Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SCR: రైల్వే ప్రయాణీకులకు అలర్ట్.. వర్షం కారణంగా పలు రైళ్లు రద్దు

వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) అప్రమత్తమైంది. పలు రైళ్లను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14 నుంచి 17వరకు 34 ఎంఎంటీఎస్ (MMTS) రైళ్లను రద్దు చేస్తూ ప్రకటన...

SCR: రైల్వే ప్రయాణీకులకు అలర్ట్.. వర్షం కారణంగా పలు రైళ్లు రద్దు
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jul 13, 2022 | 8:08 PM

వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) అప్రమత్తమైంది. పలు రైళ్లను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14 నుంచి 17వరకు 34 ఎంఎంటీఎస్ (MMTS) రైళ్లను రద్దు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. సికింద్రాబాద్‌- ఉందానగర్‌-సికింద్రాబాద్‌ ప్యాసింజర్‌ రైలు, సికింద్రాబాద్‌-ఉందానగర్‌ మెము, మేడ్చల్‌-ఉందానగర్‌ మెము, ఉందానగర్‌-సికింద్రాబాద్‌ మెము స్పెషల్‌, సికింద్రాబాద్‌- ఉందానగర్‌ మెము స్పెషల్‌ రైలు, మేడ్చల్‌-సికింద్రాబాద్‌ మెము, కాకినాడ పోర్టు-విశాఖపట్నం మెము రైళ్లు రద్దు చేసిన జాబితా లో ఉన్నాయి. లింగంపల్లి – హైదరాబాద్ మార్గంలో 9, హైదరాబాద్ – లింగంపల్లి మార్గంలో 9, ఫలక్ నుమా – లింగంపల్లి మార్గంలో 7, లింగంపల్లి – ఫలక్ నుమా మార్గంలో 7, సికింద్రాబాద్ – లింగంపల్లి మార్గంలో 1, లింగపల్లి – సికింద్రాబాద్ మార్గంలో 1 సర్వీసును రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

Trains Cancelation Schedule

Trains Cancelation Schedule

ఉందానగర్- మేడ్చల్ మెము, సికింద్రాబాద్-బొల్లారం మెము, బొల్లారం-సికింద్రాబాద్ మెము, మేడ్చల్-సికింద్రాబాద్ మెము, సికింద్రాబాద్-మేడ్చల్ మెము స్పెషల్ రైళ్లు ఈనెల 14 నుంచి 17వ వరకు రద్దయ్యాయి. మరోవైపు.. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల మధ్య దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ మధ్య మరో ఆరు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు బుధవారం అధికారులు ప్రకటించారు. సికింద్రాబాద్ – నరసాపూర్, నరసాపూర్ – వికారాబాద్ మధ్య ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..