AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో కరోనాపై హైకోర్టులో విచారణ.. కేసులు తగ్గాయన్న ప్రభుత్వం.. ఎక్కడ తగ్గాయో చూపించాలని హైకోర్టు ప్రశ్న

Telangana Corona: తెలంగాణలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. రోజు మూడు వేల వరకు కేసులు నమోదు....

తెలంగాణలో కరోనాపై హైకోర్టులో విచారణ.. కేసులు తగ్గాయన్న ప్రభుత్వం.. ఎక్కడ తగ్గాయో చూపించాలని హైకోర్టు ప్రశ్న
Telangana High Court
Subhash Goud
|

Updated on: Apr 23, 2021 | 3:02 PM

Share

Telangana Corona: తెలంగాణలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. రోజు మూడు వేల వరకు కేసులు నమోదు కావడం ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణకు హెల్త్‌ సెక్రటరీ రిజ్వీ హాజరయ్యారు. కరోనా కట్టడికి నైట్‌ కర్ఫ్యూ అమలు చేస్తుందని ఏజీ అన్నారు. అయితే నైట్‌ కర్ఫ్యూ వల్ల కరోనా కేసులు తగ్గాయని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీంతో స్పందించిన కోర్టు ఎక్కడ కేసులు తగ్గాయో చూపించాలని హైకోర్టు సూచించింది. బార్లు, సినిమా థియేటర్ల దగ్గర ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలుపాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది.

కుంభమేళా వెళ్లిన వారిని ఇతర రాష్ట్రాలు క్వారంటైన్‌లో పెడుతున్నాయని, తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాష్ట్ర సరిహద్దుల్లో ఎలాంటి చర్యలు చేపట్టారని హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నికల ర్యాలీలు, సభలను ఎందుకు నియంత్రణ చేయడం లేదని తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మండిపడింది. అలాగే ఇతర దేశాల నుంచి వచ్చేవారిని ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్‌ ఎందుకు అడగడం లేదని ప్రశ్నల వర్షం కురిపించింది. అంతేకాదు ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్‌ రిపోర్టు 24 గంటల్లోపు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని, అదే వీఐపీలకు 24 గంటల్లోపే ఎందుకు ఇస్తున్నారని హైకోర్టు చురకలంటించింది. ప్రభుత్వం చెప్పిన వివరణపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

కాగా, తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గత మొదటి వేవ్‌లో కేసుల సంఖ్య పెరిగి తగ్గుముఖం పట్టినా.. ఈ సెకండ్‌వేవ్‌లో అంతకంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా రాష్ట్రంలో రోజుకు మూడు వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. గతంలో జీహెచ్‌ఎంసీలో ఎక్కువగా ఇతర జిల్లా, మండల కేంద్రాల్లో పెద్దగా కేసులు ఉండేవి కాదు. కానీ ఈ సెకండ్‌వేవ్‌లో జీహెచ్‌ఎంసీతో పాటు ఇతర జిల్లాలు, మండలాలు, గ్రామీణ ప్రాంతాలను సైతం కరోనా మహమ్మారి వదలడం లేదు. అక్కడ వందల సంఖ్యలో కేసులు నమోదు కావడం, పదుల సంఖ్యలో మరణాలు సంభవిన్నాయి.

ఇవీ చదవండి: India Covid-19: భారత్‌లో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. ఒక్క రోజే 2,263 మంది మృతి.. కేసులు ఎన్నంటే..?

Telangana Corona Cases: తెలంగాణలో కరోనా విలయ తాండవం.. రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు.. కొత్తగా 6,206 మందికి పాజిటివ్

గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..