AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఎంజే మార్కెట్ ఘటనపై పోలీసుల నజర్.. భగవంత్ రావు, నంద కిషోర్‌పై కేసు నమోదు..

Telangana: వినాయకుడి నిమజ్జనం సమయంలో ఏంజే మార్కెట్‌లో చోటు చేసుకున్న ఘటనను పోలీసులు సీరియస్ తీసుకున్నారు. ఈ ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేశారు.

Telangana: ఎంజే మార్కెట్ ఘటనపై పోలీసుల నజర్.. భగవంత్ రావు, నంద కిషోర్‌పై కేసు నమోదు..
Ganesh Immersion
Shiva Prajapati
|

Updated on: Sep 10, 2022 | 11:08 PM

Share

Telangana: వినాయకుడి నిమజ్జనం సమయంలో ఏంజే మార్కెట్‌లో చోటు చేసుకున్న ఘటనను పోలీసులు సీరియస్ తీసుకున్నారు. ఈ ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేశారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యదర్శి భగవంత్ రావు, టీఆర్ఎస్ నేత నంద కిషోర్ వ్యాస్‌ బిలాల్ పై పలు సెక్షన్ల కేసు నమోదు చేశారు పోలీసులు. ఐపీసీ 341(న్యూసెన్స్ కేసు), 354, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

హైదరాబాద్‌లో సామూహిక గణేష్ నిమజ్జనం కోసం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఎంజే మార్కెట్ చౌరస్తా వద్ద స్వాగత వేదిక ఏర్పాటు చేశారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు హైదరాబాద్ వచ్చిన అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ వేదికపైకి వచ్చారు. హిమంత బిస్వా శర్మ, గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్ రావు ప్రసంగిస్తు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను అసభ్య పదజాలంతో విమర్శించారు. ఆ వ్యాఖ్యలతో ఆగ్రహానికి గురైన టీఆర్ఎస్ నాయకుడు నంద కిషోర్ వ్యాస్ బిలాల్.. వేదికపై భగవంత్ రావు మైక్‌ను లాగేసి అస్సాం సీఎం హిమంతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఘటన రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే, ఈ వ్యవహారాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. న్యాయ సలహా, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అబిడ్స్ పోలీసులు సమోటోగా కేసు నమోదు చేశారు. వేదికపై గొడవ చేసిన నందు బిలాల్‌పై సెక్షన్ 352, 341 కింద కేసు నమోదు చేయగా.. సీఎం కేసీఆర్‌ను అసభ్య పదజాలంతో దూషించిన భగవంత్ రావుపై 504, 352, 341 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.

ఏంజే మార్కెట్ ఘటనపై అసోం డీజీపీ ఆరా..

ఇవి కూడా చదవండి

ఇదిలాఉండగా అసోం డీజీపీ భాస్కర్ జ్యోతి మహంత ఏంజే మార్కెట్ ఘటనపై ఆరా తీశారు. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి ఫోన్ చేసి వివరాలు కోరారు. అయితే, ఈ ఫోన్‌ కాల్‌పై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని తెలంగాణ డీజీపీ కార్యాలయం ఖండించింది. అసోం డీజీపీ ఫోన్ చేసి వివరాలు అడిగారే తప్ప.. ఆ రాష్ట్ర సీఎం భద్రతకు బాధ్యులైన సంబంధిత తెలంగాణ పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఏమీ కోరలేదని, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు వాస్తవం కాదని స్పష్టం చేశారు. ఈ మేరకు డీజీపీ కార్యాలయం సీపీఆర్ఓ ఒక ప్రకటన విడుదల చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..