ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 66 కేసులు టీఎస్ న్యాబ్ నమోదు చేసింది. గడిచిన రెండేళ్లలో తెలంగాణలో 43 కేసులు నమోదయ్యాయి..

Hyderabad: న్యూఇయర్ వేడుకలకు ముందు భారీగా డ్రగ్స్‌ పట్టివేత.. రూ.3.14 కోట్ల విలువైన ఆల్ఫ్రా జోం సీజ్‌
Alprazolam Drugs
Srilakshmi C
| Edited By: |

Updated on: Dec 26, 2023 | 12:45 PM

Share

హైదరాబాద్‌, డిసెంబర్ 26: తెలంగాణ రాష్ట్రంలో భారీగా మత్తు పదార్ధాలను నార్కోటిక్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 70 కిలోల ఆల్ప్రా జోలంను సీజ్ చేశారు. కేజీ ఆల్ఫ్రా జోం 2.5 లక్షలకు కొనుగోలు చేసి కస్టమర్లకు 3.5 లక్షలకు విక్రయిస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు దాడి చేశారు. ఆల్ప్రా జోలం విక్రయాలపై ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 66 కేసులు టీఎస్ న్యాబ్ నమోదు చేసింది. గడిచిన రెండేళ్లలో తెలంగాణలో 43 కేసులు నమోదయ్యాయి. ఒక్కో గ్రాము 10 వేల రూపాయల చొప్పున డ్రగ్స్ ముఠా అమ్మకాలు జరుపుతోంది. రూ.3.14 విలువైన ఆల్ప్రాజోలంను డీఆర్ఐ సీజ్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు.

ఈ దాడిలో పరమేశ్వర కెమికల్స్ ఎండీ కిరణ్ కుమార్, లింగయ్య గౌడ్ నుంచి 70 కేజీల మత్తు పదార్థం స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ ముఠాలో గచ్చిబౌలికి చెందిన నరసింహ కీలక సూత్రధారిగా గుర్తించారు. నరసింహ గౌడ్‌తోపాటు అతడి కొడుకు రాజశేఖర్‌ను కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రతి నెల హైదరాబాద్‌లో నలభై కేజీల వరకూ ఆల్ప్రా జోలం డ్రగ్‌ను విక్రయిస్తున్నట్లు నరసింహ పోలీసుల విచారణలో అంగీకరించినట్లు తెలిసింది. ఈ ముఠా వెనక ఇంకా ఎంత మంది ఉన్నారన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత 25 ఏళ్లుగా డ్రగ్స్ ట్రాన్స్‌పోర్ట్‌లో నరసింహ గౌడ్ యాక్టీవ్‌గా ఉన్నాడు. ఢిల్లీ నుంచి మెట్రో కొరియర్ సర్వీస్‌లో మత్తు పదార్థాలు తరలించినట్లు గుర్తించారు. వీటి కోసం నరసింహా హవాలా మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

మత్తు పదార్థాల ద్వారా వచ్చిన అర్జించిన డబ్బుతో నరసింహ గౌడ్ భారీగానే ఆస్తులు కూడబెట్టాడు. ఇప్పటికే అతడిపై పలు కేసులు ఉన్నట్లు నార్కోటిక్ బ్యూరో అధికారులు చెబుతున్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పెద్దయెత్తున మత్తు పదార్థాలను విక్రయించేందుకు వీటిని ఢిల్లీ నుంచి రాష్ట్రానికి తీసుకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. మొత్తం 34 కేజీల ఆల్ఫ్రా జోలంను నర్సింహ సిటీకి తీసుకువచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
మీ మెదడు పవర్ నాలుగింతలు!.. 'పోమోడోరో' టెక్నిక్ గురించి తెలుసా?
మీ మెదడు పవర్ నాలుగింతలు!.. 'పోమోడోరో' టెక్నిక్ గురించి తెలుసా?
శని దేవుడు దయతో ఈ రాశుల జీవితంలో భారీ మార్పులు
శని దేవుడు దయతో ఈ రాశుల జీవితంలో భారీ మార్పులు
శ్రీరామ నవమి వేడుకల్లో నీతా అంబానీ.. రామాయణ ఘట్టాలతో మెరిసిన చీర!
శ్రీరామ నవమి వేడుకల్లో నీతా అంబానీ.. రామాయణ ఘట్టాలతో మెరిసిన చీర!
పొద్దుగూకులు ఏసీలో ఉంటే ఏమవుతుంది..? పెద్ద కథే ఉందిగా..
పొద్దుగూకులు ఏసీలో ఉంటే ఏమవుతుంది..? పెద్ద కథే ఉందిగా..
డయాబెటిస్ మందులు మెదడుపైనా ప్రభావం చూపుతాయా? తాజా స్టడీ షాకింగ్..
డయాబెటిస్ మందులు మెదడుపైనా ప్రభావం చూపుతాయా? తాజా స్టడీ షాకింగ్..
స్టైల్ అనుకుంటే పొరపాటే.. కుకింగ్ ప్యాన్‌కి ఈ రంధ్రం ఎందుకో తెలుస
స్టైల్ అనుకుంటే పొరపాటే.. కుకింగ్ ప్యాన్‌కి ఈ రంధ్రం ఎందుకో తెలుస
దోసె పెనంకు అంటుకుపోతుందా?.. ఈ పొరపాట్లు చేయకండి
దోసె పెనంకు అంటుకుపోతుందా?.. ఈ పొరపాట్లు చేయకండి
ఏప్రిల్ 1 నుంచి టేక్‌ హోమ్‌ సాలరీ తగ్గుతుందా?
ఏప్రిల్ 1 నుంచి టేక్‌ హోమ్‌ సాలరీ తగ్గుతుందా?
తులసితో కలిసి భాను ఎంత పని చేసింది.. ప్రియుడు దక్కడనుకుని..
తులసితో కలిసి భాను ఎంత పని చేసింది.. ప్రియుడు దక్కడనుకుని..
అతిగా నిద్రపోతే బరువు పెరుగుతారా?.. అసలు నిజం తెలిస్తే షాకే
అతిగా నిద్రపోతే బరువు పెరుగుతారా?.. అసలు నిజం తెలిస్తే షాకే